పాటల పోటీ: లైట్ ఆన్ చేయడమే ఓటు
టెలివిజన్, టెక్నాలజీ అందరికి అందుబాటులోకి వచ్చాక ఎన్నో పోటీ కార్యక్రమాలు ప్రసారమయ్యాయి. పాటలు, డాన్సులు, బిగ్బాస్ అంటూ అనేక కార్యక్రమాలు వస్తున్నాయి. వీటిలో పాల్గొనేవారికి ప్రేక్షకులే ఓటు వేసి గెలిపించాల్సి ఉంటుంది. ఇప్పుడంటే ఫోన్లో ఎస్ఎంఎస్లు చేయండి, మిస్డ్
సోవియట్ టీవీ కార్యక్రమంలో వింత ఓటింగ్
టెలివిజన్, టెక్నాలజీ అందరికి అందుబాటులోకి వచ్చాక ఎన్నో పోటీ కార్యక్రమాలు ప్రసారమయ్యాయి. పాటలు, డ్యాన్సులు, బిగ్బాస్ అంటూ అనేక కార్యక్రమాలు వస్తున్నాయి. వీటిలో పాల్గొనే వారికి ప్రేక్షకులే ఓటు వేసి గెలిపించాల్సి ఉంటుంది. ఇప్పుడంటే ఫోన్లో ఎస్ఎంఎస్లు చేయండి, మిస్డ్ కాల్ ఇవ్వండి, ఆన్లైన్లో ఓటు వేయండని చెబుతున్నారు. కానీ ఇవేవీ అందరికి అందుబాటులో లేని సమయంలోనూ ఇలాంటి పోటీ కార్యక్రమం ఒకటి ప్రసారమైంది. ఇందులో పాల్గొన్న వారికి ప్రేక్షకులు ఓట్లు వేసిన విధానం గురించి తెలిస్తే నివ్వెరపోతారు. ఇలా కూడా ఓట్లు వేయొచ్చా? అని ముక్కున వేలేసుకుంటారు..!
1956 నుంచే యూరప్లో టీవీలో పాటల పోటీలు ప్రసారమయ్యేవి. ‘యూరోవిజన్’ పేరుతో ప్రసారమైన కార్యక్రమాన్ని యూరప్ బ్రాడ్కాస్టింగ్ నిర్వాహకులు అమెరికా, సోవియట్ యూనియన్ దేశాలతో కలిసి నిర్వహించేవారు. దీంతో ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకుంది. అయితే 1977లో సోవియట్ యూనియన్ యూరోవిజన్లాంటి కార్యక్రమాన్నే దేశీయంగా నిర్వహించాలని భావించింది. ఈ మేరకు ‘ఇంటర్విజన్’ పేరుతో పాటల పోటీ కార్యక్రమం ప్రారంభించింది. అయితే యూరోవిజన్ కార్యక్రమంలో కేవలం అక్కడ ఉండే న్యాయనిర్ణేతలు మాత్రమే ఓటు వేసి గెలిపించేవారు. కానీ, ఇంటర్విజన్ ఫైనల్ రౌండ్లో పోటీదారులకు టీవీ చూస్తున్న ప్రేక్షకులు సైతం ఓట్లు వేసే విధంగా కార్యక్రమాన్ని తీర్చిదిద్దారు.
అయితే ఇక్కడే ఓ సమస్య వచ్చి పడింది. ఓట్లు ఎలా వేయాలి? పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓట్లు వేయమని చెబుతామంటే.. ఆ ఓట్లు కార్యక్రమం నిర్వాహకుల వద్దకు రావడానికే చాలా ఆలస్యమవుతుంది. పైగా ఈ బ్యాలెట్ ఓట్లపై అప్పటి ప్రజలకు పెద్దగా నమ్మకం ఉండేది కాదు. మరి ఏం చేయాలని ఆలోచిస్తున్న తరుణంలో ఈ కార్యక్రమం నిర్వాహకుల్లో ఒకరు వినూత్న ఓటింగ్ విధానానికి శ్రీకారం చుట్టారు. దేశ విద్యుత్శాఖ సహకారంతో ఓటింగ్ ప్రక్రియను అందుబాటులోకి తెచ్చారు.
లైట్స్ ఆన్ చేస్తే ఓటు వేసినట్లు..
ఈ ఓటింగ్ విధానం ఎలా పనిచేసేదంటే.. కార్యక్రమంలో పాల్గొన్న పోటీదారులు పాట పాడిన తర్వాత ఆ పాట నచ్చితే వెంటనే ఇంట్లో ఉండే లైట్స్ ఆన్ చేయాలని కార్యక్రమం వ్యాఖ్యాత చెప్పేవారు. అలా చెప్పగానే టీవీ చూస్తున్న ప్రేక్షకులు పాట నచ్చి ఓటు వేయాలనుకుంటే వెంటనే ఇంట్లో ఉన్న లైట్స్ ఆన్ చేసేవారు. ప్రేక్షకులు లైట్స్ ఆన్ చేయడం వల్ల వినియోగమైన విద్యుత్ను విద్యుత్ శాఖ లెక్కగట్టి కార్యక్రమం నిర్వాహకులకు నివేదిక ఇచ్చేది. అలా పోటీదారుల్లో ఎవరికోసమైతే ఎక్కువ విద్యుత్ వినియోగమైందో వారే విజేతగా నిలిచేవారు. అలా ఈ కార్యక్రమం 1977 నుంచి 1980 వరకు కొనసాగింది. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అయిన తర్వాత 2008లో రష్యాలో ఈ కార్యక్రమాన్ని ఒకసారి నిర్వహించి ఆపేశారు. ప్రస్తుతం ఇదే కార్యక్రమాన్ని ‘సొపోట్ ఇంటర్నేషనల్ సాంగ్ ఫెస్టివల్’పేరుతో పోలాండ్లో నిర్వహిస్తున్నారు.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ కస్టడీ పిటిషన్పై తీర్పును విజయవాడ కోర్టు వాయిదా వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
-
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
-
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు