SR Bommai Vs Union of India: ఎస్ఆర్ బొమ్మై కేసులో ఏం జరిగిందంటే!
SR Bommai Vs Union of India గా పేరుగాంచిన ఆ కేసు.. రాష్ట్రాల శాసనసభ రద్దు, అసెంబ్లీలో మెజారిటీ లేని సమయంలో ప్రస్తావనకు వస్తూనే ఉంటోంది.
బెంగళూరు: కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన బసవరాజ్ బొమ్మై తండ్రి SR బొమ్మై (సోమప్ప రాయప్ప బొమ్మై). అయితే, ఇప్పటివరకు బసవరాజ్ బొమ్మై పేరు ఓ ప్రాంతానికే పరిమితమైనప్పటికీ.. ఆయన తండ్రి ఎస్ఆర్ బొమ్మై పేరు మాత్రం దేశవ్యాప్తంగా తరచూ వార్తల్లో వినిపిస్తుంది. మూడు దశాబ్దాల క్రితం కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎస్ఆర్ బొమ్మై ప్రభుత్వం రద్దు కావడం అప్పట్లో దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. చివరకు ఆ కేసులో కేంద్రం అధికారాలపై సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. SR Bommai Vs Union of India గా పేరుగాంచిన ఆ కేసు.. రాష్ట్రపతి పాలన, శాసనసభ రద్దు, అసెంబ్లీలో మెజారిటీ నిరూపణ వంటి సందర్భాల్లో ప్రస్తావనకు వస్తూనే ఉంటోంది.
జనతాదళ్ హయాంలో ఎనిమిది నెలలపాటు (ఆగస్టు 1988 నుంచి ఏప్రిల్ 1989) కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎస్ఆర్ బొమ్మైకు 1989 ఏప్రిల్ 21న ఊహించని పరిణామం ఎదురయ్యింది. ప్రభుత్వానికి సరైన మెజారిటీ లేదని ఆర్టికల్ 356 ప్రయోగించిన కేంద్ర ప్రభుత్వం.. బొమ్మై సర్కారును రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించింది. బొమ్మైకి చెందిన పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని.. దీంతో ఆయన ప్రభుత్వానికి మెజారిటీ లేని కారణంగా ఆ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం సమర్థించుకుంది. అదే సమయంలో మెజారిటీ నిరూపించుకునేందుకు బొమ్మై అభ్యర్థించినప్పటికీ అప్పటి గవర్నర్ పి.వెంకటసుబ్బయ్య అవకాశం ఇవ్వలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రద్దయ్యింది.
ఆ తర్వాత ఏం జరిగిందంటే..
రాష్ట్రపతి పాలనను సిఫార్సు చేస్తూ గవర్నర్ తీసుకున్న నిర్ణయంపై ఎస్ఆర్ బొమ్మై సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తొలుత కర్ణాటక హైకోర్టును ఆశ్రయించినప్పటికీ ఆ పిటిషన్ను తిరస్కరించడంతో చివరకు బొమ్మై సుప్రీంకు వెళ్లారు. ఎస్ఆర్ బొమ్మై వర్సెస్ కేంద్ర ప్రభుత్వం (SR Bommai Vs Union of India)గా ప్రాచుర్యంలోకి వచ్చిన ఆ కేసు విచారణ సుదీర్ఘంగా సాగింది. అది పూర్తవడానికి దాదాపు ఐదేళ్లు పట్టింది.
సుప్రీం కోర్టు ఏం చెప్పింది..?
9మంది న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనం ఆర్టికల్ 356లోని నిబంధనలు, అధికారాలను క్షుణ్ణంగా సమీక్షించింది. చివరకు 1994 మార్చి 11వ తేదీన సుప్రీం ధర్మాసనం చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. విస్తృత అధికారాలతో రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసే అధికారం ఎవ్వరికీ లేదని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దుపై రాష్ట్రపతి తీసుకునే నిర్ణయానికి పార్లమెంట్ ఉభయసభల ఆమోదం ఉండాలని పేర్కొంది. రాష్ట్రపతి ప్రకటనను పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించని పక్షంలో.. రెండు నెలల తర్వాత ఆ ప్రకటన వీగిపోతుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అలాంటి సమయంలో రద్దైన శాసనసభ తిరిగి పునరుద్ధరించబడుతుందని పేర్కొంది. అంతేకాకుండా ఆర్టికల్ 356 కింద రాష్ట్రపతి తీసుకునే నిర్ణయం న్యాయసమీక్షకు లోబడి ఉంటుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
అసలైన వేదిక శాసనసభే..
ఆర్టికల్ 356 పేరుతో రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఏకపక్షంగా రద్దు చేసే ప్రక్రియకు సుప్రీం కోర్టు స్వస్తి చెప్పింది. ఈ ఆర్టికల్ కింద కేంద్రానికి ఉన్న అధికారాలపై ఆంక్షలు విధించిన సుప్రీం కోర్టు.. రాష్ట్ర ప్రభుత్వం తన మెజారిటీని నిరూపించుకునేందుకు సరైన వేదిక శాసనసభేనని స్పష్టం చేసింది. అంతేకానీ ఈ విషయంలో గవర్నర్ సొంత అభిప్రాయానికి తావులేదని అభిప్రాయపడింది. దీంతో ఈ కేసు కేంద్ర-రాష్ట్ర సంబంధాలపైనా ప్రభావం చూపింది. 1999లో కేంద్రంలో ఉన్న వాజ్పేయీ ప్రభుత్వంపైనా ఆ తీర్పు ప్రభావం పడింది. రబ్రీదేవీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బిహార్ ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ 1999 ఫిబ్రవరి 12న కేంద్రం నిర్ణయం తీసుకుంది. కానీ, 25 రోజుల్లోనే అనగా మార్చి 8న తిరిగి ప్రభుత్వం పునరుద్ధరించబడింది.
ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు లేదా ఏదైనా అసెంబ్లీలో అధికార పార్టీకి మెజారిటీ లేకపోయిన సందర్భంలో ఎస్ఆర్ బొమ్మై కేసు ప్రస్తావన వస్తూనే ఉంటుంది. తాజాగా ఎస్ఆర్ బొమ్మై కుమారుడు బసవరాజ్ బొమ్మై కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా బొమ్మై కేసును మరోసారి గుర్తుచేసుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి. -
Royal family: వందల కార్లు.. రూ.4వేల కోట్ల ప్యాలెస్: ఈ రాజ కుటుంబం హవానే వేరయా..!
విలాసవంతమైన రాజ భవనాలు, ప్రముఖ సంస్థల్లో పెట్టుబడులు, లండన్, పారిస్లో ఆస్తులు.. యూఏఈ రాజ కుటుంబం(royal family of Dubai) సంపద ఎంతో తెలుసా..?
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు