Bhindranwale: సాఫ్ట్గానే ఉండేవాడు.. మరీ అంత ఉగ్రంగా ఎలా మారాడు?
పంజాబ్లో ఇటీవల జరుగుతున్న పరిణామాలు కొన్ని దశాబ్దాల క్రితం జరిగిన ఘటనలను గుర్తు చేస్తున్నాయి. భింద్రన్వాలే నేతృత్వంలో వేర్పాటువాదులు అనేక సవాళ్లు విసిరారు.
ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం: 80ల్లో పంజాబ్.. అంతా భయంభయంగా ఉండేది.. ఎక్కడ బాంబు పేలుతుందో తెలియదు.. తుపాకుల బుల్లెట్లు ఎక్కడ నుంచి వస్తాయో అంతుబట్టదు.. లా అండ్ ఆర్డర్ ఉండేది కాదు.. మోటార్ సైకిళ్లపై యువత ఆయుధాలు చేతబట్టి విచ్చలవిడిగా తిరిగేవారు.. ఖలిస్థాన్ మద్దతుదారులు బాహటంగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేసేవారు.. వీరి ధైర్యానికి కారణం ఒక్కరే కావడం గమనార్హం... ఆయనే జర్నైల్ సింగ్ భింద్రన్వాలే (Jarnail Singh Bhindranwale). తొలినాళ్లలో సాఫ్ట్గా ఉన్న భింద్రన్ కరడుగట్టిన వేర్పాటువాదిగా మారడం గమనార్హం.
ఆధ్యాత్మిక సంస్థ నుంచి అడుగులు
1947లో మోగా జిల్లాలో ఆయన జన్మించారు. వ్యవసాయ కుటుంబం కావడంతో ఆరో తరగతిలోనే చదువు ముగించి పొలంబాట పట్టాడు. అనంతరం కొన్నాళ్లకు ఆధ్యాత్మిక విద్యాసంస్థలో చేర్పించారు. తరువాత మత పెద్దగా రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో పర్యటించారు. అప్పట్లో పంజాబ్లో నిరుద్యోగం ఎక్కువగా ఉండేది. దీంతో ఎక్కువమంది ఆయన ప్రసంగాలకు ప్రభావితమయ్యేవారు.
కాంగ్రెస్ అండతో..
రాష్ట్రంలో కాంగ్రెస్, అకాలీలు మాత్రమే ప్రధాన పక్షాలుగా ఉండేవి. అకాలీదళ్ పార్టీని నివారించేందుకు కాంగ్రెస్ భింద్రన్ను ప్రోత్సాహించింది. అందివచ్చిన అవకాశాలను అందుకొని తిరుగులేని నేతగా ఎదిగాడు. అయితే, తొలినాళ్లలో ఖలిస్థాన్ ఉద్యమానికి దన్నుగా నిలవలేదు. ఆనందపుర్ సాహిబ్ తీర్మానాన్ని అమలు చేయాలని మాత్రమే కోరేవాడు. పంజాబ్కు సంబంధించి పలు డిమాండ్లు ఈ తీర్మానంలో ఉన్నాయి.
అమృత్సర్ కేంద్రంగా..
ఈ క్రమంలో ఆయన అనుచరులకు మాజీ సైనికాధికారులైన సాహెబ్సింగ్ ... తదితరులు ఆయుధాల శిక్షణ ఇచ్చారు. ప్రభుత్వ నిఘా పెరగడంతో ఆయుధాలతో పాటు భింద్రన్వాలే స్వర్ణదేవాలయానికి చేరుకున్నాడు. స్వాతంత్య్రం వచ్చే నాటికి ఖలిస్థాన్ డిమాండ్ ఉన్నా అకాలీనేత మాస్టర్ తారాసింగ్, ఇతర సంస్థనాధీశులైన సర్దార్ బల్దేవ్సింగ్, రాజా హరిందర్ సింగ్, సర్దార్ హుకుంసింగ్లు భారత్ వైపే మొగ్గు చూపారు.
ఆపరేషన్ బ్లూస్టార్తో హతం
అమృత్సర్ స్వర్ణదేవాలయంలో వేర్పాటువాదులతో మకాం వేసిన భింద్రన్వాలేను జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ సారథ్యంలోని ప్రభుత్వం కోరింది. అయితే, ఈ వినతిని భింద్రన్ పట్టించుకోలేదు. చివరకు 1984 జూన్లో ఆపరేషన్ బ్లూస్టార్తో సైనికచర్య ప్రారంభించింది. ఏడు రోజుల పాటు సాగిన పోరులో భింద్రన్వాలే చనిపోవడంతో పోరు ముగిసింది. తరువాత కొద్ది కాలానికే ఇందిరాగాంధీని ఆమె అంగరక్షకులు కాల్చడంతో ప్రాణాలు కోల్పోయారు. పంజాబ్తో పాటు పలు ప్రాంతాల్లో ఉగ్రవాదం పెచ్చరిల్లింది. ఐపీఎస్ అధికారి గిల్ కఠిన చర్యలు తీసుకోవడంతో ఉగ్రవాదం రూపుమాసింది. అయితే స్వతంత్ర్య భారత చరిత్రలో ఈ వేర్పాటువాద ఘటనలు ఎందరో అమాయకుల ప్రాణాలను తీసుకున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు