Health: టీ తాగితే గుండెకు మేలేనా?
చాలామందికి ‘టీ’ తాగకపోతే ఆ రోజే ప్రారంభం కాదు. నిద్ర లేచీ లేవగానే తేనీటి చుక్క నాలిక మీద పడాల్సిందే. మరికొందరు రోజులో కనీసం నాలుగైదు సార్లు చాయ్ తాగేస్తుంటారు.
ఇంటర్నెట్డెస్క్: చాలామందికి ‘టీ’ తాగకపోతే ఆ రోజే ప్రారంభం కాదు. నిద్ర లేచీ లేవగానే తేనీటి చుక్క నాలిక మీద పడాల్సిందే. మరికొందరు రోజులో కనీసం నాలుగైదు సార్లు చాయ్ తాగేస్తుంటారు. లేకుంటే ఏదో కోల్పోయినట్లుంటుందని చెబుతుంటారు. అయితే ఇలా ఎక్కువ సార్లు టీ తాగడం మంచిదేనా? దీనివల్ల గుండెపై ఏమైనా ప్రభావం పడుతుందా?
చాయ్ తాగడం వల్ల ఓ రకంగా గుండెకు మేలే జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శాస్త్రీయంగానూ ఇది నిరూపితమైంది. ఎక్కువగా టీ తాగుతున్న దాదాపు లక్ష మందిపై ఏడేళ్లపాటు శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. సాధారణ ప్రజలకంటే వీరిలో గుండె సంబంధిత వ్యాధులు 20 శాతం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా ఒకవేళ గుండె వ్యాధులు వచ్చినా మరణించే సందర్భాలు 22 శాతం తక్కువగా ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. ఈ మేరకు యూరోపియన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ కార్డియాలజీలో కథనం ప్రచురితమైంది. మరోవైపు జపాన్ దేశానికి చెందిన దాదాపు 40 వేల మందిపై శాస్త్రవేత్తల బృందం పరిశోధనలు చేపట్టింది. రోజుకు కనీసం 5 కప్పుల గ్రీన్ టీ తీసుకున్నవారిలో గుండెపోటుతో మరణించే అవకాశాలు దాదాపు 26 శాతం తక్కువగా ఉన్నట్లు అందులో తేలింది. ఈ మేరకు అమెరికన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్లో కథనం ప్రచురితమైంది.
గుండెకు టీ ఎలా మేలు చేస్తుంది?
టీ తాగడం వల్ల గుండెకు ఏవిధంగా మంచిదో తెలుసుకునే ముందు.. అధిక రక్తపోటు హృదయాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవాలి. గుండె నుంచి శరీర భాగాలకు, శరీర భాగాల నుంచి గుండెకు నిరంతరం రక్తం సరఫరా అవుతుంది. రక్తపోటు ఎక్కువగా ఉండటం వల్ల రక్తనాళాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఫలితంగా అవి పగిలిపోవడం, చిల్లులు పడటం లాంటి సమస్యలు తలెత్తుతాయి. సాధారణంగా ఒత్తిడికి గురైన సందర్భాల్లో అధికంగా రక్తం సరఫరా అవుతుంది. అలాంటప్పుడు అవసరాన్ని బట్టి రక్తనాళాలు కొంచెం సాగుతూ ఉంటాయి. కానీ అధిక రక్తపోటు ఉన్నవారిలో అలా జరగదు. రక్తనాళాలు కుంచించుకుపోయి రక్తం గడ్డ కడుతుంది. ఫలితంగా ఛాతి భాగంలో నొప్పితోపాటు, హృదయ సంబంధమైన వ్యాధులు వచ్చేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు హఠాత్తుగా గుండె ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది.
టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇందులో ఉండే పాలిఫెనాల్ పదార్థాలు యాంటీ ఆక్సిడెంట్లుగా పని చేసి రక్తనాళాలను వదులుగా ఉంచేందుకు తోడ్పడుతాయి. అంతేకాకుండా రక్తకణాల లోపలి పొరల్లో ఉండే నైట్రిక్ ఆక్సైడ్ను ఉత్తేజపరచేందుకు ఈ పాలిఫెనాల్ ఉపయోగపడుతుంది. ఫలితంగా రక్త ప్రసరణ సజావుగా సాగి హృదయం ఆరోగ్యంగా ఉండేందుకు సహకరిస్తుంది. ప్రస్తుతం రకరకాల చాయ్లు అందుబాటులో ఉన్నాయి. గ్రీన్ టీ శరీరంలోని అనవసరపు కొవ్వును కరిగిస్తుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిని క్రమబద్ధీకరిస్తుంది. మరోవైపు రక్తంలో పేరుకుపోయిన ప్రమాదకరమైన కొవ్వు కణాలను కరిగించేందుకు బ్లాక్ టీ ఎంతగానో సహాయపడుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్పై రాయిదాడి కేసు.. దుర్గారావు ఎక్కడ?
సీఎం జగన్పై రాయిదాడి కేసులో అదుపులోకి తీసుకున్న వేముల దుర్గారావు కోసం కుటుంబ సభ్యులు మరోసారి రోడ్డెక్కారు. -
22న ఏపీ పదోతరగతి ఫలితాలు
ఆంధ్రప్రదేశ్లో పదోతరగతి ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు ఆలయంలో ‘వివాహ ప్రాప్తి’ రద్దు: ప్రధాన అర్చకులు రంగరాజన్
హైదరాబాద్ నగర శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. -
సైబర్ టవర్స్ వద్ద చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలను హైదరాబాద్లో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. -
చంద్రబాబుకు ప్రముఖుల జన్మదిన శుభాకాంక్షలు
తెదేపా అధినేత చంద్రబాబుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దుర్గారావును చూపించాలంటూ ఆందోళన.. సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
నగరంలోని సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సీపీ కాంతి రాణాను కలిసేందుకు వడ్డెర కుల సంఘం నేతలు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చారు. -
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
చిత్తూరు జిల్లా కుప్పంలో తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలను ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
నగరంలోని పలుచోట్ల శనివారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. -
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
రాజమహేంద్రవరానికి చెందిన అలికాని సత్యశివకుమార్(శివస్వామి), దుర్గాభవానీలు వినూత్న ప్రయత్నం చేశారు. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు
తాజా వార్తలు (Latest News)
-
అందుకే భారాస కష్టాల్లో పడింది: గుత్తా సుఖేందర్రెడ్డి
-
జగన్పై రాయిదాడి కేసు.. దుర్గారావు ఎక్కడ?
-
22న ఏపీ పదోతరగతి ఫలితాలు
-
ఎన్నికల బాండ్లపై సీతారామన్ వ్యాఖ్యలు.. తీవ్రంగా విమర్శించిన కాంగ్రెస్
-
వాటిని నమ్మకండి.. మహేశ్-రాజమౌళి సినిమాపై నిర్మాత కామెంట్స్
-
‘నా తమ్ముడికి ఓట్లేస్తేనే మీకు నీళ్లు’.. డీకే శివకుమార్ వ్యాఖ్యలపై కేసు నమోదు