Steroids: ఎవరికి వాటి అవసరం ఉంటుంది?
లక్షణాలు లేకుండా స్టెరాయిడ్స్ వాడకూడదు.
ప్రముఖ పల్మనాలజిస్ట్ డా.రాజేశ్వర్
కొవిడ్ రెండోదశలో స్టెరాయిడ్స్ వినియోగం విపరీతంగా పెరిగింది. అందరికీ వాటిని ఇవ్వాల్సిన అవసరం లేదంటున్నారు ప్రముఖ ఛాతి వైద్య నిపుణులు డాక్టర్ రాజేశ్వర్. కరోనా సోకిన వ్యక్తికి ఐదు రోజుల తర్వాత కూడా లక్షణాలు తగ్గకుంటే వైద్యుల సిఫార్సు మేరకే స్టెరాయిడ్స్ను వాడాల్సి ఉంటుందన్నారు. కానీ కొందరు కరోనా రాకముందే ముందస్తుగా స్టెరాయిడ్స్ తీసుకుంటూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అసలు స్టెరాయిడ్స్ వినియోగం ఎలా ఉండాలి?ఎవరికి వాటి అవసరం ఉంటుంది? ఏయే జాగ్రత్తలు తీసుకుంటే బ్లాక్ ఫంగస్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చన్న విషయాలపై డా.రాజేశ్వర్తో ముఖాముఖి.
ప్రధానంగా స్టెరాయిడ్స్ ఎలా వాడుతారు? వాటి నియమ నిబంధనలు ఏమిటి?
* కొవిడ్ లక్షణాలు మొదలయ్యాక 5 నుంచి 7 రోజుల్లో మాత్రమే ఈ స్టెరాయిడ్స్ వాడాలి. కొవిడ్ లక్షణాలు మొదలైన మొదటి వారంలోపల వైరస్ వృద్ధి ఎక్కువగా ఉంటుంది. మొదటి వారం తర్వాత వైరస్ ఉద్ధృతి తగ్గిపోయి వాపు ప్రక్రియ ఉంటుంది. కాబట్టి 5 నుంచి 7 రోజుల తర్వాత మాత్రమే స్టెరాయిడ్స్ తగినంత మోతాదులోనే వాడాల్సి ఉంటుంది.
* రెండోవారం లోపల స్వల్ప లక్షణాలు ఉన్నట్లైతే.. అంటే మొదటి వారం తర్వాత లక్షణాలు తగ్గి, మళ్లీ రెండోవారంలో మొదలైనట్లైతే.. జ్వరం, ఒళ్లు నొప్పులు, తీవ్రమైన అలసట, తలనొప్పి.. ఇలాంటి సందర్భాల్లో వైద్యుల సలహా మేరకు వాడాల్సి ఉంటుంది. దీనికి సరైన మోతాదులో ఉండే ఇతర స్టెరాయిడ్స్ కూడా వాడుకోవచ్చు.
* అదేవిధంగా ఎవరిలోనైనా తీవ్రమైనటువంటి వ్యాధి ఉన్నట్లైతే.. అంటే ఆక్సిజన్ స్థాయి 94 కంటే తక్కువగా విశ్రాంతి సమయంలో ఉన్నప్పుడు, హోం ఐసోలేషన్లో ఉన్నటువంటి వ్యక్తులు, లేదా చికిత్స తీసుకుంటున్నవారెవరైనా ఆరు నిమిషాలు వాకింగ్ చేశాక 95 కంటే ఐదు శాతం ఆక్సిజన్స్థాయి పడిపోయినప్పుడు.. వీరికి బాడీ వెయిట్ చొప్పున స్టెరాయిడ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఆక్సిజన్ స్థాయీలు ఎక్కువగా పడిపోతున్నప్పుడు, సీఆర్పీ స్థాయి ఎక్కువగా పెరిగినప్పుడు.. ఇలాంటి సమయంలో రెండు మిల్లీ గ్రాముల కంటే ఎక్కువగా ప్రతీరోజూ వాడాల్సిన అవసరం ఉంటుంది.
* కొన్ని సందర్భాల్లో నిష్ణాతులైనటువంటి వైద్యులు పల్స్ థెరపీ అని ఇస్తుంటారు. వ్యాధి నిరోధక కణాలు మనపైనే దాడిచేస్తునప్పుడు.. పల్స్థెరపీలో ప్రతీరోజూ 500 మిల్లీ గ్రాముల కంటే ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇది కేవలం వైద్యుల పర్యవేక్షణలోనే తీసుకోవాలే తప్ప సొంతంగా వాడకూడదు.
ఇప్పుడు చాలామందికి ఆసుప్రతిలో చేరగానే స్టెరాయిడ్స్ ఇస్తున్నారు. దానివల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది?
లక్షణాలు లేనివారు, స్వల్ప లక్షణాలు ఉన్నవారు కూడా స్టెరాయిడ్స్ వాడటం జరుగుతోంది. దీనివల్ల దుష్ర్పభావాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీటిని ఒకేసారి ఎక్కువ మోతాదులో వాడినప్పుడు రక్తం లోపల గ్లూకోజ్ స్థాయి అధికంగా పెరుగుతుంది. అంటే షుగర్ లేనివారికి షుగర్వచ్చే ముప్పు ఉంటుంది. షుగర్ ఉన్న వ్యక్తులకు రక్తంలో గ్లూకోజ్ స్థాయి మరింతగా పెరిగే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల వ్యాధినిరోధక శక్తి తగ్గిపోయి ఫంగస్ ప్రబలే అవకాశం ఉంటుంది. అంటే షుగర్ లెవల్, సీరమ్ కెరటీన్ లెవల్ ఎక్కువ కావడం ఫంగస్ ఎదిగేందుకు ఎరువులా ఉపయోగపడుతుంది. కాబట్టి వీటిని ఎలా వాడాలో తెలుసుకోవాలి. అదేవిధంగా వైద్యుల పర్యవేక్షణ లేకుండా ఎక్కువ రోజులు వాడితే.. వారికి బీపీ పెరగడం, కంటి సమస్యలు(కంటిశుక్లాలు), ఎముకలు పెళుసుబారడం, నిద్రపట్టకపోవడం, లావు కావడం, మానసిక సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి వైద్యుల పర్యవేక్షణలో ఎంతవరకూ వాడాలో తెలుసుకొని సరైన మోతాదులో వాడితేనే మంచిది. ఎందుకంటే ఈ స్టెరాయిడ్స్ అనేవి కొవిడ్-19 సోకినప్పుడు కచ్చితంగా ప్రాణదాతలు. అందుకే వీటిని రెండు వైపులా పదును ఉండే కత్తిలా చెప్పవచ్చు.
షుగర్ ఉన్న వ్యక్తి కరోనాతో ఆసుపత్రిలో చేరినప్పుడు ఎలాంటి వైద్యం ఇచ్చి బ్లాక్ఫంగస్ నుంచి కాపాడవచ్చు?
షుగర్, ప్రిడయాబెటిక్ వ్యక్తులు కచ్చితంగా ఎప్పటికప్పుడు షుగర్ స్థాయిని పరీక్షించుకోవాలి. ప్రిడయాబెటిక్వారు.. 40-50 వయస్సు ఉన్నవారు.. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ను, అలాగే తిన్న తర్వాత పోస్ట్లంచ్ బ్లడ్ షుగర్ను చూసుకోవాలి. మధుమేహం ఉన్నవారు క్రమం తప్పకుండా పరీక్షించుకోవాలి. తద్వారా మ్యుకర్మైకోసిస్ను ఎదుర్కోవచ్చు. ఇలా షుగర్ కంట్రోల్లో ఉన్నట్లైతే వ్యాధినిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఫంగస్ను ఎదుర్కోవచ్చు. కొవిడ్ సోకిన తరువాత సైనటీస్ లక్షణాలతో బాధపడుతున్నవారు ఒక్కసారి వైద్యులని కలిసి ఫంగస్ వ్యాధులేమైనా ఉన్నాయో లేదో పరీక్షించుకోవాలి. ఎవరిలోనైనా బ్లాక్ ఫంగస్ లక్షణాలు (ముఖంలో ఒకవైపు వాపురావడం, ముక్కు దిబ్బడ, ముక్కు నుంచి రక్తం కారడం, చీదినప్పుడు నలుపు లేదా గోధుమ రంగులోకి రావడం, కంటిగుడ్డు చుట్టు నొప్పి, కంటివాపు) ఉంటే వెంటనే వైద్యుని చేత పరీక్షించుకొని చికిత్స తీసుకుంటే దాని నుంచి బయటపడొచ్చు.
కొంత మంది కరోనా భయంతో సొంతంగా స్టెరాయిడ్స్ వాడుతున్నారు. ఇలా వాడటం మంచిదేనా? లేదా దీనివల్ల ఇబ్బంది అవుతుందా?
కొవిడ్ నియంత్రణకు చాలా మంది స్టెరాయిడ్స్ వాడుతున్నారు. లక్షణాలు లేకుండా స్టెరాయిడ్స్ వాడితే, ముందుగానే వ్యాధినిరోధక శక్తి తగ్గిపోయి వైరస్ ఇన్ఫెక్షన్లతో పాటు ఇతర బ్యాక్టీరియా, ఫంగస్, టీబీ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి లక్షణాలు లేకుండా స్టెరాయిడ్స్ వాడకూడదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!