Dolly: కార్పొరేట్ కొలువు వదులుకొని.. సర్పంచ్గా పోటీ చేసి..!
ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో కార్పొరేట్ సంస్థలో ఉద్యోగాన్ని వదులుకొని సర్పంచ్గా పోటీ చేశారు బిహార్కి చెందిన డాలీ. ఆమె ఎంత వరకు అందులో సక్సెస్ సాధించారు?
ఇంటర్నెట్ డెస్క్: కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం. సమున్నత హోదా. మంచి జీతం. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకే పని. వారాంతాల్లో వినోదాలు, విహారాలు. ఇలాంటి జీవితాన్ని ఎవరు వదులుకుంటారు చెప్పండి. కానీ, ప్రజలకు ప్రత్యక్షంగా సేవ చేయాలనే ఉద్దేశంతో ఉద్యోగం వదులుకొని ప్రజల కోసం పని చేస్తున్నారు బిహార్కు (Bihar)చెందిన డాలీ (Dolly).
డాలీ.. ఎంబీఏ (MBA) చదువుకున్నారు. దాదాపు 10 ఏళ్లపాటు మల్టీనేషనల్ కంపెనీ (MultiNational Compenie)ల్లో పని చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవితం సాగుతున్నా ఆమెకు ఏదో లోటు. ప్రజలకు ఏదో చేయాలన్న తపన. దీంతో దిల్లీ నుంచి 2018లో తన అత్తవారి ఊరు బిహార్లోని షాదీపూర్ వెళ్లారు. అదే ఏడాది జరుగుతున్న పంచాయతీ ఉప ఎన్నికల్లో సర్పంచ్ (Sarpanch)గా పోటీ చేశారు. అంతవరకు బాగానే ఉంది. ఆమెను నమ్మి ఓట్లేసేదెవరు? ముక్కూమొహం తెలియదు. వాళ్ల ఆచార సంప్రదాయాలపై అవగాహన లేదు. ఉత్తర్ప్రదేశ్లో పుట్టి పెరిగి, బిహార్ వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత దిల్లీకి మకాం మార్చారు. దీంతో సొంత ఊరి ప్రజలతో పరిచయాలు లేవు. అలాంటి వ్యక్తికి అక్కడి ప్రజలు ఎలా ఓట్లు వేస్తారు? ఇదే సందేహం ఆమెకు కూడా కలిగింది. కానీ, తన వంతు ప్రయత్నంగా ప్రజలతో మమేకమైంది. అయితే, డాలీ అత్తగారు కూడా గతంలో సర్పంచ్గా పని చేయడం ఆమెకు కాస్త కలిసొచ్చింది. దీంతో ఫలానా వారి కోడల్ని అంటూ గ్రామ ప్రజలతో కలిసిపోయే ప్రయత్నం చేశారు డాలీ. ఆ ఎన్నికల్లో కేవలం 50 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. సర్పంచ్ సీటు కోసం ఏడుగురు పోటీ చేయగా అందులో ఈమె ఒక్కరే మహిళా అభ్యర్థి కావడం గమనార్హం.
సర్పంచ్గా ఎన్నికైన తర్వాత ఆమె స్థానిక సంప్రదాయాలను పాటించడం మొదలు పెట్టారు. ఏ ఇంట్లో ఏ చిన్న కార్యక్రమం జరిగినా తప్పకుండా హాజరయ్యేవారు. తనకు తోచిన సూచనలు, సలహాలు ఇచ్చేవారు. అలా కొన్ని రోజులు గడిచే సరికి వాళ్లకు ఆమెపై కొంత నమ్మకం కలిగింది.
గ్రామ న్యాయస్థానం బలోపేతం
తొలిసారి సర్పంచ్గా విధులు నిర్వర్తించిన మూడున్నరేళ్లలో డాలీ పంచాయతీలో కీలక సంస్కరణలు తీసుకొచ్చారు. గ్రామ న్యాయస్థానాలను బలోపేతం చేశారు. పంచాయతీ పరిధిలో ఏ సమస్యలు ఉన్నా కోర్టుల చుట్టూ తిరగకుండా దాదాపు 95శాతం కేసులు ఇక్కడే పరిష్కారమయ్యేలా చర్యలు చేపట్టారు. అలాగని ఏదో నోటికొచ్చిన తీర్పులు చెప్పకుండా.. తనతోపాటు ఒక లాయర్ని పక్కన పెట్టుకొని నిజానిజాలు తేలిన తర్వాతే తీర్పులు చెప్పే వారు. ఈ క్రమంలో బాధితుల ఇళ్లకు వెళ్లి, క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించేవారు. సాధారణంగా సివిల్ కేసులు పరిష్కారం కావాలంటే కనీసం 5 నుంచి 10 ఏళ్లు కోర్టుల చుట్టూ తిరగాల్సి రావొచ్చు. అలాంటిది గ్రామ న్యాయస్థానంలో 6 నెలల్లోపే కేసులు పరిష్కారమయ్యేవి. ప్రజలకు డబ్బు కూడా ఆదా అయ్యేది.
అంతేకాకుండా డిజిటల్ రూపంలో సమస్యలు నమోదు చేసేలా ఓ ప్రత్యేక వ్యవస్థను రూపొందించారు డాలీ. దీనిద్వారా గ్రామస్థులు తమ సమస్యలను అక్కడి సిబ్బంది సహకారంతో నేరుగా కంప్యూటర్లలోనే నమోదు చేయవచ్చు. సంబంధిత డాక్యుమెంట్లను అప్లోడ్ చేస్తే.. కేసు ఎప్పటిలోగా పరిష్కారమవుతుందో చెప్పేలా ఈ వ్యవస్థను డిజైన్ చేశారు. దీంతో కేసుల విచారణ పారదర్శకంగా జరిగేది. డాలీ తీసుకొచ్చిన సంస్కరణలతో ఆమెపై ప్రజలకు నమ్మకం ఏర్పడింది. దీంతో ఆస్తి పంపకాలతోపాటు కుటుంబ సమస్యలను సైతం ఆమె వద్దకు తీసుకొచ్చేవారు. 2019లో ఓ వితంతువుకు వాటా ఇచ్చేందుకు అత్తింటివారు నిరాకరించారు. దీంతో ఆమె తన 10 నెలల కుమార్తెతో కలిసి డాలీకి తన బాధను విన్నవించుకున్నారు. సర్పంచ్ స్థానంలో ఉన్న ఆమె కలుగజేసుకొని.. చట్టబద్ధంగా రావాల్సిన భూమిని ఆమెకు ఇప్పించారు. ఇలా ప్రజల్లో మమేకమైన ఆమె 2022లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 1500 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు.
మహిళలకు స్ఫూర్తి
మహిళలకు పెద్దపీట వేయాలన్న ఉద్దేశంతో దేశంలోనే తొలిసారిగా 2006లో బిహార్ ప్రభుత్వం 50శాతం పంచాయతీ స్థానాలను మహిళలకే కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. కానీ, అది రికార్డులకే పరిమితమైంది. చాలా చోట్ల భర్త తన భార్యను బరిలోకి దింపి తానే సర్పంచ్గా చలామణీ అయ్యేవారు. డాలీ సర్పంచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమెకూ ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి. కొందరు గ్రామస్థులు తాను పక్కన ఉన్నప్పటికీ, సమస్యలను భర్తతో చెప్పేవారని, పంచాయతీ కార్యాలయంలో పని చేస్తున్న సిబ్బంది కూడా తొలినాళ్లలో తనను సర్పంచ్గా అంగీకరించలేదని ఆమె చెబుతారు. అయితే కొద్దికాలంలోనే వాళ్లందరికీ తానేంటో అర్థమైందని చెప్పుకొచ్చారు డాలీ. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని చుట్టుపక్కల పంచాయతీల్లోని మహిళలు ఎన్నికల్లో పోటీచేసేందుకు తమంతట తాముగా ముందుకొచ్చారు. షాదీపూర్ గ్రామంలోని కొందరు విద్యార్థినులు, యువతలు ఆమెను అనుసరిస్తున్నారు. అలా వారందరికీ ఆమె ఓ రోల్మోడల్గా మారారు.
రాజకీయాలంటే పెద్దగా ఆసక్తి లేదని, పేద ప్రజలకు ఉన్నంతలో సేవ చేయాలనే సంకల్పంతోనే సర్పంచ్గా కొనసాగుతున్నానని అంటున్నారు. పంచాయతీ పరిధిలోని పిల్లలకు ఉత్తమ విద్యను అందించి వారి అభివృద్ధికి దోహదం చేస్తానని డాలీ చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
-
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
-
ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
వలకు చిక్కిన 30 కిలోల చేప