కుడి - ఎడమ డ్రైవింగ్లో మతలబు!?
మన దేశంలో ఎడమ వైపు నుంచి డ్రైవింగ్ చేస్తుంటారనే విషయం అందరికీ తెలుసు. కొన్ని దేశాల్లో కుడి వైపు డ్రైవింగ్ ఉంటుంది. ఎడమవైపు డ్రైవింగ్ అలవాటు ఉన్న వ్యక్తులు.. కుడివైపు డ్రైవింగ్ చేసే దేశాల్లో వాహనం నడపాల్సి వస్తే చాలా జాగ్రత్త వహించాలి.
కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్.. అని ఓ సినీ కవి అన్నారు. కానీ డ్రైవింగ్ విషయంలో కుడి.. ఎడమ చూసుకోకపోతే ప్రమాదాలు జరిగే అవకాశముంది. మన దేశంలో ఎడమ వైపు నుంచి డ్రైవింగ్ చేస్తుంటారనే విషయం అందరికీ తెలుసు. కొన్ని దేశాల్లో కుడి వైపు డ్రైవింగ్ ఉంటుంది. ఎడమవైపు డ్రైవింగ్ అలవాటు ఉన్న వ్యక్తులు.. కుడివైపు డ్రైవింగ్ చేసే దేశాల్లో వాహనం నడపాల్సి వస్తే చాలా జాగ్రత్త వహించాలి. లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశముంది. గణాంకాల ప్రకారం.. 75 దేశాల్లో ఎడమవైపు.. 165 దేశాల్లో కుడివైపు డ్రైవింగ్ చేస్తారట. కానీ, ఎందుకలా? అన్ని దేశాల్లో ఒకేలా ఎందుకుండదు? అసలు ఈ కుడి.. ఎడమ డ్రైవింగ్ ఎలా మొదలైంది? వీటికి సమాధానం తెలియాలంటే.. కొన్ని శతాబ్దాల వెనక్కి వెళ్లాల్సిందే.
మొదట అంతా ఎడమవైపే
ప్రాచీన కాలం నుంచి అందరూ ఎడమ వైపు నుంచే ప్రయాణించేవారట. ఇందుకు కారణాలు.. ఆధారాలు ఉన్నాయి. ఒకప్పుడు రాజ్యాల్లో ఉండే సైనికులు గుర్రాలపైకి ఎడమవైపు నిలబడి ఎక్కేవాళ్లు. సైనికుల కత్తి ఒర ఎడమవైపు ఉంటుంది కాబట్టి.. కుడివైపు నుంచి ఎక్కడానికి వీలుకాదు. అదే ఎడమవైపు నుంచి అయితే.. ఇబ్బంది లేకుండా కుడి కాలు పైకి లేపి, గుర్రం ఎక్కొచ్చు. అంతేకాదు.. గుర్రాన్ని ఎడమవైపు నుంచి తీసుకెళ్లడం వల్ల ఒరలోంచి కత్తిని కుడిచేతితో సులభంగా తీసి శత్రువులతో యుద్ధం చేయడానికి, రాజుకు సెల్యూట్ చేయడానికి వీలు ఉండేది. అలా యజమానికి అనుగుణంగా గుర్రాలు కూడా ఎడమవైపు నుంచి వెళ్లడానికి అలవాటు పడ్డాయి. అలా రోమన్ సైనికులతోపాటు సామాన్య ప్రజలు కూడా వారి గుర్రాలను.. రథాలను ఎడమవైపు నుంచే నడిపించేవారు. క్రీస్తుశకం 1300లో పోప్ బెనిఫేస్ VIII రోమ్ను సందర్శించడానికి వచ్చే భక్తులందరూ ఎడమవైపే వాహనాలను నడపాలనే నిబంధన కూడా విధించాడని చరిత్రకారులు చెబుతున్నారు.
కుడివైపునకు మారిన ఫ్రాన్స్
ఫ్రాన్స్లో క్రీస్తుశకం 1700 కాలంలో రవాణా వ్యవస్థ అభివృద్ధి చెందింది. గుర్రాలకు చెక్కతో చేసిన పెద్ద పెద్ద డబ్బాలను కట్టి వస్తువులను ఇతర ప్రాంతాలకు తరలించేవారు. అయితే, ఆ సమయంలో గుర్రాలను నడిపించే డ్రైవర్కు ప్రత్యేకంగా సీటు ఏమీ ఉండేది కాదు. ఎడమవైపు ఉండే గుర్రంపై కూర్చొని కుడి చేత్తో కొరడా ఝుళిపిస్తూ బండిని తోలాల్సి ఉండేది. రోడ్డుకు ఎడమవైపున కూర్చోవడంతో వెనుక వచ్చే బండ్లను గమనించడం డ్రైవర్కు కష్టంగా మారింది. అందుకే గుర్రపు బండిని రోడ్డుకు కుడివైపు నుంచి తోలడం మొదలుపెట్టారు. దీంతో డ్రైవర్ రోడ్డు మధ్యలో నుంచి వెళ్తున్నట్లుగా ఉండేది. తన వెనక వచ్చే బండ్లను ఎడమ వైపు నుంచి ముందుకు పంపే వీలు కలిగేది. అయితే, సాధారణ గుర్రాలు ఎడమవైపు నుంచి.. గుర్రపు బండ్లు కుడివైపు నుంచి వెళ్తుండటంతో ప్రయాణం కాస్త గందరగోళంగా మారేది. ఇది గమనించిన ఫ్రాన్స్ ప్రభుత్వం అందరూ కుడివైపు నుంచే వెళ్లాలని 1792లో ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ బోనపార్ట్ కుడివైపు డ్రైవింగ్ను చట్టంగా మార్చారు.
నిర్ణయం మార్చుకోని బ్రిటన్
ఫ్రాన్స్లో కుడివైపు డ్రైవింగ్ మొదలు కావడంతో పొరుగు దేశాలు సైతం కుడివైపు డ్రైవింగ్ను అనుసరించడం మొదలుపెట్టాయి. కానీ బ్రిటన్ ఇందుకు నిరాకరించింది. ఎడమవైపు డ్రైవింగ్నే కొనసాగిస్తామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఎడమవైపు డ్రైవింగ్ను ప్రోత్సహించేందుకు 1773లో జనరల్ హైవే పేరుతో ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. కాలానుగుణంగా ఈ చట్టాన్ని 1835లో మరోసారి అమలు చేసింది.
బ్రిటన్తో కొన్ని.. ఫ్రాన్స్తో కొన్ని..
అత్యంత శక్తిమంతమైన దేశాలుగా ఉన్న బ్రిటన్.. ఫ్రాన్స్ అప్పటికే ఇతర దేశాలపై ఆధిపత్యం చలాయించడం మొదలుపెట్టాయి. దీంతో తమ అధీనంలో ఉన్న దేశాల్లో బ్రిటన్ ఎడమ వైపు డ్రైవింగ్.. ఫ్రాన్స్ కుడివైపు డ్రైవింగ్ను అమలు చేశాయి. అలా భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా సహా బ్రిటన్ పరిపాలించిన అనేక దేశాల్లో ఎడమ వైపు డ్రైవింగ్ కొనసాగుతోంది. జపాన్, ఇండోనేషియా, థాయ్లాండ్ వంటి ఆసియాలోని మరికొన్ని దేశాలు కూడా ఎడమవైపు డ్రైవింగ్ను అనుసరించాయి. అమెరికా, కెనడాలోనూ మొదట్లో ఎడమవైపు డ్రైవింగే ఉండేది. కానీ అక్కడి పెద్దరోడ్లు గుర్రపుబండ్లు తిరగడానికి వీలుగా ఉండటంతో ఫ్రాన్స్ మొదలుపెట్టిన కుడివైపు డ్రైవింగ్వైపే మొగ్గుచూపాయి. కాలక్రమంలో కార్లు, అనేక రకాల వాహనాలు వచ్చాయి. గుర్రపు బండి సూత్రం ప్రకారం.. డ్రైవర్ రోడ్డుకు మధ్యలో ఉండేవిధంగా.. ఎడమవైపు డ్రైవింగ్ కార్లలో కుడివైపు స్టీరింగ్, కుడివైపు డ్రైవింగ్ కార్లలో ఎడమవైపు స్టీరింగ్ ఉండటం గమనించొచ్చు.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి. -
Royal family: వందల కార్లు.. రూ.4వేల కోట్ల ప్యాలెస్: ఈ రాజ కుటుంబం హవానే వేరయా..!
విలాసవంతమైన రాజ భవనాలు, ప్రముఖ సంస్థల్లో పెట్టుబడులు, లండన్, పారిస్లో ఆస్తులు.. యూఏఈ రాజ కుటుంబం(royal family of Dubai) సంపద ఎంతో తెలుసా..?