JPC : గతంలో కుంభకోణాలపై జేపీసీ.. అవి ఏం చేశాయంటే..?
అదానీ గ్రూప్ అవకతవకలపై విచారణ చేసేందుకు సంయుక్త పార్లమెంటరీ సంఘం(జేపీసీ) ఏర్పాటు చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అసలు జేపీసీ ఎలా పని చేస్తుందో చదివేయండి.
అదానీ గ్రూప్(Adani Group)పై హిండెన్బర్గ్ రీసెర్చ్ ఇచ్చిన నివేదిక స్టాక్ మార్కెట్లను కుదిపేసింది. ఈ నివేదిక నేపథ్యంలో అదానీ గ్రూప్ మార్కెట్ విలువ భారీగా పతనమైంది. దీంతో మదుపరులు సహా, కొన్ని బ్యాంకులు, ఎల్ఐసీ వంటి సంస్థలు తీవ్రంగా నష్టపోయాయి. ఈ నేపథ్యంలోనే షేర్ల ధరల్లో అవకతవకలు, ఖాతా పుస్తకాల్లో మోసాలపై సంయుక్త పార్లమెంటరీ సంఘం(Joint Parliamentary Committee)తో విచారణ జరిపించాలని కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మరి ఇంతకీ, సంయుక్త పార్లమెంటరీ సంఘం అంటే ఏంటి? గతంలో అదెలాంటి విచారణలు చేసిందో తెలుసుకోండి.
ఏమిటీ జేపీసీ?
ఏదైనా కుంభంకోణం గురించి లేదా ఒక నిర్దిష్టమైన బిల్లుకు సంబంధించిన సమాచారంపై విశ్లేషణ చేయడానికి జేపీసీ ఏర్పాటవుతుంది. అందుకు లోక్సభ, రాజ్యసభ రెండింటిలో ఏదైనా ఒక చోట సంయుక్త పార్లమెంటరీ సంఘం(జేపీసీ)పై తీర్మానం చేసి మరో సభ దాన్ని బలపరచాల్సి ఉంటుంది. ఇంకో విధానంలో.. లోక్సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్ ఇద్దరూ సంప్రదింపులు జరిపి ఏకాభిప్రాయంతో జేపీసీని ఏర్పాటు చేయవచ్చు. ఈ సంఘంలో లోక్సభ, రాజ్యసభ ఎంపీలు సభ్యులుగా ఉంటారు. ఎంపికైన లోక్సభ సభ్యుల సంఖ్యలో సగ భాగానికి సమానమైన సభ్యులను రాజ్యసభ నుంచి ఎన్నుకుంటారు. మొత్తం సభ్యుల సంఖ్య ఒక్కోసారి ఒక్కో విధంగా ఉంటుంది.
ఎలాంటి అధికారాలుంటాయి?
జేపీసీ ఏర్పాటైన తరువాత అందులోని సభ్యులు విచారణ చేస్తున్న అంశం గురించి సంబంధిత నిపుణులు, ప్రజా ప్రతినిధులు, సంఘాలు, వ్యక్తులు, పార్టీల నుంచి ఆధారాలను(evidence), సమాచారాన్ని సేకరిస్తారు. ఎవరైనా.. విచారణకు సహకరించకపోయినా, జేపీసీ ఎదుట హాజరు కాకపోయినా సభా ధిక్కారంగా పరిగణిస్తారు. పరిశీలనలో భాగంగా జేపీసీ మౌఖిక, రాత పూర్వక ఆధారాలను సేకరిస్తుంది. కుంభకోణానికి సంబంధించిన పత్రాలను కూడా పరిశీలిస్తుంది. ఈ విషయాలన్నీ గుట్టుగా జరుగుతాయి. ఒక వేళ సెక్యూరిటీస్, బ్యాంకు లావాదేవీల్లో అవకతవకలను విచారిస్తున్నట్లయితే ఆ విచారణకు సంబంధించిన విషయాలను నిరభ్యంతరంగా ప్రజలకు తెలియజేస్తుంది. జేపీసీ ఛైర్మన్ కమిటీ సాగించిన చర్చల వివరాలను మీడియాకు బహిర్గతం చేస్తారు.
జేపీసీ విచారణలో భాగంగా ఎవరినైనా తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించొచ్చు. మంత్రులను సహజంగా జేపీసీ పిలవదు. అయితే సెక్యూరిటీస్, బ్యాంకింగ్ లావాదేవీల అక్రమాలపై విచారణ సాగిస్తుంటే స్పీకర్ అనుమతి తీసుకొని మంత్రులనూ విచారించే అవకాశముంటుంది. జేపీసీ అడిగిన సమాచారాన్ని ఇచ్చేందుకు.. వివిధ కారణాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం (government) నిరాకరించవచ్చు. అటువంటి సమయంలో స్పీకర్ జోక్యం చేసుకుని ఆయన సమ్మతి తెలిపితే తప్పనిసరిగా సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు వివిధ కుంభకోణాలపై జేపీసీలు ఏర్పాటయ్యాయి. అవేంటంటే..
బోఫోర్స్ కుంభకోణం
1987లో తొలిసారి బోఫోర్స్ కుంభకోణంపై జేపీసీని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ నేత బి.శంకరానంద దానికి అధ్యక్షత వహించారు. నాటి రక్షణమంత్రి కేసీ పంత్ లోక్సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. వారం రోజుల తర్వాత రాజ్యసభ దాన్ని ఆమోదించింది. 50 సార్లు సమావేశమైన ఈ కమిటీ 1988 ఏప్రిల్ 26న తుది నివేదిక ఇచ్చింది. కాంగ్రెస్ సభ్యులు అధికంగా ఉన్నారని విమర్శిస్తూ ఈ కమిటీని అప్పటి విపక్షాలు వ్యతిరేకించాయి. పార్లమెంటు ముందుకు తీసుకొచ్చిన నివేదికను సైతం తిరస్కరించాయి.
హర్షద్ మెహతా కుంభకోణం
జేపీసీ రెండోసారి 1992లో ఏర్పాటైంది. కాంగ్రెస్ సీనియర్నేత, అప్పటి కేంద్రమంత్రి రామ్నివాస్ మ్రిధా దానికి అధ్యక్షత వహించారు. హర్షద్ మెహతా కుంభకోణంతో స్టాక్ మార్కెట్ తీవ్రంగా ప్రభావితమైన నేపథ్యంలో సెక్యూరిటీస్, బ్యాంకింగ్ లావాదేవీలపై విచారణ జరిగింది. నాటి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి గులాం నబీ ఆజాద్ లోక్సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. మరుసటి రోజు రాజ్యసభ దాన్ని ఆమోదించింది. ఈ విచారణ సంఘం సిఫారసులను ప్రభుత్వం పూర్తిగా ఆమోదించలేదు. అమలు కూడా చేయలేదు.
కేతన్ పరేఖ్ షేర్ మార్కెట్ కుంభకోణం
హర్షద్ మెహతా కుంభకోణం తరువాత కేతన్ పరేఖ్ షేర్ మార్కెట్ కుంభకోణంపై 2001లో జేపీసీని ఏర్పాటు చేశారు. నాటి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రమోద్ మహాజన్ లోక్సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. భాజపా సీనియర్ నేత, మాజీ లెఫ్ట్నెంట్ జనరల్ ప్రకాశ్ మణి త్రిపాఠి ఛైర్మన్గా ఎన్నికయ్యారు. 105సార్లు సమావేశమైన కమిటీ 2002 డిసెంబరు 19న నివేదిక ఇచ్చింది. స్టాక్ మార్కెట్ నిబంధనల్లో భారీగా మార్పులు తీసుకురావాల్సి ఉందని ఈ కమిటీ అభిప్రాయంపడింది. కానీ, అవన్నీ బుట్టదాఖలయ్యాయి.
శీతల పానియాల్లో పురుగుమందులు
శీతల పానీయాల్లో పురుగు మందుల అవశేషాలు ఉన్నాయని తెలియడంతో 2003లో జేపీసీ ఏర్పాటు చేశారు. ఎన్సీపీ అధినేత శరద్పవార్ దీనికి అధ్యక్షత వహించారు. పురుగుమందుల అవశేషాలు ఉండటం నిజమేనని ఈ కమిటీ నిర్ధారించింది. ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండటానికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్కు ప్రఖ్యాత శాస్త్రవేత్తలు అధ్యక్షత వహించాలని చెప్పింది. దీనిపై ఇప్పటిదాకా ఎలాంటి నిర్ణయం వెలువడలేదు.
2జీ స్పెక్ట్రం కుంభకోణం
2జీ కేసు విచారణ కోసం 2011 ఫిబ్రవరిలో జేపీసీ ఏర్పాటైంది. దీనికి పీసీ చాకో అధ్యక్షత వహించారు. మొత్తం 30 మంది సభ్యుల్లో 15 మంది భాజపా, జేడీయూ, సీపీఐ, సీపీఎం, తృణమూల్, బిజద, డీఎంకే, అన్నా డీఎంకే పార్టీల నుంచి ఉన్నారు. అధ్యక్షుడు పీసీ చాకో పక్షపాతంతో వ్యహరిస్తున్నారని ఈ కమిటీ సభ్యులు ఆరోపించారు. ఆయనను తొలగించాలని లోక్సభ స్పీకర్కు అవిశ్వాస పత్రం కూడా అందజేశారు. అంతేకాకుండా డ్రాఫ్ట్లో అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్, ఆర్థిక మంత్రి చిదంబరానికి క్లీన్ చిట్ ఇవ్వడాన్ని కూడా తప్పుపట్టారు. దాంతో దిగొచ్చిన పీసీ చాకో డ్రాఫ్ట్ సవరణకు అంగీకరించారు.
వీవీఐపీ ఛాపర్ స్కామ్
2013లో రాజ్యసభలో జేపీసీపై తీర్మానం ప్రవేశపెట్టారు. అగస్టా వెస్ట్లాండ్ నుంచి రక్షణశాఖ వీవీఐపీ హెలికాప్టర్లు పొందడానికి చేసిన లావాదేవీల్లో అవకతవకలు, లంచాలపై విచారణకు ఈ కమిటీని ఏర్పాటు చేశారు.
భూ సేకరణ బిల్లు
భూమికి తగ్గ పరిహారం, భూ సేకరణలో పారదర్శకత, పునరావాస బిల్లు 2015కు సంబంధించి ఎస్.ఎస్ అహ్లూవాలియా నేతృత్వంలో జేపీసీ ఏర్పాటు చేయాలని సూచించింది.
వ్యక్తిగత సమాచారం, గోప్యతా పరిరక్షణ బిల్లు
2019 డిసెంబరులో వ్యక్తిగత సమాచారం, గోప్యతా పరిరక్షణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టారు. భాజపా నేత మీనాక్షి లేఖి అధ్యక్షతన జేపీసీ పూర్తి విశ్లేషణ చేసి బడ్జెట్ సమావేశాలు ఉండటంతో 2020 మార్చి నాటికి ఆ బిల్లుపై డ్రాఫ్ట్ లాను అందజేసింది. 2022లో వ్యక్తిగత సమాచారం, గోప్యతా పరిరక్షణకు ప్రవేశపెట్టిన బిల్లును ఉపసంహరించుకొంటున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి. -
Royal family: వందల కార్లు.. రూ.4వేల కోట్ల ప్యాలెస్: ఈ రాజ కుటుంబం హవానే వేరయా..!
విలాసవంతమైన రాజ భవనాలు, ప్రముఖ సంస్థల్లో పెట్టుబడులు, లండన్, పారిస్లో ఆస్తులు.. యూఏఈ రాజ కుటుంబం(royal family of Dubai) సంపద ఎంతో తెలుసా..?
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం