ఏమిటీ రివెంజ్ ట్రావెల్? దీనిపై ఆందోళన దేనికి?
నాల్రోజులు సెలవులు దొరికితే ఏ కొత్త ప్రాంతానికి వెళ్లాలా ఆలోచిస్తుంటాం. పని ఒత్తిడి నుంచి ఉమశమనానికి ప్రయత్నిస్తుంటాం. అలాంటిది కరోనా పుణ్యమా అని ఇలాంటి ఆలోచనలకు కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు జనం
ఇంటర్నెట్ డెస్క్: నాలుగు రోజులు సెలవులు దొరికితే ఏ కొత్త ప్రాంతానికి వెళ్లాలా? ఆలోచిస్తుంటాం. పని ఒత్తిడి నుంచి ఉమశమనానికి ప్రయత్నిస్తుంటాం. అలాంటిది కరోనా పుణ్యమా అని ఇలాంటి ఆలోచనలకు కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు జనం. కొవిడ్ కారణంగా చాలా వరకు ఇంట్లోనే ఉండి పనిచేయాల్సిన స్థితి. భయంతో అడుగు బయట పెట్టలేని పరిస్థితి. దీంతో వారాల తరబడి జనం ఇంట్లో మగ్గారు. అలాంటి వాళ్లకు ఆంక్షల సడలింపు కొత్త రెక్కలనందించింది. దీంతో భౌతిక దూరానికి బైబై చెప్పి.. మాస్కులకు మంగళం పాడేసి గుంపులుగా చేరడం మొదలుపెట్టారు. ఈ తరహా పర్యటకాన్ని రివెంజ్ ట్రావెల్గా పేర్కొంటున్నారు. దీనిపై ప్రభుత్వం ఇప్పుడు ఆందోళన వ్యక్తంచేస్తోంది.
బంధనం నుంచి విముక్తి కోసం..
ఏ తుపానులో, వరదలో వచ్చేప్పుడు తప్ప.. ఇంట్లోంచి అడుగు బయట పెట్టని పరిస్థితులు అరుదు. అలాంటిది కొవిడ్ కారణంగా ప్రజల జీవన విధానం పూర్తిగా మారిపోయింది. ఆఫీసుల్లేక ఇంటికే పరిమితం కావడం.. లాక్డౌన్ ఆంక్షలతో ఇంట్లోనే మగ్గడం.. జనానికి లైఫ్ రొటీన్గా మారిపోయింది. ఇలాంటి సమయంలో కేసులు తగ్గుముఖం పట్టడంతో చాలా రాష్ట్రాలు ఆంక్షలు సడలించాయి. దీంతో ప్రజల్లో కొత్త ప్రదేశాలకు వెళ్లాలన్న తలంపు ఏర్పడింది. ఈ క్రమంలో కొత్త ప్రదేశాలకు వెళ్లడం, అక్కడ సేద తీరడం ఇటీవల కనిపిస్తోంది. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్లోని మనాలీ, సిమ్లా, ధర్మశాల; ఉత్తరాఖండ్లోని కెమ్టీ జలపాతం, హరిద్వార్లోని హర్ కీ పౌరీ ఘాట్ వంటి ప్రాంతాల్లో పర్యటకులతో కిక్కిరిస్తున్నాయి. దీనికి సంబంధించిన చిత్రాలు, వీడియోలు ఇటీవల వైరల్గా మారాయి.
ప్రభుత్వం ఆందోళన...
దేశంలో సెకండ్వేవ్ సృష్టించిన బీభత్సం అంతా ఇంతాకాదు. ఒకానొక దశలో నాలుగు లక్షల చొప్పున రోజువారీ కేసులు వచ్చేవి. ఇప్పటికీ దేశవ్యాప్తంగా 40వేల మంది వరకు మహమ్మారి బారిన పడుతున్నారు. పరిస్థితులు అదుపుతప్పితే మరో వేవ్ కారణమని కొవిడ్ టాస్క్ఫోర్స్ అధిపతి వీకే పాల్ వంటి వారు హెచ్చరిస్తున్నారు. ఈ రివెంజ్ ట్రావెల్పై కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ సైతం ఆందోళన వ్యక్తంచేశారు. కొవిడ్ పోరాడుతున్న వేళ ఇలాంటి పర్యటనలు ప్రమాదకరమని పేర్కొన్నారు. నిబంధనలు పాటించకుంటే ఆంక్షలను పునరుద్ధరించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Tunnel Rescue: రాణిగంజ్ నుంచి ఉత్తర్కాశీ దాకా.. చరిత్రలో నిలిచిన సాహసోపేత ఆపరేషన్లు!
భారత్లో రాణిగంజ్ బొగ్గుగని ప్రమాదం మొదలు, థాయ్లాండ్లో గుహలో చిన్నారులు చిక్కుకుపోవడం.. తాజాగా ఉత్తర్కాశీ సొరంగం ఆపరేషన్లు చరిత్రలో నిలిచిపోయాయి. -
Javier Milei: అర్జెంటీనా సమస్యలను తప్పించగలడా.. ఈ ‘పిచ్చాయన’!
అర్జెంటీనాలో ఇటీవలి అధ్యక్ష ఎన్నికల్లో మెజార్టీ సాధించిన జేవియర్ మిలి.. త్వరలోనే దేశ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్నారు. -
అలాంటి వలలో పడొద్దు.. ‘పిగ్ బుచరింగ్ స్కామ్స్’పై నితిన్ కామత్ టిప్స్..!
Nithin Kamath tips: పిగ్ బుచరింగ్ స్కామ్స్ దేశంలో పెరిగిపోయాయని జిరోదా సీఈఓ నితిన్ కామత్ అన్నారు. ఈ స్కామ్స్ బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. -
Israel: యుద్ధం వేళ.. మరణించిన సైనికుల ‘వీర్యం’ సేకరిస్తున్న కుటుంబీకులు!
యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికులు, సామాన్య యువకుల వీర్యాన్ని సేకరించేందుకు (Sperm Retrieval) బాధిత కుటుంబీకులు ప్రయత్నిస్తున్నారు. -
Madhyapradesh Elections: ‘గ్వాలియర్-చంబల్’ సంగ్రామంలో విజయం ఎవరిదో?
కీలక గ్వాలియర్-చంబల్ ప్రాంతంలో తమ సత్తా చాటేందుకు భాజపా, కాంగ్రెస్తోపాటు బీఎస్పీ కూడా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. ఎవరి విజయావకాశాలు ఎలా ఉన్నాయి? -
Mizoram Elections: ‘మిజో’ పోరులో విజేత ఎవరో?
మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖపోరు నెలకొంది. కాంగ్రెస్, ఎంఎన్పీ, జడ్పీఎమ్ మధ్య తీవ్ర పోటీ జరగనుంది. అయితే, ఎవరి విజయావకాశాలు ఎలా ఉన్నాయి? -
India map: భారత చిత్ర పటంలో శ్రీలంక ఎందుకుంటుంది?
Sri lanka: భారత చిత్రపటంలో శ్రీలంకను మీరు గమనించే ఉంటారు. ఇలా ఎందుకు చూపిస్తారో తెలుసా? -
Madhyapradesh Elections: కుటుంబాల మధ్య పోరులో విజయం ఎవరిదో?
మధ్యప్రదేశ్ ఎన్నికలు ఆసక్తికరంగా మారుతున్నాయి. పలుచోట్లు పార్టీల మధ్య పోటీ.. కుటుంబాల పోరుగా మారింది. -
Israel: ఇజ్రాయెల్.. ఈ చిన్న దేశం ఎంతో స్పెషల్!
కోటి మంది కూడా లేని ఒక దేశం ప్రపంచం మొత్తానికి అత్యాధునిక టెక్నాలజీని సరఫరా చేస్తోంది. ఈ చిన్న దేశంలో సాంస్కృతిక, చారిత్రక విశేషాలకు కొదవేలేదు. అవేంటో మీరే చదివేయండి.. -
Rajasthan Elections: భాజపా కంచుకోట ‘హాడౌతీ’.. ఈసారి ఎవరిదో?
రాజస్థాన్లోని హాడౌతీ ప్రాంతంపై భాజపా, కాంగ్రెస్ పార్టీలు కీలకంగా దృష్టి సారించాయి. ఈ ప్రాంతానికి ఎందుకంత ప్రాముఖ్యత? ఎవరి బలాలేంటి? -
Madhya Pradesh Elections: ద్విముఖ పోరులో సవాళ్లెన్నో..!
మధ్యప్రదేశ్లో ఎన్నికల వేడి రాజుకుంది. ఈ నేపథ్యంలో ప్రధాన పోటీదారులు కాంగ్రెస్, భాజపా ఎదుర్కోవాల్సిన ప్రధాన సమస్యలేంటి? -
Hezbollah: వీళ్ల దగ్గర లక్షకు పైగా రాకెట్లున్నాయి.. ఇజ్రాయెల్కు ‘హిజ్బుల్లా’ సవాల్!
ఇజ్రాయెల్కు హమాస్ కన్నా మరో పెద్ద సవాల్ ‘హిజ్బుల్లా’ రూపంలో పొంచివుంది. హిజ్బుల్లా వద్ద ప్రస్తుతం లక్షకు పైగా రాకెట్లు ఉన్నాయని ఇజ్రాయెల్ నిఘావర్గాల అంచనా. -
India-Pak War: 1965లో ‘పాక్ కమాండోలు’ ఆకాశం నుంచి ఊడిపడితే.. మనోళ్లు చితకబాదారు!
సైనిక బలగాలు, నిఘావ్యవస్థలు కలిగిన ఇజ్రాయెల్ హమాస్ మెరుపు దాడులతో ఉలిక్కిపడింది. అయితే ఇలాంటి దాడులు భారత్పై కూడా గతంలో జరిగాయి. -
Israel: ‘ఇనుప గుమ్మటం’లో పగుళ్లు.. ఎందుకిలా?
హమాస్ ఉగ్రవాదుల దాడులతో గాజా సరిహద్దులో ఉన్న ఇజ్రాయెల్ ప్రాంతం వణికిపోయింది. ఇజ్రాయెల్ ఎందుకు ఆత్మరక్షణలో పడిపోయిందన్న అంశాలను విశ్లేషిస్తే.. -
Hamas: ఇజ్రాయెల్పై రాకెట్ల వర్షం.. ఏంటీ ‘హమాస్’!
ఇజ్రాయెల్పై పాలస్తీనాకు చెందిన హమాస్ సంస్థ భారీ ఎత్తున దాడులు చేసింది. అసలు ఏంటీ ‘హమాస్’? -
Mohamed Muizzu: ముయిజ్జుతో జాగ్రత్త..
మాల్దీవుల ఎన్నికల్లో చైనా అనుకూలవాదిగా పేరొందిన మాజీ అధ్యక్షుడు యామిన్ సన్నిహితుడు మహ్మద్ ముయిజ్జు గెలుపొందారు. ఈ నేపథ్యంలో చైనా కదలికలు ఎలా ఉండబోతున్నాయి. -
Maldives : పర్యాటకుల మది దోచే మాల్దీవులు.. బుల్లి దేశం విశేషాలెన్నో!
హిందూ మహా సముద్రంలోని అతి చిన్న పర్యాటక దేశం మాల్దీవుల్లో (Maldives) ఎంతో వైవిధ్యం దాగుంది. ఆ దేశానికి సంబంధించిన వింతలు, విడ్డూరాల గురించి తెలుసుకోండి. -
Canada: నేను చేస్తే రైట్... నువ్వు చేస్తే రాంగ్..!
ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అడ్డుకుంటామని కెనడా తదితర దేశాలు చెబుతుంటాయి. అయితే, భారత్ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న ఖలిస్థాన్ ఉగ్రవాదులకు రెడ్కార్పెట్ వేసిన కెనడా వైఖరిని చూసి అంతర్జాతీయ సమాజం నివ్వెరపోతోంది. -
777 Movies in a year: ఏడాదిలో 777 సినిమాలు చూశాడు.. తర్వాత ఏమైందంటే?
అమెరికాకు చెందిన 32 ఏళ్ల వ్యక్తి ఒకే ఏడాదిలో 777 సినిమాలు చూశాడు. ఆ తర్వాత ఏమైందటే.. -
Glass Bridge: భారత్లోనే అతి పొడవైన గాజు వంతెన చూశారా?
Glass Bridge: కేరళలోని ఇడుక్కిలో గాజు వంతెన ప్రారంభమైంది. ఎత్తైన ప్రదేశం నుంచి ప్రకృతి సోయగాలను ఆస్వాదించేలా రూపొందించిన ఈ వంతెన ఆకట్టుకుంటోంది. -
Oppenheimer: అణుబాంబును సృష్టించి.. వినాశనానికి చలించి: ఓపెన్హైమర్ గురించి తెలుసా?
ఓ శాస్త్రవేత్త.. అణుబాంబు తయారుచేశాడు.. అది సృష్టించిన వినాశనాన్ని చూసి చలించిపోయాడు.. అణుశక్తి మానవ అభివృద్ధి కోసమేగానీ ప్రాణనష్టం కోసం కాదంటూ ప్రచారం చేశాడు. ఆయనే అణుబాంబు పితామహుడు జె.రాబర్ట్ ఓపెన్హైమర్ (Robert J Oppenheimer).