Gold Rate : బంగారం ఓ భరోసా.. ధర ఎందుకు పెరుగుతుందో తెలుసా!
భారత్లో పసిడికి విపరీతమైన డిమాండ్ ఉంది. అందుకే ప్రపంచంలో ఏ మార్పు సంభవించినా దాని ప్రభావం ధరలో ప్రతిబింబిస్తుంది. అసలు బంగారం విలువను ఏయే అంశాలు ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి.
తాజాగా 10 గ్రాముల మేలిమి బంగారం(Gold) ధర రూ.61 వేలను దాటిపోయింది. ఈ మధ్య కాలంలో బంగారం ధర (Gold Rate) విపరీతంగా పెరుగుతోంది. భారతీయ సంస్కృతిలో బంగారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పండగలు, పెళ్లిళ్లు, పుట్టినరోజులు ఏవి జరిగినా ఆ వేడుకలో బంగారం ధగధగ మెరుస్తూ ఉంటుంది. మొదట్లో మోజుతో దాన్ని కొన్నప్పటికీ.. ఆర్థిక సంక్షోభం తలెత్తినప్పుడు ఇంట్లో బంగారం (Gold) ఉంటే ఓ భరోసా ఇస్తుందనే నమ్మకం చాలా మందికి ఉంది. ఆ అంచనాలకు తగ్గట్టే కొన్నేళ్లుగా బంగారం తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము కాకుండా చూసుకుంటోంది.
అంతర్జాతీయ పరిణామాలు
ఉక్రెయిన్-రష్యా యుద్ధం, తాజాగా అమెరికా(America), స్విట్జర్లాండ్లలో బ్యాంకులు దివాలా తీయడం ఇలాంటి ఘటనలు ఏవి జరిగినా మన దేశంలో బంగారం ధర కొండెక్కి కూర్చుంటుంది. బంగారం అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టే ఈ పరిస్థితి వస్తుంది. మార్కెట్లో బంగారం విలువ పెరిగితే మన ఇంట్లో ఉన్న బంగారు నగల విలువ కూడా పెరిగినట్లవుతుంది. ఏదైనా దేశంలో రాజకీయ తిరుగుబాటు జరిగినప్పుడు అక్కడ కరెన్సీ విలువ పతనమవుతుంది. స్టాక్ మార్కెట్లు(stock market) నష్టాలబాట పడతాయి. కానీ, విచిత్రంగా బంగారానికి మాత్రం డిమాండ్ ఏర్పడి దాని ధర పెరుగుతుంది. అందువల్లే బంగారాన్ని ‘సంక్షోభంలో ఆదుకునే వస్తువు’గా పిలుస్తుంటారు.
బ్యాంకుల్లో బంగారం నిల్వలు
చాలా దేశాలు తమ ప్రధాన బ్యాంకుల్లో నగదు నిల్వలతోపాటు, బంగారం నిల్వలను పెంచుకుంటున్నాయి. భారత్లోని బ్యాంకులన్నీ దాదాపుగా బంగారంపై రుణాలిస్తున్నాయి. తమ దగ్గరున్న నగదును ఖాతాదారులకు ఇచ్చి వడ్డీ రూపంలో ప్రయోజనం పొందుతున్నాయి. ఇలా బ్యాంకులు బంగారాన్ని సేకరించడం వల్ల కూడా ధర పెరుగుతోంది. బ్యాంకుల్లో కిలోల కొద్దీ బంగారం పోగవడంతో.. బయట మార్కెట్లో నగదు పెట్టి ఏవైనా నగలు కొనాలని వెళితే అక్కడ తగినంత ముడి బంగారం దొరకట్లేదు. దాంతో దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది.
ద్రవ్యోల్బణం
గత కొన్ని దశాబ్దాలుగా బంగారం ధర నిలకడగా పెరుగుతూ వస్తోంది. ఇతర పెట్టుబడి సాధనాలతో పోలిస్తే ద్రవ్యోల్బణానికి మించి రాబడి ఇచ్చిన చరిత్ర బంగారానికి ఉంది. అందుకే ద్రవ్యోల్బణం భారీగా పెరుగుతున్న సమయంలో పసిడికి డిమాండ్ పెరుగుతుంది. సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించి చాలామంది పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను బంగారం వైపు మళ్లిస్తుంటారు. ఫలితంగా ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు బంగారానికి డిమాండ్ ఏర్పడుతుంది. దాంతో ధర పెరుగుతుంది.
బంగారు దుకాణాలు
వేడుక ఏదైనా భారతీయులకు బంగారం కొనడం ఒక అలవాటుగా మారిపోయింది. దాంతో దుకాణాల్లోని బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. బంగారాన్ని కేవలం నగల కోసమే కాకుండా ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీలోనూ వాడుతున్నారు. ఫలితంగా మార్కెట్లో కొరత ఏర్పడుతోంది. దిగుమతి చేసుకుంటున్న బంగారంలో 12శాతం పారిశ్రామిక అవసరాల కోసం వెళ్తున్నట్లు సమాచారం.
అధిక వడ్డీ రేట్ల నుంచి భరోసా
అవసరాల కోసం స్వల్ప, భారీ మొత్తాల్లో అప్పులు చేయడం సహజం. బయటి వ్యక్తులు, బ్యాంకుల వద్ద ఏ రుణం తీసుకున్నా దాదాపుగా అధిక వడ్డీలు చెల్లించాల్సి వస్తుంది. అదే ఇంట్లో ఉన్న బంగారాన్ని బ్యాంకులో పెట్టి రుణం తీసుకుంటే వడ్డీ భారం తగ్గుతుంది. ఆపద సమయాల్లో బయట రుణాలు తీసుకోవడం కంటే బ్యాంకుల్లో బంగారం తనఖా పెట్టడం లాభదాయకమని చాలా మంది భావిస్తున్నారు. అందుకే చేతిలో భారీగా నగదు ఉన్నప్పుడు బంగారం కొంటున్నారు. అత్యవసర సమయాల్లో దాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి తక్కువ వడ్డీకి రుణాలు పొందుతున్నారు.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి. -
Royal family: వందల కార్లు.. రూ.4వేల కోట్ల ప్యాలెస్: ఈ రాజ కుటుంబం హవానే వేరయా..!
విలాసవంతమైన రాజ భవనాలు, ప్రముఖ సంస్థల్లో పెట్టుబడులు, లండన్, పారిస్లో ఆస్తులు.. యూఏఈ రాజ కుటుంబం(royal family of Dubai) సంపద ఎంతో తెలుసా..? -
Lakshadweep: నిమిషానికి 11 ఓడలు.. భారత్ అధీనంలోనే కీలక సముద్ర మార్గం!
లక్షద్వీప్కు సంబంధించి మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. అదే నైన్ డిగ్రీ ఛానెల్. ఇక్కడ ఎలాంటి అలజడి జరిగినా ఆసియాలోని పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. -
World Roundup 2023: విపత్తులు మిగిల్చిన విషాదం.. భీకర యుద్ధాలు!
గడిచిన ఏడాది కాలాన్ని తిరిగి చూస్తే.. ప్రకృతి విపత్తులు, భీకర యుద్ధాలు పలు దేశాలను వణికించాయి. -
Vessel Hijack: హైజాక్ చేయడం...డబ్బు గుంజుకోవడం.. ఈ తరహా ఘటనలెన్నో!
మాల్టా దేశానికి చెందిన వాణిజ్య నౌకను సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. గతంలోనూ ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నాయి. -
December 13, 2001: పార్లమెంటుపై దాడి.. ఆ రోజు ఏం జరిగిందంటే..!
రెండు దశాబ్దాల కిందట ఇదే రోజు (డిసెంబర్ 13, 2001న) భారత పార్లమెంటుపై ఉగ్రవాదులు జరిపిన దాడి యావత్ దేశాన్ని కలవరపాటుకు గురిచేసింది. -
Tunnel Rescue: రాణిగంజ్ నుంచి ఉత్తర్కాశీ దాకా.. చరిత్రలో నిలిచిన సాహసోపేత ఆపరేషన్లు!
భారత్లో రాణిగంజ్ బొగ్గుగని ప్రమాదం మొదలు, థాయ్లాండ్లో గుహలో చిన్నారులు చిక్కుకుపోవడం.. తాజాగా ఉత్తర్కాశీ సొరంగం ఆపరేషన్లు చరిత్రలో నిలిచిపోయాయి. -
Javier Milei: అర్జెంటీనా సమస్యలను తప్పించగలడా.. ఈ ‘పిచ్చాయన’!
అర్జెంటీనాలో ఇటీవలి అధ్యక్ష ఎన్నికల్లో మెజార్టీ సాధించిన జేవియర్ మిలి.. త్వరలోనే దేశ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
NDA: ఎన్డీఏ ‘మహా’ వ్యూహం.. ఉద్ధవ్కు చెక్ పెట్టేందుకు రంగంలోకి రాజ్..!
-
Stock market: భారీ నష్టాల్లో సూచీలు.. సెన్సెక్స్ 700 పాయింట్లు డౌన్
-
India- China: ఎన్నిసార్లు వాదించినా వాస్తవాలు మారవు.. చైనాకు భారత్ కౌంటర్
-
CAA: సీఏఏపై స్టే కోరుతూ పిటిషన్లు.. కేంద్రానికి మూడు వారాల గడువిచ్చిన సుప్రీం
-
Sita Soren: జేఎంఎంకు షాక్..! భాజపాలోకి శిబూ సోరెన్ పెద్ద కోడలు
-
Mumbai Indians: హార్దిక్.. అంత వీజీ కాదు