Beggars: ఈ స్వచ్ఛంద సంస్థ.. యాచకులను వ్యాపారులను చేస్తోంది!
‘యాచకులకు దానం చేయకండి.. వారి నైపుణ్యాలను గుర్తించి వారిపై పెట్టుబడి పెట్టండి’’అంటోంది.. ఉత్తరప్రదేశ్లోని వారణాసికి చెందిన ‘కామన్మ్యాన్ ట్రస్ట్’ అనే స్వచ్ఛంద సంస్థ. ఎవరూ పుట్టుకతోనే యాచకులు కారని, వారిని సరైన మార్గంలో నడిపిస్తే వ్యాపారవేత్తలుగా ఎదుగుతారని
ఇంటర్నెట్ డెస్క్: ‘యాచకులకు దానం చేయకండి.. వారి నైపుణ్యాలను గుర్తించి వారిపై పెట్టుబడి పెట్టండి’’ అంటోంది.. ఉత్తర్ప్రదేశ్లోని వారణాసికి చెందిన ‘కామన్మ్యాన్ ట్రస్ట్’ అనే స్వచ్ఛంద సంస్థ. ఎవరూ పుట్టుకతోనే యాచకులు కారని, వారిని సరైన మార్గంలో నడిపిస్తే వ్యాపారవేత్తలుగా ఎదుగుతారని చెబుతోంది. చెప్పడమే కాదు.. యాచకులకు నైపుణ్య శిక్షణ ఇప్పించి స్వయం ఉపాధి కల్పిస్తూ వారిని వ్యాపారులుగా మారుస్తోంది.
‘కామన్మ్యాన్ ట్రస్ట్’ను నిర్వహిస్తున్న సామాజిక కార్యకర్త చంద్ర మిశ్ర.. యాచకులను ప్రయోజకులుగా మార్చడమే లక్ష్యంగా గతేడాది ‘బెగ్గర్ కార్పొరేషన్’ పేరుతో స్టార్టప్ను ప్రారంభించారు. ప్రయోగాత్మకంగా వారణాసిలోని 12 యాచక కుటుంబాల నుంచి 55 మందిని ఎంచుకొని వారికి వివిధ అంశాల్లో నైపుణ్య శిక్షణ ఇప్పించారు. వారిలో కొందరు వస్త్రం, కాగితాలతో బ్యాగులు తయారు చేయడం నేర్చుకున్నారు. దీంతో వారిని స్వయం సహాయక బృందంగా మార్చి బ్యాగుల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయించారు. వారి ఉత్పత్తులు మార్కెట్లో బాగానే అమ్ముడవుతుండటంతో మిశ్రకు తన ఆలోచనపై నమ్మకం పెరిగింది. దీంతో యాచకులందరినీ ఇదే బాటలో నడిపించాలని సంకల్పించారు.
ఓ నివేదిక ప్రకారం భారతీయులు ఏటా రూ.34వేల కోట్లు యాచకులకు దానంగా ఇస్తున్నారట. దానం చేయడం ద్వారా పుణ్యం లభిస్తుందని భావించే ఈ విధంగా చేస్తుంటారని, అలా కాకుండా వారిపై పెట్టుబడి పెడితే యాచకుల జీవితాలే మారుతాయని మిశ్ర చెప్పుకొచ్చారు.
ప్రయోగత్మాకంగా ఏర్పాటు చేసిన ‘బెగ్గర్ కార్పొరేషన్’కు ఆదరణ లభిస్తుండటంతో దానిని ఆదాయ వనరున్న కంపెనీగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రూ. 2.5కోట్ల పెట్టుబడులు సేకరించేందుకు మిశ్ర ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రభుత్వం తమకు అనుమతిస్తే.. యాచకులను గుర్తించి.. పిల్లల్ని, వృద్ధుల్ని పునరావాస కేంద్రాలకు పంపించి, 18-45ఏళ్ల వయస్కులకు మూడు నెలలు శిక్షణ ఇచ్చి, రుణాలు ఇప్పించి వ్యాపారం ప్రారంభించేలా చేస్తామని ‘కామన్మ్యాన్ ట్రస్ట్’ నిర్వహకులు అంటున్నారు.
అంతేకాదు, యాచకుల పిల్లలు చదువుకునేందుకు వారణాసిలోనే ‘స్కూల్ ఆఫ్ లైఫ్’ పేరుతో ఓ పాఠశాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో 32 మంది చిన్నారులు విద్యనభ్యసిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
నగర శివారులో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి శ్రీశైలం జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. -
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. -
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
వైకాపా ప్రచారరథం ఢీకొని బాలుడు మృతి చెందిన ఘటన అత్యంత విషాదకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
దిల్లీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో ఈడీ కేసులో అప్రూవర్గా మారిన నిందితుడు శరత్ చంద్రారెడ్డి, సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్గా మారారు. -
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణీ నిలిపివేశాం: రంగరాజన్
హైదరాబాద్ శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణీ నిలిపివేసినట్టు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!