Germany Chancellor: ఏంజెలా మెర్కెల్.. ముగిసిన 16 ఏళ్ల ప్రస్థానం..!
దశాబ్దిన్నర క్రితం జర్మనీకి తొలి మహిళా ఛాన్స్లర్గా ఎన్నికై రికార్డు సృష్టించిన ఏంజెలా మెర్కెల్.. సుదీర్ఘ కాలంపాటు ఆ పదవిలో కొనసాగిన మహిళగా మరో ఘనత సాధించారు.
డిసెంబర్ 8తో పదవీకాలం పూర్తి
బెర్లిన్: దశాబ్దిన్నర క్రితం జర్మనీకి తొలి మహిళా ఛాన్స్లర్గా ఎన్నికై రికార్డు సృష్టించిన ఏంజెలా మెర్కెల్.. సుదీర్ఘ కాలంపాటు ఆ పదవిలో కొనసాగిన మహిళగా మరో ఘనత సాధించారు. జర్మనీ ఖ్యాతిని మరింత ఇనుమడింపజేసేందుకు ప్రయత్నించినట్లు పేరుతెచ్చుకున్న మెర్కెల్.. యూరోపియన్ యూనియన్ను ఏకతాటిపై నిలబెట్టడంలోనూ కృషి చేసిన వ్యక్తిగా ప్రసిద్ధికెక్కారు. అంతేకాకుండా తన పదవీకాలంలో ఎన్నో సంక్షోభాలను దీటుగా ఎదుర్కొని విదేశాల మన్ననలను పొందిన 67ఏళ్ల మెర్కెల్.. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంతి మహిళలకు స్ఫూర్తిగా నిలిచారు. ఇలా 16ఏళ్ల పాటు ఏకధాటిగా జర్మనీ ఛాన్సలర్ పదవిలో కొనసాగిన ఆమె ప్రస్థానం డిసెంబర్ 8తో ముగియనుంది.
మూడో వ్యక్తిగా రికార్డు..
తూర్పు జర్మనీకి చెందిన ఏంజెలా మెర్కెల్ మొదట్లో ఓ శాస్త్రవేత్త. అనంతరం క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆమె.. నవంబర్ 22, 2005లో జర్మనీ ఛాన్సలర్గా పగ్గాలు చేపట్టారు. జర్మనీలో సుదీర్ఘకాలం పాటు ఈ పదవిని చేపట్టిన వ్యక్తిగా బిస్మార్క్ (దాదాపు 23ఏళ్లు) రికార్డు సృష్టించగా.. ఏంజెలా గురువుగా భావించే హెల్మట్ కోల్ పదహారేళ్ల పాటు (16ఏళ్ల 26రోజులు) అధికారంలో కొనసాగిన రెండో వ్యక్తిగా ప్రసిద్ధికెక్కారు. వీరిద్దరి తర్వాత అత్యధిక కాలం ఛాన్సలర్ పదవి చేపట్టిన మూడో అధినేతగా ఏంజెలా మెర్కెల్ తాజా ఘనత సాధించారు. రెండోస్థానంలో ఉన్న హెల్మట్ కోల్ కంటే మెర్కెల్ కేవలం పదిరోజుల (16ఏళ్ల 15రోజులు) తక్కువ సమయం మాత్రమే అధికారంలో కొనసాగారు. ఏంజెలా మెర్కెల్ తన హయాంలో సంక్షోభ సమయాల్లోనూ సమర్థవంత నిర్వహణతో శక్తివంతమైన నాయకురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
అగ్ర రాజ్యాధినేతలు మారినా..
నవంబర్ 22, 2005న జర్మనీ ఛాన్సలర్గా ఏంజెలా మెర్కెల్ అధికార పగ్గాలు చేపట్టారు. ఆ పదవిలో ఏకధాటిగా పదహారేళ్ల కాలం ఏంజెలా కొనసాగగా.. అదే సమయంలో అగ్రరాజ్యాల అధినేతలు ఎంతోమంది మారడం విశేషం. ముఖ్యంగా ఆమె జర్మనీ ఛాన్సలర్గా ఉన్న 16ఏళ్లలో అమెరికాకు నలుగురు అధ్యక్షులు ఎన్నికయ్యారు. ఫ్రాన్స్కు నలుగురు అధ్యక్షులు, బ్రిటన్కు ఐదుగురు ప్రధాన మంత్రులకుతోడు ఇటలీకి ఎనిమిది మంది ప్రీమియర్లు వచ్చి వెళ్లారు. వారిలో కొందరు రెండు పర్యాయాలు చేశారు. కేవలం ఈ దేశాలే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నోదేశాల్లో అధినేతలు మారినప్పటికీ ఏంజెలా మెర్కెల్ మాత్రం సుదీర్ఘకాలం పాటు (వరుసగా నాలుగుసార్లు) అధికార పగ్గాలు చేపట్టారు.
అధినేతలతో లౌక్యం..
ఏంజెలా మెర్కెల్ తన పదవీ కాలంలో ప్రపంచస్థాయిలో జర్మనీ ప్రతిష్ఠను మరింత పెంచిందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని జర్మనీ మార్షల్ ఫండ్ డిప్యూటీ డైరెక్టర్ సుధా డేవిడ్ విల్ప్ పేర్కొన్నారు. జర్మనీకి మెర్కెల్ ఎంతో శక్తిని అందించిందన్న ఆమె.. దౌత్య సంబంధాల్లోనూ లౌక్యం ప్రదర్శించారని కొనియాడారు. ఉదాహరణకు ఉక్రెయిన్ వేర్పాటువాదులకు మద్దతు ఇచ్చినందుకుగానూ రష్యాపై యూరోపియన్ యూనియన్ (ఈయూ) ఆంక్షలు విధించడంలో మెర్కెల్ క్రియాశీలంగా వ్యవహరించారు. అదే సమయంలో ఆ దేశ అధ్యక్షుడు పుతిన్తోనూ చర్చలు జరిపిన తీరుతో ఎంతోమంది ప్రశంసలు అందుకున్నారు. అలాగే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మెర్కల్ కఠిన వైఖరి ప్రదర్శించినట్లు చెబుతుంటారు. 2017 మార్చి నెలలో అమెరికా పర్యటన సందర్భంలో వైట్హౌస్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను మెర్కెల్ కలిశారు. ఆ సమయంలో కరచాలనం చేయమని అక్కడి ఫొటోగ్రాఫర్లు అరిచిన సందర్భంలో మెల్లగా స్పందించిన మెర్కెల్.. కరచాలనం కావాలని వారు అడుగుతున్నారు?అంటూ ట్రంప్ వైపు చూస్తూ అడిగారు. అయినప్పటికీ ఆయన నుంచి ఎటువంటి స్పందన లేదు.
పార్టీకి తప్పని ఓటమి..
తాను అధికారంలో ఉన్న సమయంలో ఎన్నో సంక్షోభాలను అధిగమించినప్పటికీ.. మరెన్నో సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయని ఏంజెలా మెర్కెల్ అభిప్రాయపడ్డారు. అయితే, ఆరోగ్యకరమైన ఆర్థికవ్యవస్థ, తక్కువ నిరుద్యోగం వంటి సానుకూల వాతావరణం ఉన్నప్పటికీ మహమ్మారి సమయంలో ఆరోగ్య మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఆమె విఫలమయ్యారనే విమర్శలూ ఎదుర్కొన్నారు. మరోవైపు పునరుత్పాదకశక్తి రంగాన్ని ప్రోత్సహించడంలో పురోగతి సాధించినప్పటికీ వాతావరణ మార్పులపై ఆమె వేగంగా స్పందించలేదనే విమర్శలు మూటగట్టుకున్నారు. ఇదిలాఉండగా వచ్చే ఎన్నికల్లో (ఐదోసారి) తాను పోటీలో లేనని 2018లో మెర్కెల్ ప్రకటించారు. అనంతరం ఈఏడాది సెప్టెంబర్లో జరిగిన ఎన్నికల్లో సొంత పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో మాత్రం ఆమె విఫలమయ్యారు.
శక్తిమంతమైన మహిళగా..
తన హయాంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న ఏంజెలా మెర్కెల్.. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, జార్జ్ డబ్ల్యూ.బుష్తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది దేశాధినేతల ప్రశంసలు అందుకున్నారు. ఓ మహిళా నాయకురాలిగా సుదీర్ఘకాలంపాటు దేశాధినేత బాధ్యతలు చేపట్టడం పట్ల మన్ననలు పొందారు. అంతేకాకుండా ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకటించే ప్రపంచ శక్తిమంతమైన మహిళల జాబితాలో వరుసగా గడిచిన పదేళ్లుగా ఆమె నిలుస్తున్నారు. ఇలా జర్మనీ ఛాన్సలర్గా 16 ఏళ్ల పాటు సాగిన ఏంజెలా మెర్కెల్ ప్రస్థానం డిసెంబర్ 8తో ముగియనుంది. తదుపరి ఛాన్సలర్గా ఓలఫ్ స్కాల్జ్ బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి. -
Royal family: వందల కార్లు.. రూ.4వేల కోట్ల ప్యాలెస్: ఈ రాజ కుటుంబం హవానే వేరయా..!
విలాసవంతమైన రాజ భవనాలు, ప్రముఖ సంస్థల్లో పెట్టుబడులు, లండన్, పారిస్లో ఆస్తులు.. యూఏఈ రాజ కుటుంబం(royal family of Dubai) సంపద ఎంతో తెలుసా..? -
Lakshadweep: నిమిషానికి 11 ఓడలు.. భారత్ అధీనంలోనే కీలక సముద్ర మార్గం!
లక్షద్వీప్కు సంబంధించి మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. అదే నైన్ డిగ్రీ ఛానెల్. ఇక్కడ ఎలాంటి అలజడి జరిగినా ఆసియాలోని పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. -
World Roundup 2023: విపత్తులు మిగిల్చిన విషాదం.. భీకర యుద్ధాలు!
గడిచిన ఏడాది కాలాన్ని తిరిగి చూస్తే.. ప్రకృతి విపత్తులు, భీకర యుద్ధాలు పలు దేశాలను వణికించాయి. -
Vessel Hijack: హైజాక్ చేయడం...డబ్బు గుంజుకోవడం.. ఈ తరహా ఘటనలెన్నో!
మాల్టా దేశానికి చెందిన వాణిజ్య నౌకను సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. గతంలోనూ ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నాయి. -
December 13, 2001: పార్లమెంటుపై దాడి.. ఆ రోజు ఏం జరిగిందంటే..!
రెండు దశాబ్దాల కిందట ఇదే రోజు (డిసెంబర్ 13, 2001న) భారత పార్లమెంటుపై ఉగ్రవాదులు జరిపిన దాడి యావత్ దేశాన్ని కలవరపాటుకు గురిచేసింది.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
-
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
-
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
-
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
-
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా