Vande Bharat Express : ఆయన కలల ప్రాజెక్టే ‘వందేభారత్ ఎక్స్ప్రెస్’
సంక్రాంతి పండగ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘వందే భారత్ ఎక్స్ప్రెస్’ పరుగులు తీస్తోంది. ఈ రైలు వేగం, అందులోని వసతుల గురించి అంతటా చర్చ నడుస్తోంది. అయితే ఈ రైలు సృష్టికర్త ఎవరు? ఆయన తన కలల ప్రాజెక్టు కోసం ఎలాంటి కృషి చేశారు? చదివేయండి మరి.
(Image : sudhanshu mani twitter)
‘వందే భారత్ ఎక్స్ప్రెస్’(Vande Bharat Express).. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొత్తం ఈ రైలులో కనిపించింది. సికింద్రాబాద్(secunderabad)-విశాఖ(vizag) సర్వీసులతో ప్రారంభమైన ఈ రైలు(train) వేగంగా తమ గమ్యస్థానాలకు తీసుకెళ్తుండటంతో ప్రయాణికులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ‘వందే భారత్ ఎక్స్ప్రెస్’ వెనుక ఓ వ్యక్తి చేసిన అవిరళ కృషి దాగి ఉంది. ఆయనెవరో చదివి తెలుసుకోండి మరి.
ట్రైన్ మ్యాన్ ఆఫ్ ఇండియా
సుధాన్షు మణి(sudhanshu mani).. 1979లో రైల్వేశాఖలో మెకానికల్ ఇంజినీర్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ 2016 ఆగస్టులో చెన్నైలోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ(icf) జీఎం(general manager)గా నియమితులయ్యారు. తన ఉద్యోగ జీవితంలో వర్క్షాప్ నిర్వహణ, రైల్వే ఆపరేషన్స్, తయారీ, ప్రాజెక్టుల నిర్వహణ, ప్లానింగ్ విభాగాల్లో సేవలందించిన ఆయన 1990 నుంచి 2010 వరకు పలు డీజిల్ లోకోమోటివ్స్(diesel locomotive) అభివృద్ధికి కృషి చేశారు. జీఎంగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచే సెమీ హైస్పీడ్ రైళ్ల ఉత్పత్తిపై దృష్టిపెట్టారు. అతి తక్కువ కాలంలోనే తన కలల ప్రాజెక్టు ‘ట్రైన్ 18’(train 18)ను విజయవంతం చేసి 2018 డిసెంబరు 31న ఆయన పదవీ విరమణ చేశారు. భారతీయ రైల్వేల అభివృద్ధికి సుధాన్షు చేసిన సేవలను కీర్తిస్తూ ఆయనను ‘ట్రైన్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా పిలుస్తుంటారు. ప్రస్తుతం వందేభారత్ ఎక్స్ప్రెస్గా పిలుస్తున్న ‘ట్రైన్ 18’ ప్రాజెక్టులో తన అనుభవాలను వివరిస్తూ సుధాన్షు ‘మై ట్రైన్ 18 స్టోరీ’ పేరుతో పుస్తకం కూడా రాశారు.
మనసులో ఉంది.. మార్గం వెతికారు
ఒక మెకానికల్ ఇంజినీర్గా రైల్వేల్లోకి అడుగుపెట్టిన సుధాన్షు మణికి ఆ వ్యవస్థలో ఎలాంటి మార్పులు లేకపోవడం ఆలోచింపజేసింది. విదేశాలు బుల్లెట్ రైళ్లు(bullet train) నడపాలనే ఆలోచనతో ముందుకెళ్తుంటే.. మనం ఇంకా అవే డిజైన్లు, అవే పాత బోగీలతో ఎంతకాలం ఉంటాం అనే ప్రశ్న ఆయనలో ఉదయించింది. అనుకున్నదే తడవుగా సెమీ హై స్పీడ్ రైళ్ల ఆవశ్యకతను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. మన వద్ద ఉన్న సాంకేతిక పరిజ్ఞానం, వసతులతో అలాంటి రైళ్ల తయారీ సాధ్యం కాకపోవచ్చనే అభిప్రాయం అక్కడ వ్యక్తమైంది. కానీ సుధాన్షు పట్టుదల, పనితీరును అర్థం చేసుకున్న అప్పటి రైల్వే బోర్డు ఛైర్మన్ రూ.200 కోట్ల పెట్టుబడితో రెండు రైళ్ల తయారీకి మాత్రం అనుమతించారు. దీంతో మేక్ ఇన్ ఇండియా(make in india) నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకుని ‘ట్రైన్-18’ ప్రాజెక్టును పట్టాలెక్కించడం మొదలు పెట్టారు.
సమయం లేదు మిత్రమా అంటూ కర్తవ్య బోధ
‘ట్రైన్ 18’ ప్రాజెక్టుకు అనుమతి లభించినా.. సుధాన్షు పదవీ విరమణ చేయడానికి రెండేళ్ల సమయం మాత్రమే మిగిలి ఉంది. దీంతో ఆయన కోచ్ ఫ్యాక్టరీలో పని చేసే సిబ్బందిని జాగృతం చేశారు. ‘ఓ కొత్త ప్రాజెక్టు మీ చేతుల్లోకి వచ్చింది. దాన్ని విజయవంతం చేసే బాధ్యత మీదే’ అంటూ అక్కడి సిబ్బంది, ఉద్యోగుల్లో నూతనోత్తేజం నింపారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటే అయ్యే వ్యయంలో మూడో వంతు మాత్రమే వెచ్చించి ‘ట్రైన్ 18’ తయారీ పూర్తి చేయాలని డిజైన్ ఇంజినీర్లకు కర్తవ్య బోధ చేశారు. దాంతో రూ.12 కోట్లు ఖర్చు చేస్తే.. కానీ తయారు కాని ఒక బోగీ.. రూ.6 కోట్లతోనే తయారైంది. యూరప్, జపాన్ దేశాలతో సరి సమానంగా ఆ బోగీల లుక్ మారింది. అలా ఎట్టకేలకు భారత్లో తొలి సెమీ హైస్పీడ్ రైలు వందేభారత్ పట్టాలపై ఎక్కింది. టెస్ట్ రన్లో 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి అందరి చేత ఔరా అనిపించింది.
(Image : sudhanshu mani twitter)
మార్పులకు శ్రీకారం.. చెన్నై ఐసీఎఫ్
దేశీయ రైల్వే అవసరాల కోసం చెన్నై ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాకర్టీ(chennai integral coach factory)ని 1955లో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రారంభించారు. 2015 జులై 6 నాటికి ఇక్కడ 50వేల కోచ్లు తయారయ్యాయి. ఈ ఘనతకు గానూ లిమ్కా బుక్ రికార్డ్స్(limca book of records)లో చోటు దక్కింది. 2017-18 మధ్య 2503 కోచ్లు, 2018-2019 మధ్య 3262 కోచ్లు ఇక్కడ ఉత్పత్తి కావడం మరో రికార్డుగా నిలిచింది. తాను జీఎంగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి సుధాన్షు మణి ఇక్కడ పలు మార్పులు తీసుకొచ్చారు. కోచ్ ఫ్యాక్టరీ మొత్తం సౌరశక్తితో నడిచేలా చర్యలు తీసుకున్నారు. దీంతో ఇది భారతీయ రైల్వేలో తొలి కర్బన రహిత కంపెనీగా నిలిచింది. ఫ్యాక్టరీలోని వ్యర్థాలు, ఇతర వస్తువులు వినియోగించి చూడచక్కని ఆర్ట్ గ్యాలరీగానూ తీర్చిదిద్దారు. ఎక్కడ చూసినా ఆహ్లాదం ఉట్టిపడేలా ఆ ఫ్యాక్టరీని మలిచారు. రైళ్ల రంగు, డిజైన్లలో మార్పునకు చర్యలు తీసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి. -
Royal family: వందల కార్లు.. రూ.4వేల కోట్ల ప్యాలెస్: ఈ రాజ కుటుంబం హవానే వేరయా..!
విలాసవంతమైన రాజ భవనాలు, ప్రముఖ సంస్థల్లో పెట్టుబడులు, లండన్, పారిస్లో ఆస్తులు.. యూఏఈ రాజ కుటుంబం(royal family of Dubai) సంపద ఎంతో తెలుసా..?
తాజా వార్తలు (Latest News)
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
-
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
-
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్