Monarch butterfly : మహా ‘మోనార్క్’లు ఈ సీతాకోక చిలుకలు.. వేల మైళ్లు ప్రయాణిస్తాయి!
తాము బతకడం.. భావి తరాలను బతికించడం కోసం జీవితాంతం యుద్ధం చేస్తుంటాయి ‘మోనార్క్’ జాతి సీతాకోక చిలుకలు (Monarch butterfly).
ఈ సువిశాల భూగోళంపై వేలవేల వర్ణాల సీతాకోక చిలుకలు (Butterfly) సంచరిస్తున్నాయి. వాటిలో ‘మోనార్క్’ జాతి సీతాకోక చిలుకలది (Monarch butterfly) ప్రత్యేకమైన శైలి. అమెరికా (America), కెనడా (Canada) దేశాల్లో ఇవి ఎక్కువగా కన్పిస్తాయి. తమ మనుగడను కాపాడుకొనేందుకు మోనార్క్ జాతి సీతాకోక చిలుకలు కొన్ని ఏకంగా 4 వేల కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణం చేస్తాయి. మెక్సికోలోని (Mexico) సురక్షిత ప్రాంతాలకు వలస వెళ్లి.. అక్కడే నిద్రాణస్థితిలో ఉండి తిరిగి తమ స్వస్థలానికి చేరుకుంటాయి. ఆ విశేషాలేంటో తెలుసుకోండి మరి..
దారి తెలియని సుదూర ప్రయాణం!
అన్ని సీతాకోక చిలుకల్లాగే.. ‘మోనార్క్’లు కూడా గుడ్డు, గొంగళి పురుగు, ప్యూపా, సీతాకోక చిలుకలుగా రూపాంతరం చెందుతాయి. నారింజ, నలుపు, తెలుపు ముదురు రంగులతో ఆకర్షణీయంగా కనిపించే ఈ సీతాకోక చిలుకలు రెక్కలు విప్పితే పది సెంటీమీటర్ల వెడల్పు ఉంటాయి. వాతావరణ మార్పులు సంభవించగానే మోనార్క్లు దాదాపు మూడు వేల మైళ్ల దూరం ప్రయాణించి మెక్సికో చేరుకుంటాయి. ఆ ప్రదేశాన్ని మునుపెన్నడూ చూడకపోయినా అవి విచిత్రంగా ఏటా అక్కడికే వెళ్తాయి. మెక్సికోలోని చల్లటి వాతావరణాన్ని తట్టుకునేందుకు ఈ కీటకాలు నిద్రాణ స్థితిలోకి వెళ్తాయి. వలస కాలం పూర్తయ్యే నాటికి స్త్రీ మోనార్క్ల పునరుత్పత్తి అవయవాలు పూర్తిగా అభివృద్ధి చెందుతాయి. దాంతో పురుష మోనార్క్లు వాటితో సంభోగం చేస్తాయి. నిజానికి మెక్సికో వాతావరణం కూడా ‘మోనార్క్’ల జీవన విధానానికి అనువుగా ఉంటుంది. ఎత్తయిన దేవదారు వృక్షాలు సీతాకోకచిలుకలు గుంపులు గుంపులుగా ఉండటానికి తోడ్పడతాయి. కొందరు మెక్సికో పౌరులు సైతం వాటి మనుగడకు భంగం వాటిల్లకుండా చూసుకుంటున్నారు. మోనార్క్లు నివాసం ఉండే చెట్లను కొట్టివేయకుండా.. ఆ ప్రాంతంలో జన సంచారం అధికం కాకుండా చర్యలు తీసుకుంటున్నారు.
‘మిల్క్ వీడ్’ తోడ్పాటు
వసంత కాలం ప్రారంభం కాగానే అవి తిరిగి తమ సొంత స్థానానికి ప్రయాణం సాగిస్తాయి. ఈ క్రమంలో దారి వెంట కనిపించిన ‘మిల్క్వీడ్’ మొక్కలపై గుడ్లు పెడతాయి. ఈ ప్రక్రియ మార్చి నుంచి ఏప్రిల్ ప్రారంభంలో జరుగుతుంది. నిజానికి ‘మోనార్క్’ల జీవన చక్రంలో ‘మిల్క్ వీడ్’ మొక్కలు కీలక భూమిక పోషిస్తాయి. గుడ్లు మొదలుకొని సీతాకోకచిలుకగా రూపాంతరం చెందే వరకు మోనార్క్లు ఈ మొక్కలను ఆధారం చేసుకొనే ఎదుగుతాయి. కొంచెం విషపూరితమైన ఈ మొక్కలు ‘మోనార్క్’లను మాత్రం ఏమీ చేయవు.ఈ మొక్క ఆకులను తిన్న మోనార్క్ శరీరంలోకి కూడా కొంచెం విషం ఎక్కుతుంది. దాంతో మోనార్క్ శరీరం కూడా విష పూరితంగా ఉంటుంది. అందువల్ల వాటికి శత్రువుల నుంచి జీవిత కాలం రక్షణ లభిస్తుంది. ‘మిల్క్ వీడ్’పై ఉన్న గుడ్ల పునరుత్పత్తి ప్రక్రియ మళ్లీ ఆగస్టు, సెప్టెంబరు మొదట్లో ప్రారంభమవుతుంది. అలా మూడు నుంచి నాలుగు తరాల మోనార్క్లు అభివృద్ధి చెందుతుంటాయి.
దారి పొడవునా పోరాటం
ప్రతి ఏటా కెనడా, ఉత్తర అమెరికా నుంచి మోనార్క్లు వలస వెళ్తుంటాయి. ఆగస్టు చివర్లో, నవంబరు, డిసెంబరు మాసాల్లో ఈ వలసలు జరుగుతుంటాయి. వాటి గమ్యస్థానం సెంట్రల్ మెక్సికోలోని ఓయామెల్ ఫారెస్ట్. ఈ మోనార్క్లు రోజుకు 50 మైళ్ల దూరం సునాయాసంగా ప్రయాణిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గంటకు ఇవి 12 మైళ్ల దూరం వెళతాయట. నైరుతి దిశగా సాగే వాటి ప్రయాణంలో పెద్దపెద్ద నదులు తారసపడతాయి. ఈ ప్రయాణంలో ‘మోనార్క్’లకు ఎన్నో తుపానులు ఎదురవుతుంటాయి. ‘మోనార్క్’లను తినేందుకు రకరకాల పక్షులు ప్రయత్నిస్తాయి. హైవేల గుండా ప్రయాణం చేసేటప్పుడు భారీ వాహనాలు తగిలి ప్రాణాలు కోల్పోతుంటాయి. సుదూర ప్రయాణం కావడంతో కొన్ని తీవ్రమైన అలసటతో మరణిస్తాయి. అలా మిలియన్ల కొద్దీ బయలుదేరిన మోనార్క్ల సంఖ్య మెక్సికో చేరే సరికి భారీగా తగ్గిపోతుంది. మెక్సికోలోనూ వాటికి కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. చెట్లపై ఉన్నప్పుడు భారీ గాలులు వీస్తుంటాయి. తీవ్రమైన మంచు వర్షానికి తట్టుకోలేక వేలాది సీతాకోక చిలుకలు చనిపోతుంటాయి. ఈ వలస కాలంలో సీతాకోకచిలుకలు మకరందాన్ని సేకరించి కార్బోహైడ్రేట్లను పోగు చేసుకుంటాయి. తిరిగి వెళ్లేందుకు కావాల్సిన శక్తిని శరీరంలో నిల్వ చేస్తాయి. కానీ వీటిలోనూ సగానికి సగం మెక్సికోలోనే ప్రాణాలు కోల్పోతాయి.
వలస ఓ మిస్టరీనే..
ఒక దేశం నుంచి మరో దేశానికి వేల కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సిన అవసరం ఈ సీతాకోక చిలుకలకు ఎందుకొచ్చిందీ అనే విషయం శాస్త్రవేత్తలకు ఇంకా అంతుచిక్కడం లేదు. తాము నివాసం ఉంటున్న ప్రాంతంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతున్నట్లు ఈ మోనార్క్లు ముందుగానే గ్రహిస్తాయని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆహారం దొరకని పక్షంలో తమ మనుగడ కష్టమని తెలిసి సురక్షిత ప్రాంతానికి వలస వెళ్తున్నాయట. మరి అప్పుడే పుట్టిన వాటికి వాతావరణ మార్పులు ఎలా తెలుస్తాయనే ప్రశ్న ఉదయిస్తుంది. అందుకు శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే.. ఈ కీటకాలు వాతావరణ మార్పులను నిశితంగా గమనిస్తుంటాయి. పగలు, రాత్రి ఉష్ణోగ్రతల్లో తేడాను పసిగడతాయి. రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడితే అతిశీతల వాతావారణాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని పక్షుల్లాగే వాటికీ తెలిసిపోతుందట. అందుకే ఆ ప్రాంతం నుంచి వలస వెళ్లేందుకు సిద్ధపడుతుంటాయని చెబుతున్నారు.
ఎంతో తెలివైనవి..
మోనార్క్ సీతాకోక చిలుకల మరో ప్రత్యేకత ఏమిటంటే వాటి భావ వ్యక్తీకరణ. మగ మోనార్క్లు తమ వెనుక రెక్కలపై ఉండే సువాసనల గ్రంథుల నుంచి రసాయనాలను విడుదల చేసి ఆడ మోనార్క్లను ఆకర్షణకు గురి చేస్తాయి. ఈ జాతి సీతాకోక చిలుకల రెక్కలు నారింజ రంగులో ఉండటం వల్ల మిగిలిన వాటికి తాము విషపూరితం అనే సంకేతాన్ని పంపుతాయి. ఈ కీటకంపై ఉండే ప్రకాశవంతమైన రంగులు హెచ్చరికలు జారీ చేస్తూ.. తమపై దాడి చేస్తే చిక్కులు తప్పవనే సందేశమిస్తాయి.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి. -
Royal family: వందల కార్లు.. రూ.4వేల కోట్ల ప్యాలెస్: ఈ రాజ కుటుంబం హవానే వేరయా..!
విలాసవంతమైన రాజ భవనాలు, ప్రముఖ సంస్థల్లో పెట్టుబడులు, లండన్, పారిస్లో ఆస్తులు.. యూఏఈ రాజ కుటుంబం(royal family of Dubai) సంపద ఎంతో తెలుసా..?
తాజా వార్తలు (Latest News)
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
-
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
-
ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్ !
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
వలకు చిక్కిన 30 కిలోల చేప