Phone apps : యాప్లు మొరాయిస్తున్నాయా.. ఇలా చేసి చూడండి!
ఆండ్రాయిడ్ ఫోన్లలో (Android phone) కొన్ని యాప్లు (apps) సరిగా పనిచేయడం లేదనే ఫిర్యాదులు ఇటీవలి కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఆ సమస్యను సొంతంగా ఎలా పరిష్కరించుకోవాలో తెలుసుకోండి.
సాంకేతిక పరిజ్ఞానం (Technology) పెరిగే కొద్దీ వేలాది యాప్లు (apps)ప్లే స్టోర్లలో (Play store) ప్రత్యక్షమవుతున్నాయి. విద్య, ఆరోగ్యం, వార్తలు, వినోదం ఇలా ప్రతి అంశానికి సంబంధించిన యాప్ల వాడకంతో ఫోన్లు నిండిపోతున్నాయి. అయితే అందులో కొన్ని ఉన్నట్టుండి మొరాయిస్తుంటాయి. లాగిన్ (Login) కాకపోవడం, మధ్యలోనే క్విట్ కావడం, చెక్ యువర్ ఇంటర్నెట్ (Internet) కనెక్షన్ వంటి సందేశాలు చూపిస్తూ సతాయిస్తాయి. అలాంటి సందర్భాల్లో ఏం చేయాలో తెలుసుకోండి.
యాప్లు ఎందుకు పని చేయవు?
మొబైల్ యాప్లు పని చేయకపోవడానికి అనేక కారణాలుంటాయి. సమయానుకూలంగా అప్డేట్ చేయకపోవడం సమస్యకు ఓ ప్రధాన కారణం. కొత్త ఫీచర్లు తెచ్చిన సందర్భంలో యాప్ డెవలపర్లు అప్డేట్ ఇస్తుంటారు. యూజర్లు గుర్తించిన సాంకేతిక సమస్యలను పరిష్కరించడానికి, భద్రతా ప్రమాణాలు మెరుగు పరచడానికి సైతం అప్డేట్స్ తప్పనిసరి. అలా చేసిన సందర్భంలో పాత వెర్షన్ యాప్లు ఫోన్లో సరిగా పనిచేయవు.
మరిన్ని కారణాలు ఏమిటంటే..!
- సరైన సమయంలో అప్డేట్ చేయకపోవడం
- ఫోన్లో స్టోరేజీ తక్కువగా ఉండటం.
- కరప్టడ్ క్యాచీ, యాప్ డేటా
- యాప్లోని బగ్స్, గ్లిచెస్
- తాత్కాలిక ఎర్రర్స్
- అవుట్డేటెడ్ యాప్ లేదా ఫోన్ సాఫ్ట్వేర్
ఎలా సరిదిద్దుకోవాలి
యాప్ పని చేయలేదని తెలియగానే చిరాకు పడి కొంతమంది ప్లేస్టోర్లో రివ్యూలు రాసేస్తుంటారు. అంతకుముందే ఈ టిప్స్ ఒక్కొక్కటిగా ప్రయత్నించి చూస్తే ఉపయోగం ఉంటుంది.
1. ఫోన్ రీబూట్
ఏ సాంకేతిక పరికరం పని చేయకపోయినా అందరూ చేసే మొదటి పని రీబూట్. ఫోన్ యాప్ పని చేయని పక్షంలోనూ ఈ టెక్నిక్ బాగా ఉపయోగపడుతుంది. పవర్ బటన్ను కొన్ని సెకన్లపాటు నొక్కితే ఆఫ్ ఆప్షన్తోపాటు రీబూట్ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఎంచుకుంటే ఫోన్ ఆఫ్ అయ్యి ఓ 20 సెక్లన్లలోపు మళ్లీ ఆన్ అవుతుంది. ఈ సమయంలో మొబైల్ తనకు తానుగా కొన్ని ప్రాథమిక రిపేర్లు చేసుకుంటుంది. అందులో యాప్ల తాలుకా సమస్య ఉన్నా పరిష్కారమవుతుంది.
2. యాప్ అప్ డేట్
బ్యాంకులకు సంబంధించిన యాప్లు భద్రతా కారణాల రీత్యా తరచూ అప్ డేట్ చేస్తుంటారు. ఇలాంటి వాటిని మనం కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్లేస్టోర్లోకి వెళ్లి ఆ యాప్ పేరుతో సెర్చ్ చేస్తే యాప్ సమాచారం ప్రత్యక్షమవుతుంది. ‘అప్డేట్’ ఆప్షన్ చూపిస్తుంటే దానిపై క్లిక్ చేయాలి. అన్ని యాప్లు అప్డేట్ కావాలంటే ‘అప్డేట్ ఆల్’పై క్లిక్ చేయాలి. అయితే ఆ పని చేసే ముందు సరిపడే డేటా మీ వద్ద ఉందో లేదో చెక్ చేసుకొని నిర్ణయం తీసుకోవాలి.
3. ఆండ్రాయిడ్ సిస్టమ్ వెబ్ వ్యూ యాప్
2021 మార్చిలో గూగుల్, ఇతర యాప్లు పనిచేయడం లేదని చాలా మంది ఆండ్రాయిడ్ యూజర్లు ఫిర్యాదు చేశారు. సమస్య ఏంటని ఆరా తీస్తే క్రోమ్, ఆండ్రాయిడ్ సిస్టమ్ వెబ్ వ్యూ యాప్లోని అప్డేట్ కారణమని తేలింది. యాప్లు సరిగా పని చేయని సందర్భంలో ‘ఆండ్రాయిడ్ సిస్టమ్ వెబ్ వ్యూ’ యాప్ను చెక్ చేయాలి. ప్లే స్టోర్లోకి వెళ్లి ఈ పేరుతో సెర్చ్ చేస్తే ఆ యాప్ కనిపిస్తుంది. అక్కడ ‘అప్డేట్’ ఆప్షన్ కనిపిస్తే దానిపై నొక్కి తాజా వెర్షన్ను ఇన్స్టాల్ చేసుకోవాలి. అనంతరం మరోసారి ఫోన్ రీస్టార్ట్ చేసి చూడాలి. ఇప్పుడు కూడా మనకు కావాల్సిన యాప్ పనిచేయనట్లయితే ఆండ్రాయిడ్ సిస్టమ్ వెబ్ వ్యూ యాప్ను రోల్ బ్యాక్ చేయాలి.
ఈ యాప్ను రోల్ బ్యాక్ చేసేందుకు ‘సెట్టింగ్స్’లోని ‘యాప్స్ & నోటిఫికేషన్స్’ ఆప్షన్ను ఎంచుకోవాలి. అందులోని ‘ఆండ్రాయిడ్ సిస్టమ్ వెబ్ వ్యూ’ యాప్పై క్లిక్ చేస్తే ఆ యాప్నకు సంబంధించిన సమాచారం కన్పిస్తుంది. ‘అన్ ఇన్స్టాల్ అప్డేట్స్’ ఆప్షన్పై క్లిక్ చేస్తే మళ్లీ పాత వెర్షన్ వస్తుంది. ఇప్పుడు మరోసారి ఫోన్ను రీస్టార్ట్ చేయాల్సి ఉంటుంది.
4. చెక్ అండ్ ఇన్స్టాల్ ఆండ్రాయిడ్ అప్డేట్స్
ఫోన్కు సంబంధించిన అప్డేట్స్ గురించి ‘సిస్టమ్ అప్డేట్స్ అవైలబుల్’ అనే నోటిఫికేషన్లు కొన్నిసార్లు మన ఫోన్లో కన్పిస్తుంటాయి. పనిలో పడి వాటిని పట్టించుకోము. అయితే ఈ అప్డేట్స్ డివైజ్లో ఏర్పడే బగ్స్, గ్లిచెస్ను సరిదిద్దడానికి కూడా ఉపయోగపడుతాయి. దాంతో యాప్లు ఈజీగా పని చేయడానికి అవకాశం ఉంటుంది. ఆండ్రాయిడ్ ఫోన్ను అప్డేట్ చేసుకోవడానికి ‘సెట్టింగ్స్’లోకి వెళ్లాలి. సిస్టమ్➡సిస్టమ్ అప్డేట్స్➡ ఆన్లైన్ అప్డేట్స్లో సాఫ్ట్వేర్ అప్డేట్ కనిపిస్తే చేసుకోవాలి. లేని పక్షంలో ఇదే లేటెస్ట్ వెర్షన్ అని అక్కడ చూపిస్తుంది.
5. క్లియర్ ది క్యాచీ డేటా
కొన్నిసార్లు యాప్లో పోగుపడిన క్యాచీ దాన్ని పనిచేయకుండా చేస్తుంది. తొలగించేందుకు యాప్పై నొక్కి పట్టుకుంటే ‘యాప్ ఇన్ ఫో’ కన్పిస్తుంది. అందులోకి వెళితే యాప్ సమాచారం మొత్తం కన్పిస్తుంది. ‘ఫోర్స్ స్టాప్’ ఆప్షన్పై క్లిక్ చేయాలి. అందులో ‘స్టోరేజ్ యూసేజ్’లోకి వెళ్లి ‘క్లియర్ క్యాచీ’పై క్లిక్ చేయాలి. తరువాత యాప్ను అన్ ఇన్స్టాల్ చేసి మరోసారి ఇన్స్టాల్ చేసుకోవాలి. తరువాత ఫోన్ రీబూట్ చేసి యాప్ సరిగా పని చేస్తుందో లేదో చెక్ చేసుకోవాలి.
6. రీసెట్ యువర్ డివైజ్
పైన చెప్పిన చిట్కాలేవీ ఫలించని పక్షంలో ఫోన్ మొత్తాన్ని రీసెట్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే ఫోన్లోని డేటా మొత్తం తొలగిపోతుంది. అందుకే ముఖ్యమైన సమాచారం మొత్తాన్ని ఒక పెన్డ్రైవ్ లేదా సిస్టమ్లోకి బ్యాకప్ చేసుకోవాలి. తరువాత ‘సెట్టింగ్స్’లోకి వెళ్లి ‘రీసెట్ టు ఫ్యాక్టరీ సెట్టింగ్స్’పై క్లిక్ చేయాలి. అక్కడ ‘ఎరేజ్ అల్ డేటా’ ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయగానే ఫోన్లోని సమాచారం మొత్తం తొలగిపోతుంది. తరువాత అవసరమైన యాప్లను మళ్లీ ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
-
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!