Volcano : అగ్ని పర్వతాన్ని ఆరాధించే పండగ ‘యడ్న్యా కసాడా’
ప్రపంచవ్యాప్తంగా (World wide) దేవుళ్లను (God) వివిధ రూపాల్లో కొలుస్తుంటారు. అలా ఇండోనేసియాలో (Indonesia) ఓ అగ్ని పర్వతాన్ని (Volcano) దేవుళ్లకు ప్రతిరూపంగా ఆరాధిస్తున్నారు. ఏటా యడ్న్యా కసాడా పర్వదినాన అక్కడకు వెళ్లి మొక్కులు చెల్లిస్తున్నారు. ఆ సంగతేంటో చదివేయండి.
ఇండోనేసియాలోని (Indonesia) మౌంట్ బ్రోమో (Mount Bromo) అగ్నిపర్వతం పరిసరాలు సోమవారం నాడు టెంగరీ తెగ భక్తులతో కిక్కిరిసిపోయాయి. ‘యడ్న్యా కసాడా’ పర్వదినాన అగ్నిపర్వతానికి మొక్కులు చెల్లించుకోవడం గత కొన్ని శతాబ్దాలుగా వారికి ఆనవాయితీగా వస్తోంది. మేకలు, కోళ్లు, కూరగాయలు, పండ్లు, బియ్యం ఇలా తమకు తోచినవన్నీ దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తూ వాటిని మండుతున్న బిలంలోకి విసిరేస్తారు.
బ్రహ్మ పర్వతమే ‘బ్రోమో’!
అగ్నిపర్వతానికి ‘బ్రోమో’ అనే పేరు సృష్టికర్త అయిన బ్రహ్మ పేరు మీదుగా వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. బ్రోమో టెంగర్ సెమెరు నేషనల్ పార్క్ ప్రాంతంలో ఇదో అగ్నిపర్వతం. 2019లో ఒకసారి భారీ విస్ఫోటనం చెందింది. దాంతో భూకంపం సంభవించి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ శిఖరం వద్ద గణపతి విగ్రహం కూడా ఉంటుందట. వందల ఏళ్లుగా తమను గణపతి దేవుడు రక్షిస్తున్నాడనేది టెంగరీస్ హిందువుల విశ్వాసం. బ్రోమో పర్వతం చుట్టుపక్కలి 48 గ్రామాల్లో కలిపి సుమారు 3 లక్షల మంది నివాసం ఉంటున్నారు.
కొండల్లో నివసిస్తున్న టెంగర్ తెగ ప్రజలు సంవత్సరానికి ఒకసారి ఈ పర్వదినాన అగ్నిపర్వతం దగ్గర సమావేశమవుతారు. తూర్పు జావాలో నివసించే తమ తెగకు అదృష్టం కలిసి వచ్చేలా చూడాలని ప్రార్థనలు చేస్తారు. ఏటా ‘కసాడ’ నెలలో వచ్చే 14వ రోజున పండగ నిర్వహిస్తారు. సంప్రదాయ టెంగర్ క్యాలెండర్ ప్రకారం ఆ రోజు వస్తుంది. కొవిడ్ మహమ్మారి వ్యాప్తి కారణంగా 2020 నుంచి ఇక్కడ పండగ వాతావరణం కనిపించలేదు. ఈ సారి ఆ నిబంధనలు పూర్తిగా తొలగించడంతో వేలాది మంది తరలివచ్చారు.
పిల్లలు కలుగలేదని..
ఈ పండగకు మూలం 15వ శతాబ్దంలో.. మజాపహిత్ రాజ్యంలో ప్రారంభమైనట్లు ఓ జానపద సాహిత్యం తెలుపుతోంది. పెళ్లయి ఏళ్లు గడుస్తున్నా పిల్లలు కలుగకపోవడంతో యువరాణి రోరో ఆంటెంగ్, ఆమె భర్త బ్రోమో పర్వతంపై ధ్యానం చేస్తూ దేవుళ్లను వేడుకున్నారట. తరువాత 25 మంది సంతానం కలుగగా అందులో ఒకరిని మౌంట్ బ్రోనో అగ్నిపర్వతంలోకి విసిరేస్తామని మొక్కుకున్నారట. తల్లిదండ్రుల మొక్కు తీర్చడం, టెంగర్ ప్రజల శ్రేయస్సు కోసం ఓ చిన్నారి ఇష్టపూర్వకంగానే అగ్నిపర్వతంలోకి దూకాడనే కథ ప్రచారంలో ఉంది.
ఎందుకీ నైవేద్యాలు?
దేవుడు ప్రసాదించిన వాటిలో కొంత భాగాన్ని తిరిగి దేవుడికే నైవేద్య రూపంలో పెడితే.. ఆయన తమపై మరింత కరుణ చూపుతాడని భక్తుల విశ్వాసం. అందుకే పది ఆవులున్న యజమాని ఒక ఆవును, కోళ్లున్న వారు ఒక కోడిని ఇలా రకరకాలుగా తాము జీవనోపాధి పొందుతున్న వాటిని నైవేద్యంగా సమర్పించడానికి తీసుకొస్తారు. ఈ టెంగర్ తెగ ప్రజలు అగ్నిపర్వతంలో విసిరినవి పట్టుకోవడానికి కొంతమంది వలలు అడ్డు పెడుతుంటారు. అగ్నిపర్వతం అంచున నిలబడి, ప్రాణాలకు తెగించి వారు ఆ సాహసం చేస్తారు. నిజానికి మండుతున్న బిలం, అగ్నిపర్వత శిఖరం అంచు మధ్య చాలా దూరం ఉంటుంది. కాబట్టి భక్తులు సమర్పించే నైవేద్యాలన్నీ మధ్యలోనే పడుతుంటాయి. వాటిని సేకరించి తీసుకుపోవడానికి టెంగర్ తెగ కాని వారు పోటీ పడుతుంటారు. కొన్నిసార్లు ఆవులు, మేకలు, కోళ్లు కూడా వారికి దొరుకుతాయి.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి. -
Royal family: వందల కార్లు.. రూ.4వేల కోట్ల ప్యాలెస్: ఈ రాజ కుటుంబం హవానే వేరయా..!
విలాసవంతమైన రాజ భవనాలు, ప్రముఖ సంస్థల్లో పెట్టుబడులు, లండన్, పారిస్లో ఆస్తులు.. యూఏఈ రాజ కుటుంబం(royal family of Dubai) సంపద ఎంతో తెలుసా..?
తాజా వార్తలు (Latest News)
-
‘కేజ్రీవాల్ హత్యకు కుట్ర’.. ఆప్ తీవ్ర ఆరోపణలు
-
దక్షిణాదిలో ఈసారి భాజపా అత్యుత్తమ పనితీరు: అమిత్ షా
-
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
జీహెచ్ఎంసీ పరిధిలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం
-
పదవి కోసం పెద్దిరెడ్డి నా కాళ్లు పట్టుకున్నారు: కిరణ్కుమార్రెడ్డి