నిజమైన హీరో: సాయంలో మరో సోనూసూద్!
తినడానికి తిండి లేదు. చేయడానికి పనిలేదు. దాచుకున్న డబ్బులూ లేవు. సరే..! సొంతూరుకు వెళ్లి కలో గంజో తాగుదామంటే బస్సులు లేవు. సుదూర ప్రాంతాలకు చేరవేసే రైళ్లూ బంద్. లాక్డౌన్ రెండోసారి పొడగించినప్పుడు...
లాక్డౌన్లో ఎందరో కష్టాలను తీర్చిన ఒడియా హీరో సవ్యసాచి మిశ్రా
తినడానికి తిండి లేదు. చేయడానికి పనిలేదు. దాచుకున్న డబ్బులూ లేవు. సరే..! సొంతూరుకు వెళ్లి కలో గంజో తాగుదామంటే బస్సులు లేవు. సుదూర ప్రాంతాలకు చేరవేసే రైళ్లూ బంద్. లాక్డౌన్ రెండోసారి పొడగించినప్పుడు కనిపించిన దృశ్యాలివి.
మరి దిక్కుతోచని పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటున్న ఆ నిరుపేదలు ఏం చేస్తారు? తెగించినవారు కాలినడకనే నమ్ముకున్నారు. మధ్యలోనే ప్రాణాలు వదిలారు. మరికొందరు సాయం చేసే ఆపన్న హస్తం కోసం ఎదురుచూశారు.
అప్పుడు వలస కూలీలను ఇళ్లకు పంపేందుకు బస్సులు ఏర్పాటు చేయడం, రైళ్లు, విమానాలు బుక్చేస్తూ, కడుపు నిండా తిండి పెడుతూ సినిమాల్లో ప్రతినాయక పాత్రలు వేసే సోనూ సూద్ సిసలైన హీరోగా నిలిచాడు. ఇది అందరికీ తెలిసిన కథే. కానీ మనందరికీ తెలియని మరో హీరో ఉన్నాడు. పేదల బాధను తీర్చిన ఆ కథానాయకుడే ఒడియా నటుడు ‘సవ్యసాచి మిశ్రా’.
స్మైల్ ప్లీజ్ అంటూ..
‘ప్రతి సమస్యకూ ఒక పరిష్కారం ఉంది. కానీ దానికి సహనం అవసరం! దేవుడిపై విశ్వాసం, సానుకూల ఆలోచనల నుంచే ఆ సహనం అలవడుతుంది’ తన స్వచ్ఛంద సంస్థ ‘స్మైల్ ప్లీజ్’ కోసం ముంబయిలో సాయం అందించిన యూసుఫ్ మెహరెల్లి కేంద్రం, కల్యాణ్ బాబు, ధీరజ్ బాబుకు ధన్యవాదాలు చెబుతూ సవ్యసాచి మిశ్రా తన ఫేస్బుక్లో పెట్టిన పోస్టు ఇది. ఆ స్టేట్మెంట్ను బట్టి అతడి మనసేంటో అర్థం చేసుకోవచ్చు. ఆర్తుల కష్టాలను పరిష్కరించే ఓర్పూ, ఓ మంచి పనిచేస్తే ఎవరైనా తనకు తోడ్పాటు అందిస్తారన్న విశ్వాసాన్ని మనం గ్రహించొచ్చు. ఎందుకంటే ఏదో అలా.. ఆరంభించిన తన స్వచ్ఛంద సంస్థ లాక్డౌన్లో అంతమంది కష్టాలను తీరుస్తుందని తానే కలగనలేదు మరి!
విద్యార్థులతో మొదలు
కరోనా వైరస్ ముప్పుతో హఠాత్తుగా లాక్డౌన్ అమలు చేయాల్సిన పరిస్థితి. దాంతో చాలామంది విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయారు. రాజస్థాన్ కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో చదువుతున్న రోసలిన్ మిశ్రా సవ్యసాచిని సోషల్ మీడియా ద్వారా సంప్రదించాడు. అంతేకాదు అతడిలాగే చాలామంది ఉన్నారని చెప్పాడు. మొదట్లో సవ్యసాచికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఎలా వారిని వెనక్కి తీసుకురావాలో తోచలేదు. కానీ మనసులో మాత్రం వారిని అక్కడ చిక్కుకుపోయిన వారిని వెనక్కి తీసుకురావాలన్న ఆలోచన నిండిపోయింది. దాంతో తనకు తెలిసిన పోలీసు అధికారులను సంప్రదించి అనుమతులు తీసుకున్నారు. వారు చెప్పిన ప్రకారం ఏర్పాట్లు చేసి 80 మందికి 72 మంది విద్యార్థులను ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్ నుంచి ఎన్నో ప్రయాలకోర్చి ఒడిశాకు రప్పించారు.
పెరిగిన వినతులు
ఎప్పుడైతే విద్యార్థులను రప్పించాడో అతడికి వినతులు వెల్లువలా రాసాగాయి. కష్టాలు తీర్చాలంటే అన్నీ ఒక్కడే చూసుకోవడం కష్టమని వేర్వేరు రాష్ట్రాలు, జిల్లాలు, నగరాల్లో 100 మంది వాలంటీర్లను ఆహ్వానించారు. అందుకు తగ్గట్టే మంచి స్పందన లభించింది. చక్కని వాలంటీర్లు దొరికారు. ఆ తర్వాత ఆయన లాక్డౌన్లో కష్టాలు పడుతున్న దాదాపు 1500 మందిని తిరిగి ఒడిశాకు తీసుకొచ్చారు. బస్సులు ఏర్పాటు చేశారు. ఆహారం అందించారు. దుబాయ్లో చిక్కుకుపోయిన ఒడియా వాసుల కోసం ఏకంగా విమానాన్ని బుక్ చేశారు. ఫేస్బుక్, సోషల్ మీడియా ద్వారా తాను ఏర్పాటు చేసిన బస్సులు ఎక్కడి నుంచి వస్తున్నాయో ప్రకటించి అక్కడెవరైనా ఒడిశా పౌరులుంటే అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు.
పాపం.. అమ్మాయి
కూరగాయలు అమ్మి కుటుంబాన్ని పోషించే తండ్రి చనిపోవడంతో ఓ 19ఏళ్ల అమ్మాయి ఉపాధి కోసం తెలిసినవాళ్ల సాయంతో బాపట్లకు చేరుకుంది. వెళ్లిన కొన్నాళ్లకే ఆమె జీవితం కష్టాలమయంగా మారింది. యజమాని ఆమె ఫోన్ లాక్కొని, వాళ్లమ్మతో మాట్లాడకుండా చేశారు. ఆమెను చిత్రహింసలు పెట్టారు. శారీరకంగా, మానసికంగా హింసించారు. అంతలోనే లాక్డౌన్ రావడంతో వాళ్లమ్మ సైతం అక్కడికి వెళ్లేందుకు అవకాశం లేకుండా పోయింది. వెంటనే ఆమె సవ్యసాచికి ఫోన్ చేసి సాయం కోరింది. దాంతో డాక్టర్ సాంబశివరావు (తెలుగు సినిమా డిస్ట్రిబ్యూటర్), పోలీసులు ఇంకా మరికొందరి సాయంతో ఆమెను రక్షించి తల్లిఒడికి చేర్చారు. ఆ ఆనందంలో ఆ యువతి సవ్యసాచి కాళ్లమీద పడిపోవడం గమనార్హం.
దుబాయ్ నుంచి మృతదేహం
ఓ యువకుడు పేదవాడు. దుబాయ్లో పనిచేస్తున్నాడు. అతడి తండ్రి అనారోగ్యంతో మృతిచెందాడు. అంత్యక్రియలు చేసేందుకు ఆ యువకుడు రాలేని పరిస్థితి. ఈ విషయం అతడి స్నేహితుడు సవ్యసాచికి ఫేస్బుక్ ద్వారా తెలియజేశాడు. వెంటనే దుబాయ్లోని దౌత్యకార్యాలయం, ఒడియా సంఘంతో మాట్లాడి రెండోరోజే విమానంలో ఒడిశాకు రప్పించారు. లాక్డౌన్ ఒత్తిడిని తట్టుకోలేక కుంగుబాటుతో ఓ వ్యక్తి దుబాయ్లో మరణించారు. ఆయన్ను వెనక్కి తీసుకొచ్చే పరిస్థితి లేదు. కుటుంబ సభ్యులు సవ్యసాచికి మొరపెట్టుకున్నారు. దుబాయ్లో చిక్కుకుపోయిన 189 మందితో పాటు ఆ మృతదేహాన్నీ ప్రత్యేక విమానంలో తీసుకొచ్చేందుకు సాయం చేశారు.
ఆగిపోయిన పెళ్లి మళ్లీ..
చౌవుద్వార్ అమ్మాయి కల్పనా పట్నాయక్కు జూన్లో పెళ్లి కుదిరింది. ఏదో పనిపై ఆమెతో పాటు కుటుంబీకులు తమిళనాడు వెళ్లి అక్కడ చిక్కుకున్నారు. రవాణా సౌకర్యం లేకపోవడంతో పెళ్లి ఆగిపోయే పరిస్థితి నెలకొంది. వీరి సంగతి సవ్యసాచికి తెలియడంతో అధికారులతో మాట్లాడి వారిని తమిళనాడు నుంచి ఒడిశాకు రప్పించారు. క్వారంటైన్ నిబంధనలు పూర్తయ్యాక పెళ్లి చేయించారు. దాంతో ఆ కొత్తజంట సవ్యసాచికి ధన్యవాదాలు తెలియజేసింది.
ఇతరుల సాయమూ
స్వచ్ఛంద సంస్థ కోసం సవ్యసాచి ఇప్పటికే ఎంతో ఖర్చుచేశారు. మొదట్లో ఇతరులు సాయం చేస్తానంటే సున్నితంగా తిరస్కరించేవారు. అయితే ఆర్తుల నుంచి విజ్ఞప్తులు ఎక్కువ కావడంతో ప్రస్తుతం ఇతరుల సాయమూ తీసుకుంటున్నారు. అయితే నగదు రూపంలో కాదు. బస్సులు రాయితీకి ఏర్పాటు చేయడం, ఆహారం అందించడం, అన్నార్తులకు కావాల్సినవి అందించడం వంటి పనుల్లో సాయం స్వీకరిస్తున్నారు. ఎన్నోసార్లు.. ఎంతో మందికి సాయం చేసిన సవ్యసాచి నిజమైన హీరోనే కదా.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘యానిమల్’ టూ ‘రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
‘రామాయణ’ కోసం రణ్బీర్ సిద్ధమవుతున్నారు. ఆ ఫొటోలను ఆయన జిమ్ ట్రైనర్ పోస్ట్ చేశారు. -
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. -
పుష్ప పుష్ప పుష్పరాజ్
‘పుష్ప2’ ప్రచార హంగామా ఊపందుకోనుంది. మే 1న తొలి పాటని విడుదల చేస్తున్నట్టు బుధవారం చిత్రబృందం ప్రకటించింది. ‘పుష్ప పుష్ప పుష్పరాజ్...’ అంటూ సాగే ఆ పాట ప్రోమోని విడుదల చేశారు. -
సర్దార్ 2 సన్నాహాలు
కార్తి.. పోలీసు అధికారిగా, రా ఏజెంటుగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం ‘సర్దార్’. పీఎస్ మిత్రన్ తెరకెక్కించారు. దీనికి కొనసాగింపుగా ‘సర్దార్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. -
రామోజీ ఫిల్మ్సిటీలో తమ్ముడు
నితిన్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘తమ్ముడు’. సప్తమిగౌడ కథానాయిక. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. -
ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి?
‘‘ప్రేక్షకుడికి ఒక మంచి సినిమాని ఇవ్వాలనే ఆలోచన తప్ప మిగతా ఏ రకమైన ఒత్తిడీ నాపైన ఉండదు. తెలుగు సినిమా.. నటిగా నాకు రెండో జీవితాన్నిచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను వాళ్ల సొంతం చేసుకున్నారు. -
గ్రామీణ ప్రేమకథ
పృథ్వీ కథానాయకుడిగా పాలిక్ శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అంబిక, రూపాలి కథానాయికలు. దుర్గం రాజేశ్, రావుల రమేశ్, టి.ఎస్.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
కనులెందుకో కలిసేనులే...
సుధీర్బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరోం హర’. ది రివోల్ట్.. అనేది ఉపశీర్షిక. మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్.జి నాయుడు నిర్మాత. -
ప్రేమిస్తే.. పూర్తిగా నమ్మేస్తా!
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ‘దో ఔర్ దో ప్యార్’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇలియానా. ‘దేవదాసు’లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో దగ్గరైన తను.. ఈ చిత్రంలో నటనకు మంచి మార్కులే కొట్టేసింది. -
యాక్షన్ రుచి చూపించే.. బేబీ జాన్
‘బేబీ జాన్’గా ప్రత్యర్థులకు తన యాక్షన్ రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్. కాలీస్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమే ‘బేబీ జాన్’. -
ఇది నా అదృష్టం: అమితాబ్
ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పేరుతో ఏర్పాటు చేసిన లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బుధవారం స్వీకరించారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. -
ఉత్తమ దర్శకుడు.. కరణ్ జోహార్
దర్శకనిర్మాత కరణ్జోహార్ ఈ ఏడాది మేటి దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. బుధవారం దిల్లీలో.. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిదో లీడర్షిప్ కాన్క్లేవ్లో భారత ఉపరాష్ట్రపతి... -
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
‘పొలిమేర’ నటి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
‘యానిమల్’ టూ ‘రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ