Iphone : సెలబ్రిటీలు ఐఫోనే వాడతారెందుకు?
మన దేశంలో సినీ, రాజకీయ ప్రముఖులు, సోషలైట్స్ అందరి చేతుల్లోనూ దాదాపు ఐ ఫోనే (Iphone) కనిపిస్తుంటుంది. వారంతా ఐ ఫోన్ మాత్రమే ఎందుకు వాడుతున్నారో తెలుసుకోండి.
అమెరికా (America) దిగ్గజ కంపెనీ యాపిల్ (Apple) ప్రపంచంలోనే అత్యున్నత టెక్నాలజీ వినియోగిస్తోంది. ఇతర కంపెనీలతో పోలిస్తే యాపిల్ రూపొందించిన ఏ ప్రొడక్ట్ లుక్ చూసినా విలాసవంతంగా.. ఖరీదైనదిగా కన్పిస్తుంది. ఐపాడ్, ఎయిర్పాడ్, ఐమ్యాక్, మ్యాక్బుక్, ఇయర్ బడ్స్, వాచ్ ఇలా ఏవైనా సరే అత్యుత్తమ ఫీచర్లతో అద్భుతంగా పనిచేస్తుంటాయి. ధర ఎక్కువైనా ఆ కంపెనీ మార్కెట్లోకి విడుదల చేసే ఐ ఫోన్లను (Iphone) ఎక్కువ మంది సెలబ్రిటీలు కొనుగోలు చేస్తుంటారు. అందుకు గల కారణాలేవో పరిశీలించండి.
గోప్యత.. భద్రత
వినియోగదారుల డేటాకు భద్రత కల్పించడంలో యాపిల్ ఎలాంటి రాజీ పడదు. సామాన్యుడి నుంచి సంపన్నుడి దాకా దాన్ని ఎవరు వినియోగించినా వారి గోప్యతకు భంగం వాటిల్లకుండా చూస్తుంది. సెక్యూర్ డిజిటల్ (ఎస్డీ) కార్డులను కూడా ఈ కంపెనీ నమ్మదు. అందుకే ఆ ఐచ్ఛికం లేకుండానే ఫోన్లను తయారు చేస్తోంది. అంతే కాదు థర్డ్ పార్టీ యాప్లు కొన్ని ఆండ్రాయిడ్ యూజర్ల డేటాను తస్కరించడానికి యత్నిస్తుంటాయి. ప్రత్యేక అనుమతులు యూజర్ నుంచి తీసుకొని డేటా చౌర్యానికి పాల్పడుతుంటాయి. అలాంటి చర్యలను యాపిల్ సమర్థంగా అడ్డుకుంటుంది. యాపిల్ సైతం ఆపరేటింగ్ సిస్టమ్ ప్రయోజనాలకు తప్ప ఇతర విషయాల కోసం యూజర్ల డేటాను వాడుకోదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఓఎస్లలో యాపిల్ అత్యుత్తమం. అది నమ్మకమైనది, భద్రమైనదని సైబర్ నిపుణులు చెబుతున్న మాట. ఆండ్రాయిడ్ ఫోన్లతో పోలిస్తే ఐఫోన్లను హ్యాక్ చేయడం దాదాపుగా అసాధ్యం. ఈ విషయంలోనే సెలబ్రిటీలు ఎక్కువగా ఐ ఫోన్లకు ఆకర్షితులవుతున్నారు.
ఫోన్లకు చెవులుంటాయి!
మనం వాడుతున్న చాలా స్మార్ట్ ఫోన్లు మన మాటలు వింటున్నట్లు సమాచారం. మీకూ ఈ అనుభవం ఎదురై ఉండొచ్చు. కొన్ని విషయాల గురించి ఇంట్లో, ఆఫీసులో, క్యాంటీన్లో ఎక్కడ మాట్లాడినా దానికి సంబంధించిన ఒక ప్రకటన వెంటనే మన ఫోన్లోని ఏదోక యాప్లో ప్రత్యక్షమవుతుంది. ఇంతకు ముందెన్నడూ మాట్లాడని విషయం గురించి ప్రస్తావించినా దానికి సంబంధించిన ప్రకటన రావడం ఆశ్చర్యమే కదా? ఐ ఫోన్ యూజర్లకు ఈ అనుభవం దాదాపుగా ఎదురు కాలేదనే చెప్పవచ్చు.
యాపిల్ ఎకో సిస్టమ్
మనం వాడుతున్న ఫోన్, కంప్యూటర్, వాచ్ ఇలా అన్నీ యాపిల్ కంపెనీకి చెందినవే అయితే దాన్ని యాపిల్ ఎకో సిస్టం అని పిలుస్తారు. వీటన్నింటినీ ఒకదానికొకటి కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఫోన్లోని సమాచారం కంప్యూటర్లోకి, వాచ్లోని సమాచారం ఫోన్లోకి సులభంగా మార్పిడి చేయొచ్చు. ఫోన్ దగ్గర్లో లేకపోయినా మ్యాక్బుక్లో నుంచి కాల్స్ మాట్లాడొచ్చు. ఇలాంటి సౌకర్యాలన్నీ యాపిల్ ఎకో సిస్టమ్లో లభిస్తాయి. వీటిలో ఏదైనా సమస్య తలెత్తితే కేవలం యాపిల్ సర్వీస్ సెంటర్కు మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ కూడా గోప్యత, భద్రత ప్రమాణాలు పాటిస్తూ వాటిని రిపేర్ చేస్తారు. మిగతా ఫోన్ యూజర్లు ఎక్కడికైనా వెళ్లి రిపేర్ చేయించుకోగలుగుతారు కానీ.. అందులోని సమాచారం అక్కడి సిబ్బంది ట్రాన్స్ఫర్ చేసుకున్నా గుర్తించే అవకాశం ఉండదు.
కెమెరా పని తీరుకు ఫిదా
ఐఫోన్లో కెమెరాకు విశిష్ట స్థానం ఉంది. సెలబ్రిటీలు తమ ఐ ఫోన్తో మిర్రర్ సెల్ఫీలు తీసుకొని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడం తరచూ చూస్తుంటాం. ఐఫోన్ కెమెరాలో ఫొటో తీస్తే వచ్చే రంగులు, ఎక్స్ప్లోజర్, వీడియోల్లో వినిపించే స్వరాల్లో సహజత్వం ఉట్టిపడుతుంది. ట్రావెల్ ఫొటోగ్రఫీ, దర్శనీయ స్థలాలు, చూడచక్కని ఇంటీరియర్స్ ఇలా వేటిని క్లిక్మనిపించినా ఆ చిత్రాల్లో వక్రీకరణ కనిపించదు. ఎడిటింగ్ అవసరం లేకుండానే ఐ ఫోన్లో తీసిన ఫొటోలను నేరుగా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసుకోవచ్చు. వాటిలో అంత నాణ్యత ఉంటుంది.
సులభతర వినియోగం
ఐ ఫోన్లలో ప్రత్యేకమైన ఐఓఎస్ ఉంటుంది. అది ఆండ్రాయిడ్ ఫోన్ల కంటే వేగవంతమైన పనితీరు కనబరుస్తుంది. మల్టీ ట్యాబ్స్ ఓపెన్ చేసినా హ్యాంగ్ కాదు. ఐఓఎస్ వెర్షన్లు మారుతున్నా బేసిక్ ఫీచర్లను అలాగే కొనసాగిస్తున్నారు. వాటి ఐకాన్స్ అందంగా కన్పిస్తుంటాయి. దాంతో ఫీచర్లను సులభంగా గుర్తుపట్టొచ్చు. గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఈ ఐఓఎస్లో స్వల్ప మార్పులు మాత్రమే చేశారు. మిగతా ఆండ్రాయిడ్ ఫోన్లను చూస్తే ఒక్కో ఫోన్ ఒక తీరుగా ఉంటుంది. కొత్తగా ఫోన్ కొన్న ప్రతిసారి కాస్త గందరగోళానికి గురి కావాల్సి వస్తుంది. ఐ ఫోన్ యూజర్లకు ఈ ఇబ్బంది ఎదురుకాదు. అందులో కనిపించే ఐకాన్, ఫాంట్స్, ప్రకాశవంతమైన రంగులు యూజర్ ఫ్రెండ్లీగా ఉంటాయి.
ఎప్పటికప్పుడు సాఫ్ట్వేర్ అప్డేట్స్
ఆండ్రాయిడ్ ఫోన్లతో పోలిస్తే యాపిల్ ఎందుకు భిన్నమో ఇక్కడ స్పష్టంగా తెలిసిపోతుంది. ఎలాంటి సాఫ్ట్వేర్ అప్డేట్ అయినా అన్ని డివైజ్లలోకి వేగంగా అందుబాటులోకి వస్తుంది. వాటి కోసం ఎదురు చూడాల్సిన పని ఉండదు. యాపిల్ ఎప్పటికప్పుడు తన పరికరాల్లోకి అప్డేట్స్ అందజేస్తుంటుంది. అందుకే సెలబ్రిటీలు ఈ బ్రాండ్ను ఎక్కువగా ఇష్టపడుతుంటారు.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి. -
Royal family: వందల కార్లు.. రూ.4వేల కోట్ల ప్యాలెస్: ఈ రాజ కుటుంబం హవానే వేరయా..!
విలాసవంతమైన రాజ భవనాలు, ప్రముఖ సంస్థల్లో పెట్టుబడులు, లండన్, పారిస్లో ఆస్తులు.. యూఏఈ రాజ కుటుంబం(royal family of Dubai) సంపద ఎంతో తెలుసా..?
తాజా వార్తలు (Latest News)
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్