PRO Jobs: పౌర సంబంధాల రంగంలో ఈ నైపుణ్యాలు ఉండాల్సిందే!
మీరో వస్తువు లేదా కార్యక్రమాన్ని ఆవిష్కరించారు. దాని గురించి ప్రజలకు తెలిసేదెలా? మీ వస్తువు/కార్యక్రమం గురించి ప్రజలు ఏం అనుకుంటున్నారో తెలుసుకునేదెలా? వీటికోసం ప్రతి సంస్థకూ పౌర సంబంధాల(పీఆర్) అధికారులు ఉంటారు. సంస్థ/ప్రభుత్వం ప్రజోపయోగ సమాచారం ప్రజలకు చేరేలా
ఇంటర్నెట్ డెస్క్: మీరు ఒక వస్తువు లేదా కార్యక్రమాన్ని ఆవిష్కరించారు. దాని గురించి ప్రజలకు తెలిసేదెలా? మీ వస్తువు/కార్యక్రమం గురించి ప్రజలు ఏం అనుకుంటున్నారో తెలుసుకునేదెలా? వీటికోసం ప్రతి సంస్థకూ పౌర సంబంధాల(పీఆర్) అధికారులు ఉంటారు. సంస్థ/ప్రభుత్వం ప్రజోపయోగ సమాచారం ప్రజలకు చేరేలా ప్రచారం చేయడంతోపాటు.. దానిపై ప్రజల అభిప్రాయాన్ని సేకరించి యాజమాన్యానికి చేరవేయడంలో పీఆర్ అధికారులదే ముఖ్యభూమిక. అందుకే పౌరసంబంధాల అధికారి(పీఆర్వో) ఉద్యోగాలకు అన్ని రకాల సంస్థలు, వ్యవస్థల్లో ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది. మరి మీరూ ఈ పీఆర్ రంగంలో అడుగుపెట్టాలనుకుంటున్నారా? అయితే, ఒక సంస్థ పీఆర్వో కావాలంటే కొన్ని కీలక నైపుణ్యాలు అవసరమవుతాయి. అవేంటంటే..
ఆకట్టుకునే కంటెంట్ రాయాలి
సంస్థ ప్రాజెక్టు ప్రచారానికి పీఆర్వో స్పష్టంగా.. సరళంగా అక్షరరూపం ఇవ్వగలగాలి. సందర్భాన్ని బట్టి.. సమయోచితంగా ఆకట్టుకునేలా విషయాన్ని రాయడం పీఆర్కు ఉండాల్సిన ముఖ్య లక్షణం.. నైపుణ్యం. అంతేకాదు.. రాసిన దాన్ని ఎదుటివాళ్లు ఎలా అర్థం చేసుకుంటారనే దానిపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది.
ఓపికతో వినాలి
సంస్థ ఒక కొత్త ప్రాజెక్టు తీసుకొచ్చినప్పుడు దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే.. ముందుగా ఆ ప్రాజెక్టు గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఇందుకోసం యాజమాన్యం చెప్పే ప్రతి విషయాన్ని శ్రద్ధగా వినాలి.. అర్థం చేసుకోవాలి. పీఆర్వో సంస్థకు కళ్లు.. చెవులులాంటివాడంటారు. సంస్థ చెప్పే విషయాల్ని తన చెవులతో విని.. ప్రపంచానికి తన కళ్లతో చూపించగలగాలి.
కమ్యూనికేషన్
సంస్థ యాజమాన్యానికి.. బయటి వ్యక్తులకు పీఆర్వో ఒక వారధిలా వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో యాజమాన్యాన్ని మెప్పించాలన్నా.. క్లయింట్స్/ప్రజలను ఆకట్టుకోవాలన్నా.. మాట్లాడే విధానం బాగుండాలి. అంటే.. కమ్యూనికేషన్ నైపుణ్యం అవసరమవుతాయి.
చురుకుదనం.. మల్టీ టాస్కింగ్
పీఆర్ అధికారి ఎంత చురుకుగా ఉంటే.. పనుల్లో ఫలితాలు అంత బాగుంటాయి. ఒక్కోసారి బహుళ సంఖ్యలో ప్రాజెక్టులు వస్తే.. మల్టీటాస్కింగ్ చేయాల్సి వస్తుంది. అయినా.. ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి. తోటి ఉద్యోగుల్లో ఉత్సాహం నింపుతూ వారితో పనిచేయించుకోగల సామర్థ్యం కావాలి.
సోషల్మీడియాపై పట్టు
ఈ టెక్ యుగంలో సోషల్మీడియాను ఉపయోగించని వ్యక్తులుండరు. అందుకే సోషల్మీడియా ఈ మధ్య మంచి ప్రచారసాధనంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో పీఆర్వోకి సోషల్మీడియాలో ప్రచారానికి డిజిటల్ కంటెంట్ను సృష్టించడంలో పట్టు ఉండటం తప్పనిసరి. ఎప్పటికప్పుడు మారే సోషల్మీడియా ట్రెండ్ను అనుసరిస్తూ.. కంటెంట్ను రూపొందించాలి. అయితే, సోషల్మీడియా వేదికలు భిన్నంగా ఉంటాయి. ఏ సోషల్మీడియాను ఏ విధంగా ఉపయోగించాలనే విషయంలో పీఆర్వోకి స్పష్టత ఉండాలి. ఉదాహరణకు యూట్యూబ్లాంటి వీడియో సోషల్ మీడియాలైతే వీడియో రూపంలో.. ఇన్స్టా, ఫేస్బుక్ లాంటి సోషల్మీడియా వేదికలపై ఫొటో, అక్షరాల రూపంలో కంటెంట్ను సృష్టించాల్సి ఉంటుంది.
పరిశోధన
ఏ ప్రాజెక్టుకైతే పీఆర్వోగా పనిచేస్తున్నారో ఆ ప్రాజెక్టు గురించి లోతుగా పరిశోధన చేయాలి. ఆ ప్రాజెక్టులాంటివే గతంలో ఏమైనా ఉన్నాయా? వాటికి ప్రచారం ఎలా జరిగింది? ప్రజల నుంచి ఎలాంటి అభిప్రాయం వ్యక్తమైంది. తాము చేపట్టిన ప్రాజెక్టులో పీఆర్వో విభాగం విజయవంతం కావాలంటే ఏం చేయాలనే దానిపై పరిశోధించి.. వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకోవాలి.
సమయపాలన
సంస్థ ఒక ప్రాజెక్టును చేపట్టే ముందు వాటి ఖర్చులను.. ఫలితాలు పొందే సమయాన్ని అంచనా వేస్తుంటుంది. అ సమయంలోపే యాజమాన్యం ఆశించిన మేరకు ప్రాజెక్టు గురించి ప్రచారం కల్పించి.. ఫలితాలను రాబట్టాల్సిన బాధ్యత పీఆర్వోపై ఉంటుంది. కాబట్టి అప్పగించిన పనిని ఇచ్చిన సమయంలో ఏ విధంగానైనా పూర్తి చేయాలి. ఇందుకోసం కొన్నిసార్లు స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చినా వెనకడుగు వేయకూడదు.
సృజనాత్మకత
చేసే పని సాదాసీదాగా ఉంటే.. ఎవరూ గుర్తించరు. వాటిలో భిన్నత్వం కనిపించాలి. సృజనాత్మకంగా ఉంటేనే ఎదుటివాళ్ల దృష్టిని మనవైపునకు తిప్పుకోగలం. లక్షిత ప్రజల్లోకి వెళ్లే ప్రచారం ఎంత భిన్నంగా.. ఆకర్షణీయంగా ఉంటే అంత ఆదరణ లభిస్తుంది. కాబట్టి పీఆర్వో ఎల్లప్పుడూ సృజనాత్మకంగా ఆలోచించాలి.
ఆలోచనలు అంతర్జాతీయ స్థాయి
ప్రపంచమే ఒక కుగ్రామంగా మారుతున్న నేపథ్యంలో ప్రాంతీయ వ్యాపారాలు కూడా దేశవిదేశాలకు విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పీఆర్వో ఆలోచనలు ఒక ప్రాంతానికీ పరితమయ్యేలా ఉండకూడదు. అవసరాలకు తగ్గట్టూ ప్రపంచస్థాయిలో రాణించగలగాలి. ఇందుకోసం విదేశాల్లో ఉన్న ట్రెండ్స్ కనిపెట్టి.. దానికి తగ్గట్టు వారి భాషలోనే సంస్థ గురించి ప్రచారం చేయాలి. ఈ క్రమంలో ఇతర భాషలపై కూడా కాస్త పట్టు సాధిస్తే గొప్ప ఫలితాలు సాధించగలరు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి. -
Royal family: వందల కార్లు.. రూ.4వేల కోట్ల ప్యాలెస్: ఈ రాజ కుటుంబం హవానే వేరయా..!
విలాసవంతమైన రాజ భవనాలు, ప్రముఖ సంస్థల్లో పెట్టుబడులు, లండన్, పారిస్లో ఆస్తులు.. యూఏఈ రాజ కుటుంబం(royal family of Dubai) సంపద ఎంతో తెలుసా..?
తాజా వార్తలు (Latest News)
-
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడి దుర్మరణం
-
బంగారం బిస్కెట్లుగా ఆలయాల ఆభరణాలు
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?