రాజ్యం పోయినా ఊరుకున్నారు.. పీట కోసం పోరాడారు
స్వతంత్ర రాజ్యంగా ఉండాలని బ్రిటన్తో ఎంతో పోరాడారు. పలుమార్లు యుద్ధాలు చేశారు. అయినా ఫలితం దక్కలేదు. ఆంగ్లేయుల చేతిలో ఓడిపోవాల్సి వచ్చింది. దీంతో ఏం చేయలేక, మళ్లీ పోరాడలేక బ్రిటన్ పాలనలో బనిసలుగా బతికేయాల్సిందేనని అనుకున్నారు. అయితే
(Photo: ASANTEMAN ASSOCIATION OF MINNESOTA)
స్వతంత్ర రాజ్యంగా ఉండాలని బ్రిటన్తో ఎంతో పోరాడారు. పలుమార్లు యుద్ధాలు చేశారు. అయినా ఫలితం దక్కలేదు. ఆంగ్లేయుల చేతిలో ఓడిపోవాల్సి వచ్చింది. దీంతో ఏం చేయలేక, మళ్లీ పోరాడలేక బ్రిటన్ పాలనలో బానిసలుగా బతికేయాల్సిందేనని అనుకున్నారు. అయితే ఓ బ్రిటీష్ అధికారి కోరిక ఆ రాజ్యంలో ప్రజలకు ఆగ్రహావేశాలు తెప్పించింది. మళ్లీ యుద్ధానికి ఉసిగొల్పింది. కొన్ని నెలలపాటు సాగిన ఈ యుద్ధంలో అక్కడి ప్రజలు ఓడినా.. ఆ అధికారి కోరిక తీరకుండా చేశారు. ఇంతకీ ఏంటా కోరిక? ఎవరిది ఆ రాజ్యం?
గతంలో బ్రిటన్ అనేక రాజ్యాలపై దాడి చేసి తమ అధీనంలోకి తెచ్చుకుంది. అమెరికా నుంచి భారత్ వరకు అనేక దేశాలను ఎన్నో శతాబ్దాలు పాలించింది. ఈ క్రమంలోనే ఆఫ్రికా ఖండంలోని అశాంతి రాజ్యాన్ని (ప్రస్తుత ఘనా దేశం) తమ పరిపాలనలోకి తెచ్చుకోవాలని 1824 నుంచి 1900 మధ్య నాలుగుసార్లు బ్రిటన్ యుద్ధం చేసింది. అయితే మూడుసార్లు విఫలమైన ఆంగ్లేయులు నాలుగోసారి విజయం సాధించారు. ఆ రాజ్యాన్ని స్వాధీనం చేసుకొని అప్పటి చక్రవర్తి ప్రెంపెపై రాజ్య బహిష్కరణ విధించారు. ఇకపై రాజ్యాన్ని బ్రిటన్ ప్రభుత్వమే పాలిస్తుందని ప్రకటించారు. అయితే గోల్డ్కోస్ట్ గవర్నర్ అయినా ఫ్రెడెరిక్ మిచెల్ హడ్సన్ కన్ను... అశాంతి రాజ్య చక్రవర్తులు కూర్చునే బంగారు పీటపై పడింది. ఆ బంగారు పీటను ఆ రాజ్య ప్రజలు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఆ పీటపై కేవలం అశాంతి రాజ్య పాలకులకు మాత్రమే కూర్చునే అర్హత ఉంటుందని నమ్ముతారు. అలాంటి పీటపై తాను కూర్చొని పాలన చేయాలని అతడికి కోరిక పుట్టింది. వెంటనే ఆ బంగారు పీటను తనకు అప్పగించాలని ఆదేశాలు జారీ చేశాడు.
ఇక అంతే.. రాజ్యం పోయినా మిన్నకుండిపోయిన ప్రజలు.. బంగారు పీటను బ్రిటీష్ అధికారులు స్వాధీనం చేసుకుంటామని ప్రకటించగానే తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. అశాంతి రాజ్య రాజమాత యా అసంతేవా, బంగారు పీట కాపలాదారు, మరికొందరు ప్రజలే సైన్యంగా మారి బ్రిటన్ ప్రభుత్వంపై యుద్ధానికి దిగారు. 1900 మార్చి 28న మొదలైన ఈ యుద్ధం ఆరు నెలలపాటు కొనసాగింది. ఈ క్రమంలో 2వేలకు పైగా అశాంతి రాజ్య సైనికులు, వెయ్యి మంది బ్రిటన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ యుద్ధంలోనూ బ్రిటీష్వారే గెలుపొందారు. అయితే ఆ బంగారు పీట మాత్రం వారికి లభించలేదు. దానిని అశాంతి రాజ్య సైనికులు ఎవరికీ దొరకుండా భద్రపర్చారు.
అయితే 1920లో రైలురోడ్ నిర్మిస్తున్నప్పుడు కొందరు కార్మికులకు ఈ బంగారు పీట లభించింది. దానికున్న ఆభరణాలను తొలగించేందుకు ప్రయత్నించగా.. వారిని అశాంతి ప్రజలు పట్టుకొని ఉరితీయబోయారు. అప్పుడు బ్రిటన్ అధికారులు జోక్యం చేసుకొని వారిని మరో చోటుకు పంపించారు. బంగారు పీటకు ఉన్న విలువ, పవిత్రత తెలుసుకున్న అధికారులు ఇకపై దాని జోలికి వెళ్లబోమని హామీ ఇచ్చారు. అలా అక్కడి ప్రజలు ఆ బంగారు పీటను కాపాడుకోవడమే కాదు.. ఇప్పటికీ దానిని ఓ పవిత్రమైన వస్తువుగా పూజిస్తున్నారు.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం