మాజీ అధ్యక్షులకు పింఛను ఎంతో తెలుసా?
ప్రపంచానికి పెద్దన్న పాత్ర పోషించే అమెరికాకు అధ్యక్షుడు ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ విజయం సాధించారు.
ప్రపంచానికి పెద్దన్న పాత్ర పోషించే అమెరికాకు అధ్యక్షుడు ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ విజయం సాధించారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓటమిని చవిచూశారు. ఇలా మాజీ అధ్యక్షులుగా మారి, శ్వేతసౌధాన్ని వీడిన నేతల జీవితం ఎలా ఉంటుంది? వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?
అమెరికాకు ఇప్పటి వరకు 45 మంది అధ్యక్షులయ్యారు. చరిత్ర చూస్తే చాలా మంది నేతలు రెండు పర్యాయాలు అధ్యక్షుడిగా కొనసాగారు. కొద్ది మంది మాత్రమే ఒక్కసారే అధ్యక్షుడై ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే పదవి కాలం ముగిశాక ఆ తర్వాత వారు ఏం చేస్తారు? ఎలా జీవిస్తారనే విషయాన్ని ఎవ్వరూ పెద్దగా పట్టించుకోరు. వాళ్లు కూడా రాజకీయాలకు, మీడియాకు దూరంగా.. స్వచ్ఛంద సేవ, వ్యాపారాలు చేస్తూ జీవితం గడిపేందుకు ఇష్టపడతారు. అయితే, దేశానికి సేవలందించినందుకు గానూ వీరికి ప్రభుత్వం కొన్ని ప్రయోజనాలు కల్పిస్తోంది.
మొదట్లో మాజీ అధ్యక్షులకు ఎలాంటి ప్రయోజనాలు ఉండేవి కావు. అయితే 1912లో ఆండ్రూ కార్నెగీ అనే పారిశ్రామిక వేత్త మాజీ అధ్యక్షులకు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఆ కాలంలోనే ఏటా 25వేల డాలర్లు పింఛను ఇస్తానని ప్రకటించారు. కానీ, అప్పటి నేతలు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశాధినేతలుగా వ్యవహరించినవారికి ఓ ప్రైవేటు వ్యక్తి పింఛను ఇవ్వడమేంటని ప్రశ్నించారు. అలా ప్రభుత్వానికే మాజీలకు ఏదైనా ప్రయోజనం కల్పించాలనే ఆలోచన తట్టింది. ఆ ఆలోచనకు ఫలితంగానే 1958లో ‘ఫార్మర్ ప్రెసిడెంట్ యాక్ట్’ అమల్లోకి వచ్చింది. ఈ యాక్ట్ ప్రకారం.. మాజీ అధ్యక్షులకు ప్రభుత్వం పింఛను, సిబ్బంది జీతభత్యాల భృతి, ఆరోగ్య బీమాతోపాటు రహస్యంగా భద్రత కల్పిస్తుంది.
పింఛను
మాజీ అధ్యక్షులకు సెక్రటరీ ఆఫ్ ట్రెజరీ పింఛను మంజూరు చేస్తుంది. ప్రస్తుతం ఏడాదికి 2,19,200డాలర్లు(దాదాపు రూ.1.6కోట్లు) పింఛను ఇస్తున్నారు. ఇది ఎగ్జిక్యూటివ్ విభాగంలో ఉద్యోగుల జీతంతో సమానం. అయితే, ఏటా సమీక్ష ఆధారంగా పింఛను మొత్తంలో మార్పులు జరుగుతాయి. అధ్యక్ష పదవి నుంచి దిగిన వెంటనే పింఛను ఇవ్వడానికి జరగాల్సిన ప్రక్రియ మొదలవుతుంది. మాజీ అధ్యక్షుడి జీవిత భాగస్వామికి కూడా ఏడాదికి 20వేల డాలర్ల చొప్పున పింఛను ఇస్తారు. అయితే, మరే ఇతర చట్టబద్ధమైన పింఛన్లు వారు పొందతూ ఉండకూడదు. లేదా ఉన్న పింఛన్ను వదులుకుంటేనే ఈ 20వేల డాలర్లు చెల్లిస్తారు.
మార్పునకు ఖర్చులు..
అధ్యక్ష పదవి కాలం ముగిసిందంటే.. శ్వేతసౌధం విడిచిపెట్టి వెళ్లాల్సిందే. మరో ప్రాంతంలో సొంతగా ఏదైనా ఆఫీస్ ఏర్పాటు చేసుకోవడం కోసం అయ్యే ఖర్చుల్ని ప్రభుత్వమే భరిస్తుంది. అధ్యక్ష పీఠం దిగిన దగ్గర నుంచి ఏడు నెలల పాటు.. మాజీ అధ్యక్షుడి కొత్త ఆఫీసు అద్దె, టెలిఫోన్, ఇంటర్నెట్, ప్రింటింగ్, పోస్టల్ సేవలకు అయ్యే ఖర్చుల కోసం ప్రభుత్వం ఈ నిధులు కేటాయిస్తుంది.
వ్యక్తిగత ఉద్యోగులు
మాజీ అధ్యక్షులకు వ్యక్తిగతంగా కొందరు ఉద్యోగులు ఉంటారు. వారికి ఇవ్వాల్సిన జీతాలను ప్రభుత్వం జనరల్ సర్వీస్ అడ్మినిస్ట్రేషన్ విభాగం ద్వారా ఇప్పిస్తుంటుంది. ఉద్యోగుల ఎంపిక, బాధ్యత మొత్తం మాజీ అధ్యక్షులదే. అయితే, ఆ ఉద్యోగుల జీతాలు మొదటి 30 నెలలు 1.5లక్షల డాలర్లు మించకూడదు. ఆ తర్వాత 96వేల డాలర్లకు పరిమితం చేస్తారు.
ఆరోగ్య బీమా
దేశాధ్యక్షుడికే కాదు.. మాజీ అధ్యక్షులకు కూడా మిలటరీ ఆస్పత్రుల్లోనే వైద్యం అందిస్తారు. కానీ, మెనేజ్మెంట్ అండ్ బడ్జెట్ విభాగం నిర్ణయించిన ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. రెండుసార్లు అధ్యక్ష పదవి చేపట్టిన నేతలు ఫెడరల్ ఎంప్లాయి హెల్త్ బెనిఫిట్స్ ప్రోగ్రాం కింద ఆరోగ్య బీమా తీసుకోవచ్చు.
రహస్య భద్రత
దేశ అధ్యక్షుడిగా తీసుకున్న నిర్ణయాలు, చేసిన పనులు కొందరికి నచ్చకపోవచ్చు. ఈ నేపథ్యంలో వారికి శత్రువులు పెరిగే అవకాశముంది. అందుకే అధ్యక్షుడికి అత్యంత కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తారు. పదవి కాలం ముగిసిన తర్వాత కూడా వారి ప్రాణాలకు హాని ఉండొచ్చు. కాబట్టి, ప్రభుత్వం మాజీ అధ్యక్షులు, వారి కుటుంబానికి రహస్యంగా భద్రత కల్పిస్తోంది. 1965 నుంచి 1996 వరకు జీవితకాలం భద్రత కల్పించే చట్టం అమల్లో ఉండేది. 1997లో దానిని పదేళ్లకు కుదించారు. అయితే, బరాక్ ఒబామా దీనిని మళ్లీ జీవితకాలానికి పెంచుతూ చట్టం తీసుకొచ్చారు. 1985లో రిచర్డ్ నిక్సన్ ఈ రహస్య భద్రతను వదులుకున్నారు. అలా భద్రతను వదులుకున్న ఏకైక మాజీ అధ్యక్షుడు ఆయనే.
ప్రభుత్వం ఇచ్చే ఈ ప్రయోజనాలే కాకుండా.. మాజీ అధ్యక్షులందరూ అధికారంలో ఉండగా ఎదురైనా అనుభవాలు, జ్ఞాపకాలతో ప్రెసిడెన్షియల్ మెమోరైస్(ఆత్మకథ) రాస్తుంటారు. పలు ప్రచురణ సంస్థలు వాటి హక్కులు కొనుగోలు చేసి పుస్తకాలను మార్కెట్లో విడుదల చేస్తారు. వీటి ద్వారా మాజీ అధ్యక్షులకు కొంతమొత్తం ఆదాయం వస్తుంది.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
Rahul Gandhi: ఎన్నికల మేనిఫెస్టోలో తాము ప్రతిపాదించిన ‘సామాజిక - ఆర్థిక సర్వే’ కేవలం అన్యాయాన్ని అంచనా వేయడానికి మాత్రమేనని రాహుల్ గాంధీ అన్నారు. చర్యలు తీసుకోవడానికి కాదంటూ క్లారిటీ ఇచ్చారు. -
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
వారసత్వ పన్ను గురించి శామ్ పిట్రోడా (Sam Pitroda) చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ప్రధాని మోదీ (Modi) చేసిన ప్రసంగంతో కాంగ్రెస్ మరింత ఇరకాటంలో పడింది. -
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
మన దేశ ఎన్నికలపై విదేశీ మీడియా స్పందించడానికి గల కారణాన్ని కేంద్రమంత్రి జై శంకర్ (S Jaishankar) వెల్లడించారు. -
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
శామ్ పిట్రోడా (Sam Pitroda) తన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీని వివాదంలోకి నెట్టారు. దాంతో ఇప్పుడు హస్తం పార్టీ వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. -
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
Patanjali: సుప్రీంకోర్టు ఆగ్రహం నేపథ్యంలో పతంజలి సంస్థ మరోసారి వార్తాపత్రికల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణలు తెలియజేసింది. నిన్నటితో పోలిస్తే మరింత పెద్ద సైజులో ఈ ప్రకటనలు ఇచ్చింది. -
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు
-
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
-
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు
-
యూట్యూబ్కు పోటీగా.. వీడియోల కోసం ‘ఎక్స్’ టీవీ యాప్!
-
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
-
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్