Sushi Terrorism: సుషీ రెస్టారంట్లలో.. జపాన్ యువత వికృత చేష్టలు..!
జపాన్లో (Japan) సుషీ రెస్టారంట్లలో (Sushi Restaurant) ప్రాంకులకు పాల్పడుతోన్న ముగ్గురిని అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. ఈ వికృత చేష్టలకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఈ చర్యలకు పోలీసులు ఉపక్రమించారు.
టోక్యో: ఇంటర్నెట్ యుగంలో సామాజిక మాధ్యమాలు కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో.. అంతేస్థాయిలో వాటి దుర్వినియోగం కూడా జరుగుతోంది. ప్రాంకుల (Prank) పేరుతో కొందరు చేసే వికృత చేష్టలు తోటివారితోపాటు చూసేవారికి విసుగు తెప్పిస్తున్నాయి. ఈ క్రమంలో జపాన్లో (Japan) సోషల్ మీడియా ట్రెండ్పై ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. కన్వేయర్ బెల్ట్ సహాయంతో ఆహారం అందించే సుషీ రెస్టారంట్లలో (Sushi Restaurant) ఆహార పదార్థాలను ముట్టుకోవడం, ఎంగిలి చేయడం వంటి చర్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే అటువంటి చర్యలకు పాల్పడిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.
ఏమిటీ సుషీ వంటకం..?
జపాన్లో అత్యంత రుచికరమైన వంటకాల్లో సుషీ ఒకటి. సుషీ అంటే పులియబెట్టిన అన్నంతో నిల్వ చేసిన చేప వంటకం. వెనిగర్ కలిపిన అన్నంతో చేసే వంటకం ఎన్నో దశాబ్దాలుగా జపాన్లో ప్రాచుర్యంలో ఉంది. తొలిరోజుల్లో చేపల్ని నిల్వ చేసుకోవడానికి పులియబెట్టిన అన్నాన్ని ఎక్కువగా వాడేవారు. చేప ముక్కల్ని మాత్రం తీసుకుని ఆ అన్నాన్ని పారేసేవారు. తర్వాతి కాలంలో పులియబెట్టిన అన్నం, చేపలూ రెండూ తినడం మొదలుపెట్టారు. వెనిగర్ కలిపిన అన్నం, చేప, రొయ్యలని చుట్టి చేసే ఈ జపాన్ సంప్రదాయక వంటకాన్ని కూరగాయలు, ఇతర ఆహార పదార్థాలతో తయారు చేస్తున్నారు. జపాన్లోనే కాకుండా ప్రపంచమంతటా సుషీ వంటకం కొత్త రుచుల్లో లభ్యమవుతోంది.
వికృత చేష్టలు..
అయితే, సుషీ రెస్టారంట్లలో (Sushi Restaurant) ఇటీవల కొందరు యువతీ, యువకులు వికృత చేష్టలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగు చూశాయి. సోయా సాస్లలో ఉమ్మి వేయడం, ఇతర కస్టమర్ల కోసం బెల్టు మీద వెళ్లే ఆహారాన్ని తినడం, ఎంగిలి చేతులతో వాటిని ముట్టుకోవడం, ఇతరుల పాత్రలను వీళ్లు తీసుకోవడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఇటువంటి అల్లరి పనులకు (Prank) సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ఇటీవల వైరల్గా (Viral Videos) మారాయి. వీటిని చూసిన కస్టమర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సుషీ రెస్టారంట్లలో ఇంత దారుణం జరుగుతుందా..? అంటూ ఆశ్చర్యపోతున్నారు. అదే సమయంలో ఇతరుల ఆహారాన్ని అపరిశుభ్రం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీటిని ‘సుషీ టెర్రర్’గా పేర్కొంటూ ఆన్లైన్ ఉద్యమం చేపట్టారు.
ముగ్గురు అరెస్ట్..
ప్రముఖమైన రెస్టారంట్లలో ఈ సుషీ టెర్రర్కు పాల్పడిన ప్రాంకులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో కస్టమర్లు నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. దీని కారణంగా ఏకంగా ఓ ప్రముఖ సంస్థ షేర్లు పడిపోయాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇటువంటి చర్యలకు పాల్పడుతోన్న ముగ్గురు యువతీ, యువకులను పోలీసులు అరెస్టు చేశారు. సుషీ వ్యవహారంలో అరెస్టు చోటుచేసుకోవడం జపాన్లో ఇదే మొదటిసారి. మరోవైపు ఈ తరహా చేష్టలపై జపాన్ రెస్టారంట్ల యాజమాన్యాలు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇటువంటి చర్యలు సుషీ విధానంపైనే తీవ్ర వ్యతిరేకతకు కారణమవుతాయని.. తాజా అరెస్టులు యువతలో మార్పు తెస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM