శకుంతలాదేవి.. ది హ్యూమన్ కంప్యూటర్!
మూడేళ్ల ప్రాయం. అంకెలు నేర్వాల్సిన సమయం. కానీ ఆ చేతులు అద్భుతం చేశాయి. పేక ముక్కల ట్రిక్తో తండ్రినే ఆశ్చర్యపోయేలా చేశాయి. ఆరేళ్లు నిండని వయసు... విద్యాభ్యాసం కూడా ఎరుగని ఆ చిన్నారి.. ఏకంగా యూనివర్సిటీలో గణిత ప్రదర్శనలు ఇచ్చే స్థాయికి ఎదిగింది!! 50 ఏళ్ల........
మూడేళ్ల ప్రాయం. అంకెలు నేర్వాల్సిన సమయం. కానీ ఆ చేతులు అద్భుతం చేశాయి. పేక ముక్కల ట్రిక్తో తండ్రినే ఆశ్చర్యపోయేలా చేశాయి. ఆరేళ్లు నిండని వయసు... విద్యాభ్యాసం కూడా ఎరుగని ఆ చిన్నారి.. ఏకంగా యూనివర్సిటీలో గణిత ప్రదర్శనలు ఇచ్చే స్థాయికి ఎదిగింది!! 50 ఏళ్ల వయసులో కంప్యూటర్ కంటే ముందుగా అంకెలు గణించి తన ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పడమే కాక.. గిన్నిస్బుక్లోనూ చోటు సంపాదించారామె. ప్రముఖ గణిత మేధావి, హ్యూమన్ కంప్యూటర్గా సుపరిచితురాలైన శకుంతలాదేవి గురించే ఈ ఉపోద్ఘాతమంతా. గణితంలోనే కాదు.. ఆమెకు జ్యోతిషంలోనూ పట్టుంది. రచయిత కూడా. పేరుకే హ్యూమన్ కంప్యూటర్ అయినా.. ఆమె సైతం సాధారణ మనిషి ఎదుర్కొన్న కష్టాలను అనుభవించారు. ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నారు. అందుకే ఆమె జీవితం కథా వస్తువైంది. త్వరలో ‘శకుంతలాదేవి’గా ముందుకు రాబోతోంది. ప్రముఖ బాలీవుడ్ నటి విద్యాబాలన్ శకుంతలాదేవి పాత్ర పోషిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ వేదికగా జులై నెలాఖరులో ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..
చదువుకోకపోయినా.. లెక్కల్లో మేటి
బెంగళూరులో 1929 నవంబర్ 4న సంప్రదాయ కన్నడ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు శకుంతలాదేవి. ఆచారాలు, కట్టుబాట్లను పక్కన పెట్టి ఆమె తండ్రి సర్కస్లో పనిచేసేవారు. చిన్నతనంలో పేదరికంలో పెరిగిన శకుంతలాదేవికి గణితమంటే మక్కువ. ఆ విషయాన్ని మూడేళ్ల ప్రాయంలోనే గుర్తించారు ఆమె తండ్రి. ఓ రోజు పేక ముక్కలతో ట్రిక్లో తండ్రినే ఓడించడంతో ఆమె ప్రతిభ బయటపడింది. అంకెలను గుర్తు పెట్టుకోవడంలో ఆమెకున్న ప్రతిభను గుర్తించిన తండ్రి.. సర్కస్ మానేసి ఆమె చేత గణిత ప్రదర్శనలు ఇవ్వడం మొదలు పెట్టారు. దీంతో ఆ నోటా.. ఈ నోటా శకుంతాలా దేవి పేరు మార్మోగింది. ఏకంగా ఆరేళ్ల వయసులోనే యూనివర్సిటీ ఆఫ్ మైసూర్లో గణిత ప్రదర్శనలు ఇచ్చే స్థాయికి ఆమె ఎదిగింది.
కంప్యూటర్తో పోటీ..
14 ఏళ్ల వయసులోనే తండ్రితో కలిసి గణిత ప్రదర్శనలు ఇచ్చేందుకు ఆమె లండన్ చేరుకున్నారు. అప్పటి నుంచి విదేశాల్లో ప్రదర్శనలు ఇస్తూ వచ్చారు. అలా యూరప్, అమెరికా వంటి దేశాలను చుట్టొచ్చారు. సంప్రదాయ విద్యానభ్యసించకుండానే ఆమె ఇలా ప్రదర్శనలు ఇవ్వడం ఆమెకే చెల్లింది. ఈ క్రమంలో 1977లో టెక్సాస్ సదరన్ మెథడిస్ట్ యూనివర్సిటీలో ఒక ప్రదర్శనలో ఆమె పాల్గొన్నారు. 201 అంకెలు కలిగిన ఒక సంఖ్యకు 23వ వర్గమూలాన్ని చకచకా చెప్పేశారు. కేవలం 50 సెకన్లలో గణించి ఆహూతుల్ని ఆశ్చర్యపోయేలా చేశారు. ఇది చేసేందుకు కంప్యూటర్కు 60 సెకన్లు తీసుకోవడం గమనార్హం. 1980లో జూన్ 18న లండన్లోని ఇంపీరియల్ కాలేజీలో ఇచ్చిన ప్రదర్శన.. శకుంతలాదేవి జీవితంలో మైలురాయి. ప్రపంచానికి హ్యూమన్ కంప్యూటర్గా పరిచయమైంది ఆ రోజే. ఆ ప్రదర్శనలో అప్పటికప్పుడు కంప్యూటర్ ఇచ్చిన రెండు 13 అంకెలు కలిగిన సంఖ్యలను గుణించి కేవలం 28 సెకన్లలో సమాధానమిచ్చారు శకుంతలాదేవి. దీంతో ఆమె పేరు గిన్నిస్బుక్లో స్థానం సాధించింది. ఈ రికార్డు ఇప్పటికీ పదిలమే. కేవలం అంకెలు గణించడమే కాదు.. గత శతాబ్ద కాలంలో ఏ తేదీ చెప్పినా అది ఏ వారం అవుతుందో చిటికెలో ఆమె చెప్పగలరంటే ఆమె మేధస్సును అర్థం చేసుకోవచ్చు.
వైవాహికం.. ఓ పుస్తకం
1960లో కోల్కతాకు చెందిన పరితోష్ బెనర్జీ అనే ఐఏఎస్ అధికారిని శకుంతలా దేవి వివాహం చేసుకున్నారు. పెళ్లయిన కొన్నాళ్లకే ఆయన హోమో సెక్సువల్ అని తెలిసింది. కొద్దికాలానికే వ్యక్తిగత కారణాల వల్ల ఈ జంట విడిపోయింది. ఈ దంపతులకు కుమార్తె కూడా ఉన్నారు. హోమో సెక్సువల్ అయిన భర్తను దగ్గర నుంచి చూసిన ఆమె.. ఆ తర్వాతి కాలంలో ‘ద వరల్డ్ ఆఫ్ హోమో సెక్సువల్స్’ పేరిట 1977లో ఓ పుస్తకం రాశారు. స్వలింగ సంపర్కం నేరం కాదని అప్పట్లోనే తన పుస్తకం ద్వారా చెప్పాలనుకున్నారు. 2018లో సుప్రీంకోర్టు సైతం స్వలింగ సంపర్కం నేరం కాదని తీర్పు వెలువరించడం గమనార్హం. ఇదే కాదు.. ఫన్ విత్ నంబర్స్, ఆస్ట్రాలజీ ఫర్ యు, పజిల్స్ టు పజిల్ యు, మాథెబ్లిట్ వంటి ఎన్నో పుస్తకాలు రాశారు.
ఇందిరపై పోటీ
అత్యయిక స్థితి విధించడంపై ఆగ్రహించిన శకుంతలా దేవి.. ఏకంగా ఇందిరాగాంధీపైనే పోటీకి దిగారు. అదీ మెదక్ నుంచి కావడం గమనార్హం. 1980లో వచ్చిన మధ్యంతర ఎన్నికల్లో యూపీలోని రాయ్బరేలీతో పాటు మెదక్ నుంచీ ఇందిరా గాంధీ పోటీచేశారు. మెదక్ ప్రజలను మోసగించేందుకు గాంధీ కుటుంబం ప్రయత్నిస్తోందంటూ ఆమెపై శకుంతలాదేవి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో పోటీ చేసిన 10 మందిలో శకుంతలాదేవి 9వ స్థానంలో నిలిచారు. అవే ఎన్నికల్లో బొంబాయి సౌత్ నుంచి కూడా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2013లో ఏప్రిల్లో బెంగళూరులోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు.
వెండితెరపైకి..
ఆమె మరణించిన ఏడేళ్ల తర్వాత వెండితెరపై ఆమె జీవితం ఆధారంగా ఓ సినిమా వస్తోంది. ‘శకుంతలా దేవి’ పేరుతో అను మేనన్ దీన్ని తెరకెక్కించారు. ఇటీవలే చిత్రం ట్రైలర్ కూడా విడుదలైంది. ఈ ట్రైలర్లో బాల్యం నుంచి ఆమె ఎదిగిన క్రమాన్ని ఆవిష్కరించారు. విద్యార్థులతో సరదాగా సాగిపోయే సన్నివేశాలు, గణిత ప్రదర్శనలు, తల్లీకూతుళ్ల మధ్య సాగే సన్నివేశాలు ఇందులో కనిపించాయి. శకుంతలాదేవి కుమార్తె పాత్రలో బాలీవుడ్ నాయిక సన్యా మల్హోత్ర కనిపించనున్నారు. వీరి మధ్య భావోద్వేగ సన్నివేశాలు ట్రైలర్లో ప్రధానంగా చూపించారు. దీనిబట్టి సాధారణ జనానికి తెలీని ఇంకో కోణాన్ని కూడా ఈ చిత్రంలో చూపించనున్నట్లు తెలుస్తోంది. శకుంతలాదేవి కుమార్తె అనుపమ బెనర్జీ కూడా ఈ చిత్రం స్క్రిప్ట్కు తోడ్పాటు అందించారు. ఆమె జీవితాన్ని తెరపై ఎలా ఆవిష్కరించారనేది చూడాలి మరి!!
-ఇంటర్నెట్డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయిన ‘ప్రేమలు’ చిత్రానికి సీక్వెల్ రానుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. -
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
రెండు హిట్ సినిమాల సీక్వెల్స్పై నిర్మాత రాధామోహన్ మాట్లాడారు. వాటి స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందన్నారు. -
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
నటీనటులకు రవాణా ఖర్చులు ఇవ్వకపోవడం బాధాకరం: మనోజ్ బాజ్పాయ్
‘సైలెన్స్ 2’ ప్రమోషన్లో భాగంగా పాల్గొన్న ఇంటర్వ్యూలో మనోజ్ బాజ్పాయ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
తన తదుపరి చిత్రం ‘దో ఔర్ దో ప్యార్’ ప్రమోషన్స్లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు నటి విద్యాబాలన్ (Vidya Balan). -
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
siren movie review: జయం రవి కథానాయకుడిగా ఆంటోనీ భాగ్యరాజా దర్శకత్వంలో వచ్చిన ‘సైరెన్’ మూవీ తెలుగులో మెప్పించిందా? -
మీ ప్రేమ వెలకట్టలేనిది.. ట్రెండింగ్లో ‘మిరాయ్’..
తేజ సజ్జా నటిస్తోన్న తాజా చిత్రం ‘మిరాయ్’. దీని గ్లింప్స్ సోషల్మీడియాలో ట్రెండింగ్లో ఉంది. -
సూపర్హిట్ చిత్రానికి సీక్వెల్ ప్రకటించిన సితార ఎంటర్టైన్మెంట్స్
ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ తెరంగేట్రం చేసిన చిత్రం ‘మ్యాడ్’ (MAD). కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. -
వాళ్లకు బాలీవుడ్ సేఫ్ కాదు.. ఎందుకంటే: ప్రీతీ జింటా
సినీ నేపథ్యం లేకుండా బాలీవుడ్లో రాణించడం కష్టమని నటి ప్రీతీ జింటా అన్నారు. -
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
మలయాళీ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి (Mammootty)తో నెలకొన్న విభేదాలపై కోలీవుడ్ దర్శకుడు లింగుస్వామి (Lingusamy) స్పందించారు. 23 ఏళ్ల క్రితం ఏం జరిగిందో చెప్పారు. -
పాపం చిరంజీవి వస్తున్నారనుకొని...
అప్పట్లో సినిమా నటులంటే ప్రేక్షకులకు విపరీతమైన అభిమానం. ఒకరకంగా తమ అభిమాన కథానాయకుడిని దైవంతో సమానంగా చూసేవారు. ఎదుటివారు దూషించినా, కనీసం చెడుగా మాట్లాడినా పెద్ద పెద్ద గొడవలే జరిగేవి. -
నా కామెంట్ సెక్షన్లో మీ పంచాయితీ ఏంటి?: రీతూవర్మ
‘డార్లింగ్’ అనే పిలుపు విషయంలో నటుడు ప్రియదర్శి, నటి నభానటేశ్ మధ్య బుధవారం సోషల్ మీడియాలో ఆసక్తికర సంభాషణ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పుడు నటి రీతూవర్మ భాగమయ్యారు. -
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
Paarijatha Parvam Review; చైతన్యరావు, సునీల్, శ్రద్ధాదాస్ కీలక పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా? -
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
సిద్ధు జొన్నలగడ్డ - అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. త్వరలో ఇది ఓటీటీలో విడుదల కానుంది. -
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli), నటుడు మహేశ్బాబు (Mahesh babu) కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. SSMB 29గా ఇది ప్రచారంలో ఉంది. -
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
ప్రముఖ నటులు కొందరు కలిసి నటిస్తున్న చిత్రాలపై ప్రత్యేక కథనం. ఎవరెవరు ఏయే సినిమాల్లో నటిస్తున్నారంటే? -
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే.
తాజా వార్తలు (Latest News)
-
అర్ధశతకాలతో చెలరేగిన రాహుల్, డికాక్.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
-
ఆగంతుకుడి అనుమానాస్పద కదలికలు.. ఇరాన్ కాన్సులేట్ వద్ద కలకలం!
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?