Rajasthan : ఆ గ్రామంలో చిరుతలు దైవంతో సమానం.. వాటికి పూర్తి స్వేచ్ఛ!
మన దేశంలోని ఓ గ్రామంలో మనుషులకు ఏ హాని తలపెట్టకుండా చిరుతలు(Leopards) స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి.
మనకు కూతవేటు దూరంలో చిరుత సంచరిస్తోందని తెలియగానే హడలిపోతాం. రాజస్థాన్(Rajasthan)లోని ఓ గ్రామ ప్రజలు మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరిస్తారు. అవి కూడా వారికి ఏ మాత్రం హాని చేయకుండా స్వేచ్ఛగా తిరుగుతాయి. ఆ సంగతేంటో చదివేయండి.
ఆరుతో మొదలై.. అరవై దాకా..
రాజస్థాన్(Rajasthan)లోని పాలి జిల్లాలో బెరా గ్రామం ఉంది. ఆరావళి పర్వతాలకు సమీపంలో ఈ ప్రాంతం ఉంటుంది. సుమారు 50 ఏళ్ల క్రితం ఇక్కడికి సమీపంలోని కుంభాల్గడ్ జాతీయ పార్కు నుంచి 6 చిరుతలు తప్పించుకున్నాయి. అవి అటుఇటూ తిరుగుతూ బెరా గ్రామ పరిసరాలను తమ ఆవాసంగా మలుచుకున్నాయి. ఇక్కడ కొన్ని కొండ గుహలు, అటవీ ప్రాంతం కూడా ఉండటంతో అవి ఎక్కడికీ వెళ్లలేదు. దాంతో వాటి సంతతి క్రమంగా వృద్ధి చెందింది. 2020నాటికి ఇక్కడ 50-60 చిరుతలు సంచరిస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. చిరుతలు ఎక్కువగా ఉన్నాయని గుర్తించిన అటవీ(Forest) అధికారులు ఈ ప్రాంతాన్ని జవాయ్ లెపర్డ్ కన్జర్వేషన్ జోన్గా ప్రకటించారు. పర్యాటకులకు చిరుతలను చూపించడానికి పలువురు సఫారీలు నిర్వహిస్తున్నారు. చిరుత కనిపించకపోతే మీకు డబ్బు వాపస్ చేస్తామని సఫారీ నిర్వాహకులు చెబుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు.
దైవంలా పూజిస్తూ..
ప్రపంచంలో అత్యధికంగా చిరుతలు సంచరిస్తున్న ప్రాంతంగా బెరా గుర్తింపు పొందింది. కొన్నేళ్లుగా స్థానిక రబారి జాతి ప్రజలు వాటికి ఎటువంటి హాని తలపెట్టకుండా అత్యంత జాగ్రత్తగా సంరక్షిస్తున్నారు. వీరు గొర్రెలు, పశువులు కాస్తూ ఉంటారు. గత కొన్ని దశాబ్దాలుగా చిరుతలు గ్రామంలోని రోడ్లు, పొలాలు, బావులు, కొండల వద్ద స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. రహదారిపై వెళ్తున్నప్పుడు మధ్యలో చిరుతలు కన్పిస్తే అవి వెళ్లేంత వరకు ఈ గ్రామస్థులు ముందుకు కదలరు. ఇక్కడ కేవలం చిరుతలు మాత్రమే కాదు నక్కలు, హైనాలు, బ్లూ బుల్స్, మొసళ్లు తదితర జంతువులు తిరుగుతుంటాయి. రెండు వందల రకాల పక్షులు(Birds) సైతం ఈ ప్రాంతంలో కన్పిస్తాయి.
అదో.. దైవ బలి!
అప్పుడప్పుడూ చిరుతలు స్థానికులు పెంచే పశువులను వేటాడతాయి. స్థానికులు ఆ చర్యను అడ్డుకోరు. పైగా దాన్ని గౌరవిస్తారు. తమ దగ్గర నుంచి ఒక గొర్రెను చిరుతలు తీసుకెళ్లిపోతే.. దేవుడు ప్రతిగా రెండు ప్రసాదిస్తాడని నమ్ముతారు. ఇక ప్రభుత్వం కూడా ప్రజలకు పరిహారం ఇస్తుంది. వన్ ధన్ యోజన పథకం కింద మేక చనిపోతే రూ.4వేలు, ఆవు చనిపోతే రూ.15వేలు అందజేస్తోంది. ఈ పరిహారం తీసుకోవడానికి కూడా ప్రజలు ముందుకు రారు. ఎందుకంటే చిరుత పులులు తాము పెంచుకుంటున్న జీవాలను వేటాడటం దైవ బలిగా భావిస్తారు. చుట్టూ ఉన్న ఆలయాల్లో కూడా చిరుత బొమ్మలను ఏర్పాటు చేసి ఓ దైవంలా పూజిస్తుంటారు.
పర్యాటకుల తాకిడి
మన దేశంలో 10వేలకు పైగా చిరుతలున్నాయి. ఎక్కడ చూసినా వాటికి ఆహారం లభించక జనావాసాలపై దాడి చేస్తుంటాయి. ఈ క్రమంలో మనుషుల వేటకు చిరుతలు బలవుతున్నాయి. కానీ, బెరాలో మాత్రం మనుషులకు, చిరుతలకు మధ్య సఖ్యత కన్పిస్తుంది. చిరుతలు స్వేచ్ఛా సంచరించడం స్థానికులకు వింతగా తోచనప్పటికీ బయటి వారు వాటిని చూడటానికి ఎక్కువగా వస్తుంటారు. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఇక్కడ కొందరు తమ స్థలాలను హోటళ్లుగా మార్చారు. దాంతో చిరుతల సంచారానికి అవసరమైన స్థలం క్రమంగా తగ్గిపోతోందని పలువురు పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేసవిలో ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చిరుతలు బయటకు రావు. అందుకే చాలా మంది వైల్డ్లైఫ్ ఫొటోగ్రాఫర్లు అక్టోబరు నుంచి జనవరి మధ్య కాలంలో ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు ఉత్సుకత చూపుతుంటారు.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి. -
Royal family: వందల కార్లు.. రూ.4వేల కోట్ల ప్యాలెస్: ఈ రాజ కుటుంబం హవానే వేరయా..!
విలాసవంతమైన రాజ భవనాలు, ప్రముఖ సంస్థల్లో పెట్టుబడులు, లండన్, పారిస్లో ఆస్తులు.. యూఏఈ రాజ కుటుంబం(royal family of Dubai) సంపద ఎంతో తెలుసా..? -
Lakshadweep: నిమిషానికి 11 ఓడలు.. భారత్ అధీనంలోనే కీలక సముద్ర మార్గం!
లక్షద్వీప్కు సంబంధించి మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. అదే నైన్ డిగ్రీ ఛానెల్. ఇక్కడ ఎలాంటి అలజడి జరిగినా ఆసియాలోని పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. -
World Roundup 2023: విపత్తులు మిగిల్చిన విషాదం.. భీకర యుద్ధాలు!
గడిచిన ఏడాది కాలాన్ని తిరిగి చూస్తే.. ప్రకృతి విపత్తులు, భీకర యుద్ధాలు పలు దేశాలను వణికించాయి. -
Vessel Hijack: హైజాక్ చేయడం...డబ్బు గుంజుకోవడం.. ఈ తరహా ఘటనలెన్నో!
మాల్టా దేశానికి చెందిన వాణిజ్య నౌకను సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. గతంలోనూ ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నాయి. -
December 13, 2001: పార్లమెంటుపై దాడి.. ఆ రోజు ఏం జరిగిందంటే..!
రెండు దశాబ్దాల కిందట ఇదే రోజు (డిసెంబర్ 13, 2001న) భారత పార్లమెంటుపై ఉగ్రవాదులు జరిపిన దాడి యావత్ దేశాన్ని కలవరపాటుకు గురిచేసింది. -
Tunnel Rescue: రాణిగంజ్ నుంచి ఉత్తర్కాశీ దాకా.. చరిత్రలో నిలిచిన సాహసోపేత ఆపరేషన్లు!
భారత్లో రాణిగంజ్ బొగ్గుగని ప్రమాదం మొదలు, థాయ్లాండ్లో గుహలో చిన్నారులు చిక్కుకుపోవడం.. తాజాగా ఉత్తర్కాశీ సొరంగం ఆపరేషన్లు చరిత్రలో నిలిచిపోయాయి. -
Javier Milei: అర్జెంటీనా సమస్యలను తప్పించగలడా.. ఈ ‘పిచ్చాయన’!
అర్జెంటీనాలో ఇటీవలి అధ్యక్ష ఎన్నికల్లో మెజార్టీ సాధించిన జేవియర్ మిలి.. త్వరలోనే దేశ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
Actors turned Directors: ధనుష్, ఉపేంద్ర, కంగన.. మళ్లీ మరో కోణాన్ని చూపించేందుకు...
-
Stock Market: భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
-
AP News: అమ్మో.. అన్ని రోజులా?ఖర్చుల భారంపై నేతల తర్జనభర్జన..!
-
Gadchiroli: గడ్చిరోలిలో ఎదురుకాల్పులు.. నలుగురు మావోయిస్టుల హతం
-
మూడు కార్లలో తాయిలాల సరకు దాటిపోయిందా...?!
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు