Health Tips: ఆరోగ్యం కావాలా? అయితే ఇలా చేయండి..
మన జీవనశైలి, అలవాట్లే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుందంటారు నిపుణులు. తెలిసో, తెలియకో తీసుకునే ఆహార పదార్థాలు, ఆచరించే పద్ధతులు శరీరాన్ని గుల్ల చేస్తుంటాయట. అవి తెలుసుకోకపోతే ఆరోగ్యాన్ని చేజేతులా నాశనం చేసుకుంటున్నట్టే అంటారు వైద్యులు. అది జరగకుండా ఉండాలంటే ముఖ్యమైన ఈ సూచనలు పాటించాలంటారు.
మన జీవనశైలి, అలవాట్లే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయని అంటారు నిపుణులు. తెలిసో, తెలియకో తీసుకునే ఆహార పదార్థాలు, ఆచరించే పద్ధతులు శరీరాన్ని గుల్ల చేస్తుంటాయి. అవి తెలుసుకోకపోతే ఆరోగ్యాన్ని చేజేతులా నాశనం చేసుకుంటున్నట్టే అంటారు వైద్యులు. అది జరగకుండా ఉండాలంటే ముఖ్యమైన ఈ సూచనలు పాటించాలని చెబుతున్నారు..
💡 సరిపోయినంత నిద్ర
మీరెప్పుడైనా గమనించారా? సరిగా నిద్రపోకపోతే తర్వాత ఏమవుతుందో? ఆ రోజంతా చిరాగ్గా ఉంటుంది. కొందరికి తల పోటు మొదలవుతుంది. కునికిపాట్లు వస్తుంటే సరిగా పని చేయలేం. ఏకాగ్రత కుదరదు. ఇవేకాదు.. తరచూ కనీసం ఆరు గంటల పాటు నిద్ర పోకుండా ఉంటే కలిగే దుష్ఫలితాలు చాలా ఎక్కువే ఉంటాయంటారు వైద్య నిపుణులు. వాళ్లు చెబుతున్న దాని ప్రకారం మన శరీరం ప్రతిరోజూ నిద్ర తర్వాత కొత్తగా ఉత్తేజితమవుతుంది. కొత్త పనులు చేయడానికి శరీరంలోని అన్ని అవయవాలు సిద్ధమవుతాయి. కానీ నిద్రలేమి కారణంగా సహజంగా సాగాల్సిన ఈ ప్రక్రియ దెబ్బతింటుంది. అవయవాల పనితీరులో వేగం తగ్గుతుంది. అయినా ఆ అలవాటు అలాగే కొనసాగిస్తుంటే చివరికి రోగ నిరోధక వ్యవస్థ దెబ్బ తింటుంది. శ్వాసకోశ, జీర్ణ వ్యవస్థల్లో లోపాలు ఏర్పడతాయి.
💡 విపరీతమైన ప్రొటీన్లు
శరీరానికి పోషక పదార్థాలు అవసరమే. కానీ అత్యధిక ప్రొటీన్లు హానికారకం. ముఖ్యంగా జంతు ఉత్పత్తుల ద్వారా వచ్చే ప్రొటీన్లు అత్యంత ప్రమాదకరం. మాంసాహారం, పాల ఉత్పత్తుల్లో ఐజీఎఫ్1 అనే క్యాన్సర్ కారక హార్మోన్లు ఉంటాయి. అందుకే వీటిని ఒక పరిమితి మించి తీసుకోవద్దు. వీటికి బదులు మొక్కల నుంచి లభించే బీన్స్, క్వినోవా, చిక్కుడులాంటి ప్రొటీన్లకు ఆహారంలో అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.
💡 అదేపనిగా కూర్చోవడం
ఎంత ముఖ్యమైన పని ఉన్నా ఒకేచోట గంటలకొద్దీ కూర్చోవద్దు. కుర్చీకే అతుక్కుపోయి పని చేయడం పొగ తాగే అలవాటుకన్నా ప్రమాదం. ఇలా చేయడం వల్ల ఊపిరితిత్తులు, వక్షోజ, పెద్దపేగు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని చాలా అధ్యయనాల్లో తేలింది. గంటలకొద్దీ డ్రైవింగ్ చేయడం కూడా ముప్పుగానే పరిణమిస్తుంది. దీన్ని నివారించాలంటే కనీసం రెండు గంటలకోసారైనా లేచి కాసేపు తిరగాలి. శరీరాన్ని కాస్త అటు ఇటూ వంచాలి.
💡 ఏకాంతం వద్దు
మనిషి ప్రశాంతంగా గడపడానికి కాసేపు ఒంటరిగా ఉండాలనుకోవడం తప్పు కాదు. కానీ రోజంతా ఏకాంతంగా ఉండాలి, నా దరిదాపుల్లోకి ఎవరూ రావొద్దు అనుకోవడం మానసిక సమస్యలకు దారి తీస్తుంది. కరోనా పుణ్యమాని మనుషుల మధ్య ఇప్పటికే దూరం పెరిగిపోయింది. ఇది భౌతికానికి మాత్రమే పరిమితం కావాలి. రోజులో ఎక్కువసేపు ఏకాంతంగా గడిపేవాళ్లకి గుండెజబ్బులు వచ్చే అవకాశం ఎక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి. మానసిక ఒత్తిడి, భావోద్వేగపరంగా చికాకులూ ఏర్పడతాయి. ఈ ఒంటరితనం నుంచి తప్పించుకోవడానికి కొందరు హానికరమైన వ్యసనాలకు బానిసలవుతారు. ఈ ప్రమాదం తప్పాలంటే నలుగురితో స్నేహం చేయాలి. ఇష్టపడే వ్యక్తులకు దగ్గరలో ఉండటానికి ప్రయత్నించాలి.
💡 గడప దాటండి
ఈతరం ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య విటమిన్ డి లోపం. ఉద్యోగం, జీవనశైలి కారణంగా ఎక్కువమంది ఇంటికే పరిమితం అవుతున్నారు. ఇలా చేయడం వల్ల మనలోని రోగ నిరోధకశక్తి మందగిస్తుంది. ఈ ముప్పు తప్పాలంటే శరీరానికి కాసేపైనా సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి. విటమిన్ డి లోపంతో పిల్లల్లో ఆస్తమా, పెద్దల్లో కార్డియోవ్యాస్కులర్ డిసీజ్, మధుమేహం, క్యాన్సర్లాంటివి వచ్చే ప్రమాదం పొంచి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.