Nityananda: కైలాస దేశ ‘ప్రధాని’.. వివాదాల స్వామీజీ!
భారత దేశాన్ని విడిచి పారిపోయిన వివాదాస్పద, స్వయం ప్రకటిత ఆధ్యాత్మిక గురువు నిత్యానంద తన కోసం ప్రత్యేకంగా ఓ దేశాన్నే సృష్టించుకున్నారు.
(Image : Srinithyananda insta)
వివాదాస్పద స్వామిజీ నిత్యానంద మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన స్థాపించిన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస(USK) ప్రతినిధులు జెనీవాలో నిర్వహించిన ఐరాస సమావేశాల్లో పాల్గొన్నారు. నిత్యానంద(Nithyananda)ను భారత్ వేధిస్తోందని, అందుకే రక్షణ కల్పించాలని మహిళా ప్రతినిధి విజయప్రియ నిత్యానంద డిమాండ్ చేశారు. జెనీవాలో వివిధ దేశాల ప్రతినిధులను కలిసి కైలాస రాజ్యాంగ పీఠికను అందజేశారు. దానిని ‘ద భగవద్గీత’గా పేర్కొంటూ పంపిణీ చేశారు. అసలు నిత్యానంద ఎవరు? ఓ దేశాన్ని స్థాపించినట్లు ఎందుకు ప్రకటించుకున్నారు..?
నిత్యానంద ఎవరు?.
నిత్యానంద అసలు పేరు అరుణాచలం రాజశేఖరన్. తమిళనాడు(Tamil Nadu) రాష్ట్రంలోని తిరువణ్ణామలైలో జన్మించారు. సన్యాస సంచారం చేస్తున్న సమయంలో మహావతార్ బాబాజీ తనకు నిత్యానందగా నామకరణం చేసినట్లు ఆయనే చెప్పారు. తొలిసారి 2003లో బెంగళూరు(Bangalore) సమీపంలోని బిదాడి వద్ద నిత్యానంద ధ్యానపీఠం నెలకొల్పారు. తనకు 12వ ఏటనే జ్ఞానోదయం(enlightenment) అయినట్లు భక్తులకు ఉపదేశించారు. ధ్యానపీఠంలో ప్రవచనాలు చెబుతూ నిత్యానంద బాగా పేరు సంపాదించారు. విదేశీయులు కూడా ఆయనకు భక్తులుగా మారారు. దీంతో ఫ్లోరిడాలోని హిందూ యూనివర్సిటీ ఆఫ్ అమెరికాకు నిత్యానంద ఛైర్మన్గా ఉన్నారు. బ్రహ్మసూత్ర, పతంజలి, యోగసూత్ర, శివసూత్ర వంటి వాటిపై ఆయన ఉపన్యాసాలు ఇచ్చేవారు. నిత్యానంద ధ్యానపీఠం ధార్మిక కార్యక్రమాలు దాదాపు 47 దేశాల్లో ప్రాచుర్యం పొందాయి.
(Image : Srinithyananda insta)
‘ఆ’ వీడియోతో మొదలైన వివాదం
ఆధ్యాత్మిక గురువుగా సాగిపోతున్న నిత్యానంద 2010లో లైంగిక వీడియో(video) వివాదంలో చిక్కుకున్నారు. ఓ నటితో కలిసి రాసలీలలు సాగిస్తున్నట్లుగా అందులో ఉంది. స్థానిక తమిళ ఛానళ్లతోపాటు, ఇంటర్నెట్లోనూ ఆ దృశ్యాలు అప్పట్లో వైరల్గా మారాయి. అయితే దానిపై స్పందించిన నిత్యానంద అందులో తాము శవాసనం సాధన చేస్తున్నామని తనను తాను రక్షించుకునే ప్రయత్నం చేశారు. అప్పట్లో ఈ కేసు ఓ సంచలనంగా మారింది. తరువాత కొన్ని రోజులకు ఈ కేసులో బెయిల్ పొందారు. మరోసారి 2019లో ఆయనపై అహ్మదాబాద్లో కేసు నమోదైంది. మైనర్ బాలికలను ఆశ్రమంలో నిర్బంధించి వేధిస్తున్నారని కొందరు ఫిర్యాదు చేశారు. ఇక ఈ కేసులో ఇరుక్కుంటే తన మనుగడ కష్టమని భావించిన నిత్యానంద దేశం విడిచి పారిపోయారు.
కైలాస దేశం.. ఆయనే ప్రధాని
భారత్ను వీడిన తరువాత నిత్యానంద ఎక్కడున్నారో ఎవరికీ తెలియరాలేదు. అనూహ్యంగా కొద్దిరోజులకు దక్షిణ అమెరికాలోని ఈక్వెడార్ ఐలాండ్లో నిత్యానంద ‘రిపబ్లిక్ ఆఫ్ కైలాస’ను స్థాపించి సంచలనం సృష్టించారు. ప్రపంచంలోనే అతిగొప్ప, స్వచ్ఛమైన హిందూ దేశంగా దాన్ని ప్రకటించుకున్నారు. ఈ కైలాస ఏర్పడిన తొలినాళ్లలో గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్కు చెందిన కొందరు ప్రముఖులు తమ వ్యాపారాలను త్యజించి ఈ దీవికి వెళ్లాలనుకుంటున్నారని వార్తలు వినిపించాయి. నిత్యానంద శిష్యుల్లో చాలా మంది ధనికులున్నారు. వారే ఆయనకు ఈ దీవిని కొనుగోలు చేసి ఇచ్చారని చెబుతుంటారు. ‘రిపబ్లిక్ ఆఫ్ కైలాస’లో అడుగుపెట్టాలంటే దానికి అక్కడి ‘ప్రధాన మంత్రి(నిత్యానంద)’, ‘కేబినెట్’ అనుమతి పొందాల్సి ఉంటుంది. నిత్యానంద భక్తులై ఉండి ఆయనకు విరాళాలు ఇచ్చిన వారికి మాత్రమే ఇక్కడ ప్రవేశం కల్పిస్తారు. నిత్యానంద ప్రకటించుకున్న దేశంలో పలు మంత్రిత్వశాఖలు కూడా ఉన్నాయి. అందులో ‘జ్ఞానోదయ నాగరికత విభాగం’ కూడా ఒకటి. సనాతన హిందూ ధర్మాన్ని పునరుద్ధరించాలనే లక్ష్యంతో దాన్ని ఏర్పాటు చేశారు. ఇక కైలాస పర్వతానికి దేశం తరహాలోనే ప్రత్యేక జెండా ఉంది. దాన్ని ‘రిషభధ్వజ’గా పిలుస్తున్నారు. జాతీయ జంతువుగా నంది, పక్షిగా ‘శరభం’, పుష్పంగా కమలం, చెట్టుగా మర్రిని ఎంపిక చేశారు. ఇంగ్లిష్, సంస్కృతం, తమిళంను అధికారిక భాషలుగా ప్రకటించారు.
నిత్యానంద తన హిందూ రిజర్వ్బ్యాంకుకు వచ్చిన విరాళాలను క్రిప్టో కరెన్సీగా మారుస్తున్నట్లు ఆయన వెబ్సైట్(Kailaasa.org)గతంలో పేర్కొంది. 2018లోనే పనామాలో ఈ వెబ్సైట్ను రూపొందించినట్లు సైబర్ నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలోని ఎవరైనా సరే స్వేచ్ఛగా హిందూ మతాన్ని ఆచరించడానికి అడ్డంకులు ఎదుర్కొంటూ ఉంటే ఈ కైలాసానికి రావొచ్చని పిలుపునిస్తున్నారు. భారత్ నుంచి పారిపోయినప్పటి నుంచి నిత్యానంద రోజువారీ ఉపన్యాసాలు ఇన్స్టా, యూట్యూబ్లలో ప్రసారం అవుతున్నాయి.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా