కుడి - ఎడమ డ్రైవింగ్లో మతలబు!?
మన దేశంలో ఎడమ వైపు నుంచి డ్రైవింగ్ చేస్తుంటారనే విషయం అందరికీ తెలుసు. కొన్ని దేశాల్లో కుడి వైపు డ్రైవింగ్ ఉంటుంది. ఎడమవైపు డ్రైవింగ్ అలవాటు ఉన్న వ్యక్తులు.. కుడివైపు డ్రైవింగ్ చేసే దేశాల్లో వాహనం నడపాల్సి వస్తే చాలా జాగ్రత్త వహించాలి.
కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్.. అని ఓ సినీ కవి అన్నారు. కానీ డ్రైవింగ్ విషయంలో కుడి.. ఎడమ చూసుకోకపోతే ప్రమాదాలు జరిగే అవకాశముంది. మన దేశంలో ఎడమ వైపు నుంచి డ్రైవింగ్ చేస్తుంటారనే విషయం అందరికీ తెలుసు. కొన్ని దేశాల్లో కుడి వైపు డ్రైవింగ్ ఉంటుంది. ఎడమవైపు డ్రైవింగ్ అలవాటు ఉన్న వ్యక్తులు.. కుడివైపు డ్రైవింగ్ చేసే దేశాల్లో వాహనం నడపాల్సి వస్తే చాలా జాగ్రత్త వహించాలి. లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశముంది. గణాంకాల ప్రకారం.. 75 దేశాల్లో ఎడమవైపు.. 165 దేశాల్లో కుడివైపు డ్రైవింగ్ చేస్తారట. కానీ, ఎందుకలా? అన్ని దేశాల్లో ఒకేలా ఎందుకుండదు? అసలు ఈ కుడి.. ఎడమ డ్రైవింగ్ ఎలా మొదలైంది? వీటికి సమాధానం తెలియాలంటే.. కొన్ని శతాబ్దాల వెనక్కి వెళ్లాల్సిందే.
మొదట అంతా ఎడమవైపే
ప్రాచీన కాలం నుంచి అందరూ ఎడమ వైపు నుంచే ప్రయాణించేవారట. ఇందుకు కారణాలు.. ఆధారాలు ఉన్నాయి. ఒకప్పుడు రాజ్యాల్లో ఉండే సైనికులు గుర్రాలపైకి ఎడమవైపు నిలబడి ఎక్కేవాళ్లు. సైనికుల కత్తి ఒర ఎడమవైపు ఉంటుంది కాబట్టి.. కుడివైపు నుంచి ఎక్కడానికి వీలుకాదు. అదే ఎడమవైపు నుంచి అయితే.. ఇబ్బంది లేకుండా కుడి కాలు పైకి లేపి, గుర్రం ఎక్కొచ్చు. అంతేకాదు.. గుర్రాన్ని ఎడమవైపు నుంచి తీసుకెళ్లడం వల్ల ఒరలోంచి కత్తిని కుడిచేతితో సులభంగా తీసి శత్రువులతో యుద్ధం చేయడానికి, రాజుకు సెల్యూట్ చేయడానికి వీలు ఉండేది. అలా యజమానికి అనుగుణంగా గుర్రాలు కూడా ఎడమవైపు నుంచి వెళ్లడానికి అలవాటు పడ్డాయి. అలా రోమన్ సైనికులతోపాటు సామాన్య ప్రజలు కూడా వారి గుర్రాలను.. రథాలను ఎడమవైపు నుంచే నడిపించేవారు. క్రీస్తుశకం 1300లో పోప్ బెనిఫేస్ VIII రోమ్ను సందర్శించడానికి వచ్చే భక్తులందరూ ఎడమవైపే వాహనాలను నడపాలనే నిబంధన కూడా విధించాడని చరిత్రకారులు చెబుతున్నారు.
కుడివైపునకు మారిన ఫ్రాన్స్
ఫ్రాన్స్లో క్రీస్తుశకం 1700 కాలంలో రవాణా వ్యవస్థ అభివృద్ధి చెందింది. గుర్రాలకు చెక్కతో చేసిన పెద్ద పెద్ద డబ్బాలను కట్టి వస్తువులను ఇతర ప్రాంతాలకు తరలించేవారు. అయితే, ఆ సమయంలో గుర్రాలను నడిపించే డ్రైవర్కు ప్రత్యేకంగా సీటు ఏమీ ఉండేది కాదు. ఎడమవైపు ఉండే గుర్రంపై కూర్చొని కుడి చేత్తో కొరడా ఝుళిపిస్తూ బండిని తోలాల్సి ఉండేది. రోడ్డుకు ఎడమవైపున కూర్చోవడంతో వెనుక వచ్చే బండ్లను గమనించడం డ్రైవర్కు కష్టంగా మారింది. అందుకే గుర్రపు బండిని రోడ్డుకు కుడివైపు నుంచి తోలడం మొదలుపెట్టారు. దీంతో డ్రైవర్ రోడ్డు మధ్యలో నుంచి వెళ్తున్నట్లుగా ఉండేది. తన వెనక వచ్చే బండ్లను ఎడమ వైపు నుంచి ముందుకు పంపే వీలు కలిగేది. అయితే, సాధారణ గుర్రాలు ఎడమవైపు నుంచి.. గుర్రపు బండ్లు కుడివైపు నుంచి వెళ్తుండటంతో ప్రయాణం కాస్త గందరగోళంగా మారేది. ఇది గమనించిన ఫ్రాన్స్ ప్రభుత్వం అందరూ కుడివైపు నుంచే వెళ్లాలని 1792లో ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ బోనపార్ట్ కుడివైపు డ్రైవింగ్ను చట్టంగా మార్చారు.
నిర్ణయం మార్చుకోని బ్రిటన్
ఫ్రాన్స్లో కుడివైపు డ్రైవింగ్ మొదలు కావడంతో పొరుగు దేశాలు సైతం కుడివైపు డ్రైవింగ్ను అనుసరించడం మొదలుపెట్టాయి. కానీ బ్రిటన్ ఇందుకు నిరాకరించింది. ఎడమవైపు డ్రైవింగ్నే కొనసాగిస్తామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఎడమవైపు డ్రైవింగ్ను ప్రోత్సహించేందుకు 1773లో జనరల్ హైవే పేరుతో ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. కాలానుగుణంగా ఈ చట్టాన్ని 1835లో మరోసారి అమలు చేసింది.
బ్రిటన్తో కొన్ని.. ఫ్రాన్స్తో కొన్ని..
అత్యంత శక్తిమంతమైన దేశాలుగా ఉన్న బ్రిటన్.. ఫ్రాన్స్ అప్పటికే ఇతర దేశాలపై ఆధిపత్యం చలాయించడం మొదలుపెట్టాయి. దీంతో తమ అధీనంలో ఉన్న దేశాల్లో బ్రిటన్ ఎడమ వైపు డ్రైవింగ్.. ఫ్రాన్స్ కుడివైపు డ్రైవింగ్ను అమలు చేశాయి. అలా భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా సహా బ్రిటన్ పరిపాలించిన అనేక దేశాల్లో ఎడమ వైపు డ్రైవింగ్ కొనసాగుతోంది. జపాన్, ఇండోనేషియా, థాయ్లాండ్ వంటి ఆసియాలోని మరికొన్ని దేశాలు కూడా ఎడమవైపు డ్రైవింగ్ను అనుసరించాయి. అమెరికా, కెనడాలోనూ మొదట్లో ఎడమవైపు డ్రైవింగే ఉండేది. కానీ అక్కడి పెద్దరోడ్లు గుర్రపుబండ్లు తిరగడానికి వీలుగా ఉండటంతో ఫ్రాన్స్ మొదలుపెట్టిన కుడివైపు డ్రైవింగ్వైపే మొగ్గుచూపాయి. కాలక్రమంలో కార్లు, అనేక రకాల వాహనాలు వచ్చాయి. గుర్రపు బండి సూత్రం ప్రకారం.. డ్రైవర్ రోడ్డుకు మధ్యలో ఉండేవిధంగా.. ఎడమవైపు డ్రైవింగ్ కార్లలో కుడివైపు స్టీరింగ్, కుడివైపు డ్రైవింగ్ కార్లలో ఎడమవైపు స్టీరింగ్ ఉండటం గమనించొచ్చు.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Tunnel Rescue: రాణిగంజ్ నుంచి ఉత్తర్కాశీ దాకా.. చరిత్రలో నిలిచిన సాహసోపేత ఆపరేషన్లు!
భారత్లో రాణిగంజ్ బొగ్గుగని ప్రమాదం మొదలు, థాయ్లాండ్లో గుహలో చిన్నారులు చిక్కుకుపోవడం.. తాజాగా ఉత్తర్కాశీ సొరంగం ఆపరేషన్లు చరిత్రలో నిలిచిపోయాయి. -
Javier Milei: అర్జెంటీనా సమస్యలను తప్పించగలడా.. ఈ ‘పిచ్చాయన’!
అర్జెంటీనాలో ఇటీవలి అధ్యక్ష ఎన్నికల్లో మెజార్టీ సాధించిన జేవియర్ మిలి.. త్వరలోనే దేశ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్నారు. -
అలాంటి వలలో పడొద్దు.. ‘పిగ్ బుచరింగ్ స్కామ్స్’పై నితిన్ కామత్ టిప్స్..!
Nithin Kamath tips: పిగ్ బుచరింగ్ స్కామ్స్ దేశంలో పెరిగిపోయాయని జిరోదా సీఈఓ నితిన్ కామత్ అన్నారు. ఈ స్కామ్స్ బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. -
Israel: యుద్ధం వేళ.. మరణించిన సైనికుల ‘వీర్యం’ సేకరిస్తున్న కుటుంబీకులు!
యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికులు, సామాన్య యువకుల వీర్యాన్ని సేకరించేందుకు (Sperm Retrieval) బాధిత కుటుంబీకులు ప్రయత్నిస్తున్నారు. -
Madhyapradesh Elections: ‘గ్వాలియర్-చంబల్’ సంగ్రామంలో విజయం ఎవరిదో?
కీలక గ్వాలియర్-చంబల్ ప్రాంతంలో తమ సత్తా చాటేందుకు భాజపా, కాంగ్రెస్తోపాటు బీఎస్పీ కూడా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. ఎవరి విజయావకాశాలు ఎలా ఉన్నాయి? -
Mizoram Elections: ‘మిజో’ పోరులో విజేత ఎవరో?
మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖపోరు నెలకొంది. కాంగ్రెస్, ఎంఎన్పీ, జడ్పీఎమ్ మధ్య తీవ్ర పోటీ జరగనుంది. అయితే, ఎవరి విజయావకాశాలు ఎలా ఉన్నాయి? -
India map: భారత చిత్ర పటంలో శ్రీలంక ఎందుకుంటుంది?
Sri lanka: భారత చిత్రపటంలో శ్రీలంకను మీరు గమనించే ఉంటారు. ఇలా ఎందుకు చూపిస్తారో తెలుసా? -
Madhyapradesh Elections: కుటుంబాల మధ్య పోరులో విజయం ఎవరిదో?
మధ్యప్రదేశ్ ఎన్నికలు ఆసక్తికరంగా మారుతున్నాయి. పలుచోట్లు పార్టీల మధ్య పోటీ.. కుటుంబాల పోరుగా మారింది. -
Israel: ఇజ్రాయెల్.. ఈ చిన్న దేశం ఎంతో స్పెషల్!
కోటి మంది కూడా లేని ఒక దేశం ప్రపంచం మొత్తానికి అత్యాధునిక టెక్నాలజీని సరఫరా చేస్తోంది. ఈ చిన్న దేశంలో సాంస్కృతిక, చారిత్రక విశేషాలకు కొదవేలేదు. అవేంటో మీరే చదివేయండి.. -
Rajasthan Elections: భాజపా కంచుకోట ‘హాడౌతీ’.. ఈసారి ఎవరిదో?
రాజస్థాన్లోని హాడౌతీ ప్రాంతంపై భాజపా, కాంగ్రెస్ పార్టీలు కీలకంగా దృష్టి సారించాయి. ఈ ప్రాంతానికి ఎందుకంత ప్రాముఖ్యత? ఎవరి బలాలేంటి? -
Madhya Pradesh Elections: ద్విముఖ పోరులో సవాళ్లెన్నో..!
మధ్యప్రదేశ్లో ఎన్నికల వేడి రాజుకుంది. ఈ నేపథ్యంలో ప్రధాన పోటీదారులు కాంగ్రెస్, భాజపా ఎదుర్కోవాల్సిన ప్రధాన సమస్యలేంటి? -
Hezbollah: వీళ్ల దగ్గర లక్షకు పైగా రాకెట్లున్నాయి.. ఇజ్రాయెల్కు ‘హిజ్బుల్లా’ సవాల్!
ఇజ్రాయెల్కు హమాస్ కన్నా మరో పెద్ద సవాల్ ‘హిజ్బుల్లా’ రూపంలో పొంచివుంది. హిజ్బుల్లా వద్ద ప్రస్తుతం లక్షకు పైగా రాకెట్లు ఉన్నాయని ఇజ్రాయెల్ నిఘావర్గాల అంచనా. -
India-Pak War: 1965లో ‘పాక్ కమాండోలు’ ఆకాశం నుంచి ఊడిపడితే.. మనోళ్లు చితకబాదారు!
సైనిక బలగాలు, నిఘావ్యవస్థలు కలిగిన ఇజ్రాయెల్ హమాస్ మెరుపు దాడులతో ఉలిక్కిపడింది. అయితే ఇలాంటి దాడులు భారత్పై కూడా గతంలో జరిగాయి. -
Israel: ‘ఇనుప గుమ్మటం’లో పగుళ్లు.. ఎందుకిలా?
హమాస్ ఉగ్రవాదుల దాడులతో గాజా సరిహద్దులో ఉన్న ఇజ్రాయెల్ ప్రాంతం వణికిపోయింది. ఇజ్రాయెల్ ఎందుకు ఆత్మరక్షణలో పడిపోయిందన్న అంశాలను విశ్లేషిస్తే.. -
Hamas: ఇజ్రాయెల్పై రాకెట్ల వర్షం.. ఏంటీ ‘హమాస్’!
ఇజ్రాయెల్పై పాలస్తీనాకు చెందిన హమాస్ సంస్థ భారీ ఎత్తున దాడులు చేసింది. అసలు ఏంటీ ‘హమాస్’? -
Mohamed Muizzu: ముయిజ్జుతో జాగ్రత్త..
మాల్దీవుల ఎన్నికల్లో చైనా అనుకూలవాదిగా పేరొందిన మాజీ అధ్యక్షుడు యామిన్ సన్నిహితుడు మహ్మద్ ముయిజ్జు గెలుపొందారు. ఈ నేపథ్యంలో చైనా కదలికలు ఎలా ఉండబోతున్నాయి. -
Maldives : పర్యాటకుల మది దోచే మాల్దీవులు.. బుల్లి దేశం విశేషాలెన్నో!
హిందూ మహా సముద్రంలోని అతి చిన్న పర్యాటక దేశం మాల్దీవుల్లో (Maldives) ఎంతో వైవిధ్యం దాగుంది. ఆ దేశానికి సంబంధించిన వింతలు, విడ్డూరాల గురించి తెలుసుకోండి. -
Canada: నేను చేస్తే రైట్... నువ్వు చేస్తే రాంగ్..!
ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అడ్డుకుంటామని కెనడా తదితర దేశాలు చెబుతుంటాయి. అయితే, భారత్ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న ఖలిస్థాన్ ఉగ్రవాదులకు రెడ్కార్పెట్ వేసిన కెనడా వైఖరిని చూసి అంతర్జాతీయ సమాజం నివ్వెరపోతోంది. -
777 Movies in a year: ఏడాదిలో 777 సినిమాలు చూశాడు.. తర్వాత ఏమైందంటే?
అమెరికాకు చెందిన 32 ఏళ్ల వ్యక్తి ఒకే ఏడాదిలో 777 సినిమాలు చూశాడు. ఆ తర్వాత ఏమైందటే.. -
Glass Bridge: భారత్లోనే అతి పొడవైన గాజు వంతెన చూశారా?
Glass Bridge: కేరళలోని ఇడుక్కిలో గాజు వంతెన ప్రారంభమైంది. ఎత్తైన ప్రదేశం నుంచి ప్రకృతి సోయగాలను ఆస్వాదించేలా రూపొందించిన ఈ వంతెన ఆకట్టుకుంటోంది. -
Oppenheimer: అణుబాంబును సృష్టించి.. వినాశనానికి చలించి: ఓపెన్హైమర్ గురించి తెలుసా?
ఓ శాస్త్రవేత్త.. అణుబాంబు తయారుచేశాడు.. అది సృష్టించిన వినాశనాన్ని చూసి చలించిపోయాడు.. అణుశక్తి మానవ అభివృద్ధి కోసమేగానీ ప్రాణనష్టం కోసం కాదంటూ ప్రచారం చేశాడు. ఆయనే అణుబాంబు పితామహుడు జె.రాబర్ట్ ఓపెన్హైమర్ (Robert J Oppenheimer).


తాజా వార్తలు (Latest News)
-
Revanth Reddy: రేవంత్ ప్రమాణస్వీకారం.. నగరానికి చేరుకున్న సోనియా, రాహుల్
-
Telangana New Ministers: మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనుంది వీళ్లే..
-
Bapatla: ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఒక సిగ్గుమాలిన చర్య: చంద్రబాబు
-
Stock Market: నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 20,900 దిగువకు నిఫ్టీ
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని.. దివ్యాంగురాలు రజినికి రేవంత్ ప్రత్యేక ఆహ్వానం