ఎడిసన్ వల్ల సినీ పరిశ్రమ పారిపోయింది
హాలీవుడ్ చిత్రాలకు ఉండే క్రేజ్ వేరు. అమెరికాలో చిత్రీకరించినా.. ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంటాయి. ఈ అమెరికా సినీపరిశ్రమ మొత్తం కాలిఫొర్నియా రాష్ట్రంలోని లాస్ ఏంజిల్స్ కేంద్రంగా నడుస్తోంది. ఇక్కడే అనేక సినీ స్టూడియోలున్నాయి. ఇక్కడే సినీ పరిశ్రమకు
హాలీవుడ్ చిత్రాలకు ఉండే క్రేజ్ వేరు. అమెరికాలో చిత్రీకరించినా.. ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంటాయి. ఈ అమెరికా సినీపరిశ్రమ మొత్తం కాలిఫోర్నియా రాష్ట్రంలో లాస్ ఏంజిల్స్లోని హాలీవుడ్ కేంద్రంగా నడుస్తోంది. ఇక్కడే అనేక సినీ స్టూడియోలున్నాయి. ఇక్కడే సినీ పరిశ్రమకు చెందిన వారంతా ఉంటున్నారు. కానీ ఒకప్పుడు అమెరికా సినీ పరిశ్రమ యూఎస్లోనే న్యూయార్క్, న్యూజెర్సీ రాష్ట్రాల్లో ఉండేది. అయితే బల్బు కనిపెట్టిన థామస్ అల్వా ఎడిసన్ పెట్టే బాధలు భరించలేక లాస్ ఏంజిల్స్లోని హాలీవుడ్కి మారిందట. ఆయనేం చేశారు అంటారా? అయితే ఇది చదవండి..
థామస్ అల్వా ఎడిసన్.. బల్బు కనిపెట్టడమే కాదు వెయ్యికిపై కొత్త ఆవిష్కరణలు చేసి పేటెంట్ హక్కులు సంపాదించారు. అందులో ఎక్కువగా సినిమా చిత్రీకరణకు సంబంధించిన ఎన్నో పరికరాలు ఉన్నాయి. టాకింగ్ మోషన్ పిక్చర్ తీసే కెనెటోస్కోప్ మొదలు థియేటర్లో తెరపై సినిమా వేసే ప్రొజెక్టర్ వరకు అనేక వాటిలో ఆయన కనిపెట్టిన పరికరాలకు పేటెంట్ హక్కులున్నాయి. దీంతో 20వ శతాబ్దం ప్రారంభంలో ఎవరైనా సినిమా తీయాలంటే ఎడిసన్ అనుమతి తీసుకొని, ఆయనకు ఫీజు చెల్లించాల్సి ఉండేది. ఎవరైనా తన పేటెంట్ పరికరాలను అనుమతి లేకుండా వాడితే వారిపై దావా వేసేవారు. ఈ క్రమంలో ఎడిసన్ పలు ఫిల్మ్ స్టూడియోలు, నిర్మాణ సంస్థలతో 1908లో ‘మోషన్ పిక్చర్ పెటెంట్స్ కంపెనీ(ఎంపీపీసీ)’ని స్థాపించారు. ఈ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు షూటింగ్స్ జరిగే ప్రాంతాలకు వెళ్లి వారు ఎలాంటి పరికరాలను ఉపయోగిస్తున్నారో గమనించేవారు. పొరపాటున ఈ కంపెనీ భాగస్వాములు కాకుండా మరెవరైనా ఎడిసన్ కనిపెట్టిన పరికరాలతో అనుమతి లేకుండా సినిమా తీస్తే వారిపై ఈ ఎంపీపీసీ దావా వేయడం.. చిత్రీకరణను నిలిపివేయడం చేసేది.
అయితే స్వతంత్రంగా సినిమాలు చేయాలనుకునే వారికి ఇది పెద్ద సమస్యగా మారిపోయింది. వీరితో పాటు మరికొన్ని మోషన్ పిక్చర్ కంపెనీలు కూడా ఎడిసన్ కంపెనీ వేసే దావాలతో విసిగిపోయాయి. దీంతో 1910 తర్వాత సినీ పరిశ్రమ న్యూజెర్సీ నుంచి లాస్ ఏంజిల్స్లోని హాలీవుడ్కు మారడం మొదలైంది. న్యూజెర్సీ కేంద్రంగా నడిచే ఎడిసన్ కంపెనీ.. 4వేలకుపైగా కి.మీ దూరంలో ఉన్న లాస్ ఏంజిల్స్లో దావా వేసే అవకాశాలు చాలా తక్కువ. ఒకవేళ వేసినా దావా కేసు విచారణకు చాలా సమయం పడుతుంది. పైగా కాలిఫోర్నియా కోర్టులు ఈ దావాలను విచారించడానికి విముఖత చూపుతాయి. ఈ కారణాల వల్ల అమెరికా సినీ పరిశ్రమ మొత్తం హాలీవుడ్కి వచ్చేసింది.
బయోగ్రాఫ్ అనే మోషన్ పిక్చర్ కంపెనీ 1910లో ఓ బృందాన్ని లాస్ఏంజిల్స్కి పంపి చిత్రీకరణకు అనుకూల పరిస్థితులు ఉన్నాయో లేవో పరీక్షించింది. డైరెక్టర్ డీ.డబ్ల్యూ గ్రిఫిత్ ‘ఇన్ ఓల్డ్ కాలిఫోర్నియా’ పేరుతో ఓ చిత్రాన్ని లాస్ ఏంజిల్స్, హాలీవుడ్ ప్రాంతాల్లో చిత్రీకరించాడు. విజయవంతంగా చిత్రం పూర్తి కావడంతో 1911లో నెస్టర్ స్టూడియో హాలీవుడ్లో తొలి స్టూడియోని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత అనేక చిత్ర నిర్మాణ సంస్థలు ఎడిసన్ పెటెంట్ ఫీజులు తప్పించుకునేందుకు హాలీవుడ్కు వలస వచ్చేశాయి. అయితే 1913లో ఎడిసన్ పేటెంట్లకు కాలం చెల్లింది. 1915 అక్టోబర్ 1న ఫెడరల్ కోర్టు ఎంపీపీసీ ఈ చట్టాలను దుర్వినియోగం చేసిందని పేర్కొంది. దీనికి సవాల్ చేస్తూ ఎంపీపీసీ అప్పిలియేట్ కోర్టుకు వెళ్లగా.. అక్కడ చుక్కెదురు కావడంతో 1918లో ఎంపీపీసీ మూతపడింది.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శునకంతో పోల్చుతూ ట్రోల్ చేశారు.. భావోద్వేగానికి గురైన హీరో
తనపై వచ్చిన ట్రోల్స్ చూసి ఎంతో బాధపడినట్లు బాలీవుడ్ హీరో ఆయుష్ శర్మ చెప్పారు. -
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
నటి విద్యా బాలన్ తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన అవమానాన్ని గుర్తుచేసుకున్నారు. -
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
‘బృందావనం’, ‘ఎవడు’, ‘ఊపిరి’ తదితర చిత్రాలతో మెప్పించిన దర్శకుడు వంశీ పైడిపల్లి. తన తదుపరి ప్రాజెక్టు బాలీవుడ్ హీరోతో ఉండనుందన్న వార్తలపై ఆయన స్పందించారు. -
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అంటే తనకెంతో ఇష్టమని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఆయనతో కలిసి నటించిన సినిమాలోని సన్నివేశాలు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. -
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
‘రామాయణ’ కోసం రణ్బీర్ సిద్ధమవుతున్నారు. ఆ ఫొటోలను ఆయన జిమ్ ట్రైనర్ పోస్ట్ చేశారు. -
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఇప్పటివరకు ఇలాంటి కోస్టార్ను చూడలేదు: మాధవన్
అజయ్దేవ్గణ్తో కలిసి పనిచేయడంపై మాధవన్ స్పందించారు. తన జీవితంలో ఆయనలాంటి కోస్టార్ను చూడలేదన్నారు. -
‘యానిమల్’.. ఎంజాయ్ చేశాను... అసహ్యించుకున్నాను : బాలీవుడ్ దర్శకుడు
‘యానిమల్’ (Animal)పై తన అభిప్రాయాన్ని తెలియజేశారు బాలీవుడ్ దర్శకుడు విశాల్ భరద్వాజ్. సినిమా గురించి ఒక్క మాటలో ఏం చెప్పాలో తనకు అర్థంకావడం లేదన్నారు. -
అందుకే అవార్డు వేడుకలకు హాజరుకాను: ఆమిర్ ఖాన్
సమయం చాలా విలువైనదని బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ఖాన్ అన్నారు. తాజాగా కపిల్శర్మ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన గత చిత్రాల ఫలితాల గురించి స్పందించారు. -
బర్త్డే వేడుకల్లో నాగ్ అశ్విన్ డ్యాన్స్.. వీడియో వైరల్
దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) పుట్టినరోజు వేడుకలు సరదాగా జరిగాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. -
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’ చిత్రానికి సమంత రివ్యూ ఇచ్చారు. -
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు
‘మంజుమ్మల్ బాయ్స్’(Manjummel Boys)తో విజయాన్ని అందుకున్నారు నిర్మాతలు సౌబిన్ షాహిర్, బాబు షాహిర్, షాన్ ఆంటోనీ. తాజాగా వారిపై కేసు నమోదు అయ్యింది. -
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
విజయ్ (Vijay)తో సినిమాపై దర్శకుడు వెట్రిమారన్ (VetriMaaran) క్లారిటీ ఇచ్చారు. గతంలో తాను ఆయనకు కథ చెప్పిన విషయం నిజమేనన్నారు. -
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం
తనపై అసభ్యకర కామెంట్ చేసిన వ్యక్తిని ఉద్దేశించి నటి, బిగ్బాస్ 5 ఫేమ్ శ్వేతా వర్మ (Swetha Varma) ఆగ్రహం వ్యక్తం చేశారు. -
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prasanth Neel) తాజాగా కలిశారు. దీంతో వీరిద్దరి కాంబోలో సినిమా రానుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
వేడుకగా ‘ఆదికేశవ’ నటి వివాహం.. ఫొటో వైరల్
‘ఆదికేశవ’ నటి అపర్ణాదాస్, ‘మంజుమ్మెల్ బాయ్స్’ నటుడు దీపక్ పరంబోల్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. -
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
పూరి మ్యూజింగ్స్లో ‘ది డెవిల్’ అంటూ ఆలోచనల గురించి మాట్లాడారు పూరి జగన్నాథ్ -
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
డిన్నరేనా.. డ్యాన్స్ వద్దా?: షారుక్ఖాన్తో మోహన్లాల్
మోహన్లాల్ డ్యాన్స్ను షారుక్ ఖాన్ మెచ్చుకున్నారు. షారుక్పై మోహన్లాల్ ప్రశంసలు కురిపించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్