Project Cheetah : అగమ్యగోచరంగా ‘ప్రాజెక్టు చీతా’.. కలవరపెడుతున్న మరణాలు!
‘ప్రాజెక్టు చీతా’ (Project Cheetah) ద్వారా భారత (India) గడ్డపై అడుగుపెట్టిన చీతాలు వరుసగా మృత్యువాత పడుతున్నాయి. తాజాగా మూడు కూనలు సైతం చనిపోవడంతో ఈ నేలపై వాటి సంతతి అభివృద్ధి చెందడం సాధ్యమేనా అనే అనుమానాలు మొదలయ్యాయి.
గతేడాది సెప్టెంబరు 17న నమీబియా (Namibia) నుంచి తీసుకొచ్చిన ‘జ్వాల’ అనే చీతాను మధ్యప్రదేశ్లోని (Madhya Pradesh) కునో నేషనల్ పార్క్లో వదిలిపెట్టారు. అది నాలుగు కూనలకు జన్మనిచ్చింది. అందులో మూడు ఇక్కడి వాతావరణ పరిస్థితులకు తట్టుకోలేక మరణించాయి. అవన్నీ సాధారణ మరణాలేనని అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ దేశంలో చీతా (Cheetah) కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి 11 మంది సభ్యులతో అత్యున్నతస్థాయి స్టీరింగ్ కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కమిటీకి ‘గ్లోబల్ టైగర్ ఫోరమ్’ సెక్రటరీ జనరల్ రాజేశ్ గోపాల్ నేతృత్వం వహించనున్నారు.
ఏమిటీ ‘ప్రాజెక్టు చీతా’?
‘ప్రాజెక్టు చీతా’ ద్వారా 74 ఏళ్ల తర్వాత దేశంలోకి మళ్లీ చీతాలు ప్రవేశించాయి. 1948లో అప్పటి ఉమ్మడి మధ్యప్రదేశ్ ప్రస్తుత ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కొరియా జిల్లాలో చివరి చీతా చనిపోయిన తర్వాత దేశంలో వీటి ఆనవాళ్లు కనుమరుగయ్యాయి. అందుకే వీటిని అంతరించిన జాతిగా 1952లో ప్రభుత్వం ప్రకటించింది. అందుకే భారత్ చేపట్టిన ‘ప్రాజెక్టు చీతా’ అత్యంత ప్రతిష్ఠాత్మకమైనది. నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి ఇక్కడకు ప్రత్యేక విమానంలో వాటిని తీసుకొచ్చి వదిలారు. రాబోయే సంవత్సరాల్లో మరిన్ని చీతాలను రప్పించాలని ప్రణాళిక రచించారు.
పులులు, సింహాలు సంచరిస్తున్న స్థాయిలో చీతాలు కూడా వాటి సంతతితో స్వేచ్ఛగా తిరుగాడాలనేది ‘ప్రాజెక్టు చీతా’ ప్రధాన ఉద్దేశం. కునోలో ప్రస్తుతం 17 చీతాలున్నాయి. అందులో ఆరింటిని మాత్రమే బయటకు విడిచిపెట్టారు. మిగిలిన వాటిని ప్రత్యేకంగా తయారు చేసిన ఎన్క్లోజర్లలో ఉంచారు. భారత వాతావరణ పరిస్థితులకు అలవాటు పడే వరకు వాటిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఈ ఏడాది చివరికల్లా మొత్తం చీతాలను బహిరంగ ప్రదేశాల్లోకి విడిచిపెట్టాలని ప్రణాళిక రచించారు. అన్ని చీతాల కదలికలు ఎప్పటికప్పుడు తెలుసుకునేలా వాటికి రేడియో-కాలర్స్ను అమర్చారు. ఇంతలోనే వరుసగా చీతాల మరణాలు సంభవిస్తున్నాయి.
కూనలు ఎలా చనిపోయాయి?
ఈ నెల 23న అధికారులు కూనలను ట్రాక్ చేయగా అందులో ఒకటి ఒంటరిగా ఉన్నట్లు గుర్తించారు. అది తల్లి వద్దకు చేరుకునే స్థితిలో కూడా లేదని గమనించి పశు వైద్యులతో చికిత్స చేయించేందుకు యత్నించారు. ఇంతలోనే అది మృత్యువాత పడింది. మిగిలిన మూడు చిరుతల పరిస్థితిని సమీక్షించగా అవి అనారోగ్యం బారిన పడినట్లు తేలింది. రెండు కూనలు బలహీనంగా ఉండటంతోపాటు, బరువు తక్కువగా ఉన్నాయి. రోజుల వ్యవధిలోనే అవి కూడా చనిపోయాయి. ‘అధిక వేడి, పోషకాహార లోపం కారణంగానే అవన్నీ చనిపోయినట్లు’ పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. మిగిలిన ఒక్క కూన బలహీనంగా ఉన్నప్పటికీ క్రమంగా కోలుకుంటోంది. దాన్ని ఒక నెల పాటు ప్రత్యేక ప్రదేశంలో పెంచి.. తరువాత తల్లి దగ్గర వదిలి పెట్టాలనే ఆలోచనలో అధికారులున్నారు.
మరణాల శాతం ఎక్కువే
భారత్లో జన్మించిన నాలుగు చీతా కూనల్లో మూడు ఇప్పటి వరకు మరణించాయి. ఇక పెద్ద వాటిలోనూ మూడు చీతాలు మరణించాయి. ఈ నెల ప్రారంభంలో మగ చీతాలతో జరిగిన సంఘర్షణలో ఆడ చీతా ‘దక్ష’ తీవ్రంగా గాయపడి మరణించింది. అంతకుముందు శాషా, ఉదయ్ అనే చీతాలు మూత్రపిండ, హృదయ సంబంధ వ్యాధులతో మరణించాయి. అడవిలో సంచరించే పులులు, సింహాలతో పోలిస్తే చీతా పిల్లల మరణాల శాతం ఎక్కువగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. చీతాల మరణాలు.. అధికంగా వేటాడటం, తల్లి విడిచిపెట్టడం వల్ల జరుగుతాయని గతంలో నిర్వహించిన ఓ సర్వే తేల్చింది. ప్రస్తుతం భారత్లో ఉన్న చాలా చీతాలు ఎన్క్లోజర్లలోనే ఉన్నందున ఆ ప్రమాదం ఉండదని భావిస్తున్నారు. ఇక నమీబియా చీతా తొలిసారి కూనలకు జన్మనిచ్చిందని, దానికి పిల్లలను పెంచడంలో అనుభవం లేకపోవడం వల్ల కూడా మరణాలు సంభవించి ఉంటాయని అనుమానిస్తున్నారు.
అధికారుల నిర్ణయంపై విమర్శలు
గతేడాది సెప్టెంబరులో 8 చీతాలను నమీబియా నుంచి భారత్కు తీసుకొచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో 12 చీతాలను దక్షిణాఫ్రికా నుంచి రప్పించారు. ఏడాది కల్లా వాటిలో సగం జీవించి ఉన్నా ఈ ‘ప్రాజెక్టు చీతా’ విజయవంతమైనట్లేనని అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టులో చాలా లోపాలున్నాయని విమర్శకులు ఎత్తి చూపుతున్నారు. అందులో ఒకటి కునోలోనే 20 చీతాలను ఉంచడం. అక్కడున్న కొద్దిపాటి ప్రదేశం చీతాలు స్వేచ్ఛగా సంచరించడానికి అనుకూలంగా లేదని చెబుతున్నారు. పైగా ఆహార కొరత కూడా ఉంటుందని విమర్శిస్తున్నారు. కొన్ని జంతువులను రాజస్థాన్లోని ముకుందర రిజర్వ్కు తరలించాలని సలహా ఇస్తున్నారు. అయితే ఈ సలహాలను నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అధికారులు తోసిపుచ్చుతున్నారు. కునో సామర్థ్యం ఎక్కువేనని, భవిష్యత్తులో రాబోయే చీతాలను మాత్రమే వేరొక చోటుకి తరలిస్తామని చెబుతున్నారు.
- ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.