No Selfie : ఇవాళ ‘నో సెల్ఫీస్ డే’.. మీరు కూడా పాటిస్తారా?
సెల్ఫీ క్లిక్లకు ఒక రోజు సెలవు ఇచ్చేందుకు అమెరికాలో ఇవాళ ‘నో సెల్ఫీస్ డే’ను పాటిస్తున్నారు.
మొబైల్(Mobile) ఉన్న ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒక్కసారైనా ఓ ‘సెల్ఫీ’(Selfie) తీసుకునే ఉంటారు. అలా సెల్ఫీలు తీసుకోవడం వ్యసనంలా మారిన కొందరు మాత్రం రోజంతా తమ చరవాణి కెమెరా(Camera)లను క్లిక్ మనిపిస్తూనే ఉంటారు. వారికి కాస్త విరామం ఇచ్చేందుకే ఇవాళ(మార్చి 16) అమెరికా(America)లో ‘నో సెల్ఫీస్ డే’ను పాటిస్తున్నారు.
ఆయన పుట్టిన రోజు!
ప్రతి సంవత్సరం మార్చి 16ను ‘నో సెల్ఫీస్ డే’గా నిర్వహిస్తారు. సామాజిక మాధ్యమాలు, స్మార్ట్ఫోన్(Smart phone)లు రాక ముందు నుంచే సెల్ఫీలున్నాయి. ప్రస్తుత డిజిటల్ యుగంలో ‘సెల్ఫీ’ పదం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇటీవలి కాలంలో చేతిలో ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ సెల్ఫీలు తీసుకుంటున్నారు. సెల్ఫీ స్టిక్లు, ఫోన్ కెమెరాలోని ఆప్షన్లతో ఫొటోలు తీసుకోవడం సులభంగా మారింది. సెల్ఫీలు తీసుకోవడం మీకు ఎంత ఇష్టమైనా ఇవాళ మాత్రం నో సెల్ఫీడేను పాటించాలని కొందరు నిపుణులు చెబుతున్నారు. నిజానికి ఈ ‘నో సెల్ఫీ డే’ను ఎవరు కనిపెట్టారో ఎవరికీ తెలియదు. ఎప్పటి నుంచి పాటిస్తున్నారనే దానికి కచ్చితమైన ఆధారాలూ లేవు. అయితే ఈ రోజునే సెల్ఫోన్ కెమెరాను కనిపెట్టిన ఫిలిప్ కాన్ పుట్టినరోజు కావడం యాదృచ్ఛికం. ఇవాళ విపరీతంగా సెల్ఫీలు తీసుకునే వారిని మిగతావారు లక్ష్యంగా చేసుకుంటారు. అందుకే సెల్ఫీ తీసుకోకుండా ఉండటానికి ప్రయత్నించండి.
వ్యసనం కారణంగా వ్యాధి
ఇక సెల్ఫీ వ్యసనం మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని పరిశోధనల ప్రకారం ఒక మహిళ మంచి సెల్ఫీ ఎలా తీసుకోవాలో ఆలోచిస్తూ వారంలో 104 నిమిషాల పాటు కాలం వెల్లదీస్తుందట. నలుగురిలో ఉన్నప్పుడు తమను ప్రత్యేకంగా గుర్తించాలని కూడా కొందరు సెల్ఫీలు తీసుకుంటారని వెల్లడైంది. అలా చేయడం వల్ల ప్రశంసలు లభిస్తాయని సెల్ఫీలు తీసుకునే వారు ఆశిస్తారట. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల హవా నడుస్తోంది. సెల్ఫీ తీసుకోవడమే ఆలస్యం అందులో అప్లోడ్ చేస్తున్నారు. లైక్లు, కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ కాలం గడిపేస్తున్నారు. సెల్ఫీలు తీసుకోవడానికి ప్రత్యేకంగా మార్కెట్లోకి వచ్చిన లైట్స్, ఫోన్లోని ఫిల్టర్లు, ఎఫెక్ట్స్ వాడి అసలు రూపం కంటే అందంగా కనిపించడానికి ఆరాటపడుతున్నారు. కొంతకాలం కిందట తీసుకున్న అలాంటి సెల్ఫీలను చూసి అప్పట్లో తాము అందంగా, నాజూకుగా ఉండేవారమనే అభిప్రాయానికి వస్తున్నారు. ఇది కూడా ఒక రకమైన వ్యాధి అని వైద్యులు చెబుతున్నారు. తాము మునుపటిలా కనిపించడం లేమని బాధపడటాన్ని వైద్యపరిభాషలో ‘డెస్మోర్ఫియా’ అంటారు. వీరు ఎక్కువ సమయం తమ ప్రతిబింబాలను, ఫొటోలను చూసుకుంటూ బాధపడుతుంటారు.
విమర్శిస్తే కుంగుబాటు!
సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన సెల్ఫీలకు వచ్చే అభినందనలు, విమర్శలు కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని కొన్ని పరిశోధనల్లో తేలింది. ఎవరైనా ఫొటోను డిస్లైక్ చేసినా.. అది బాగా లేదని కామెంట్ చేసినా మానసికంగా కుంగుబాటుకు గురవుతున్నట్లు వెల్లడైంది. ‘నో సెల్ఫీస్ డే’ పాటిస్తే ఆ అనుభవాన్ని ఒక రోజు దూరం చేసుకోవచ్చని పలువురు నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. అందుకే ఈ ఒక్క రోజు కెమెరాతో కాకుండా జీవితాంతం గుర్తుండిపోయే చిత్రాలేవైనా కనిపిస్తాయేమో వెతికి వాటిని మనసులో భద్రపరచుకోవడానికి ప్రయత్నించండి!
సెల్ఫీ గురించి కొన్ని విశేషాలు..
- యూఎస్కు చెందిన కార్నీలియస్ 1839లో మొట్టమొదటి సెల్ఫీ తీసుకున్నాడు.
- ప్రపంచంలో నిత్యం 9.2 కోట్ల సెల్ఫీలు తీసుకుంటున్నారు.
- సెల్ఫీ తీసుకుంటుంటే 60% మంది నవ్వుతారు.
- సెల్ఫీ తీసుకునే క్రమంలో ఏటా సగటున 43 మంది చనిపోతున్నారు. వేల సంఖ్యలో గాయపడుతున్నారు.
- ‘సెల్ఫీ’ అనే పదం 2013లో వర్డ్ ఆఫ్ ది ఇయర్గా నిలిచి ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో చోటు సంపాదించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి. -
Royal family: వందల కార్లు.. రూ.4వేల కోట్ల ప్యాలెస్: ఈ రాజ కుటుంబం హవానే వేరయా..!
విలాసవంతమైన రాజ భవనాలు, ప్రముఖ సంస్థల్లో పెట్టుబడులు, లండన్, పారిస్లో ఆస్తులు.. యూఏఈ రాజ కుటుంబం(royal family of Dubai) సంపద ఎంతో తెలుసా..? -
Lakshadweep: నిమిషానికి 11 ఓడలు.. భారత్ అధీనంలోనే కీలక సముద్ర మార్గం!
లక్షద్వీప్కు సంబంధించి మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. అదే నైన్ డిగ్రీ ఛానెల్. ఇక్కడ ఎలాంటి అలజడి జరిగినా ఆసియాలోని పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. -
World Roundup 2023: విపత్తులు మిగిల్చిన విషాదం.. భీకర యుద్ధాలు!
గడిచిన ఏడాది కాలాన్ని తిరిగి చూస్తే.. ప్రకృతి విపత్తులు, భీకర యుద్ధాలు పలు దేశాలను వణికించాయి. -
Vessel Hijack: హైజాక్ చేయడం...డబ్బు గుంజుకోవడం.. ఈ తరహా ఘటనలెన్నో!
మాల్టా దేశానికి చెందిన వాణిజ్య నౌకను సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. గతంలోనూ ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నాయి. -
December 13, 2001: పార్లమెంటుపై దాడి.. ఆ రోజు ఏం జరిగిందంటే..!
రెండు దశాబ్దాల కిందట ఇదే రోజు (డిసెంబర్ 13, 2001న) భారత పార్లమెంటుపై ఉగ్రవాదులు జరిపిన దాడి యావత్ దేశాన్ని కలవరపాటుకు గురిచేసింది. -
Tunnel Rescue: రాణిగంజ్ నుంచి ఉత్తర్కాశీ దాకా.. చరిత్రలో నిలిచిన సాహసోపేత ఆపరేషన్లు!
భారత్లో రాణిగంజ్ బొగ్గుగని ప్రమాదం మొదలు, థాయ్లాండ్లో గుహలో చిన్నారులు చిక్కుకుపోవడం.. తాజాగా ఉత్తర్కాశీ సొరంగం ఆపరేషన్లు చరిత్రలో నిలిచిపోయాయి. -
Javier Milei: అర్జెంటీనా సమస్యలను తప్పించగలడా.. ఈ ‘పిచ్చాయన’!
అర్జెంటీనాలో ఇటీవలి అధ్యక్ష ఎన్నికల్లో మెజార్టీ సాధించిన జేవియర్ మిలి.. త్వరలోనే దేశ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
Social Look: ‘ఫ్రెష్’ ఫీలింగ్తో ప్రగ్యా.. బ్రదర్కి అనుపమ విషెస్.. చీరలో అదితి, ఐశ్వర్య హొయలు
-
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
-
Kantara: ‘కాంతార 2’.. హీరోయిన్గా ఆమెను ఎంపిక చేస్తున్నారా?
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/03/2024)
-
Telangana High Court: తెలంగాణ హైకోర్టుకు ఇద్దరు కొత్త న్యాయమూర్తులు