100 years old woman: బామ్మ మాట.. ‘వందేళ్ల’ బాట
జీవితాన్ని మరీ సీరియస్గా తీసుకోకండి. కచ్చితంగా వందేళ్లు బతుకుతారు
చిన్నప్పుడు రెండో ప్రపంచ యుద్ధం, యవ్వనంలో స్వాతంత్య్ర సమరం.. ఇక వృద్ధాప్యంలో ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి.. అన్నీ కళ్లారా చూశారు ఆ వందేళ్ల బామ్మ. జీవితానికి నిర్వచనం.. 100ఏళ్లు ఆరోగ్యంగా, ఆహ్లాదంగా ఉండటానికి ఆవిడ చెప్పే సూత్రాలు తెలిసినవే అయినా..ఆ బామ్మ ఉత్సాహంగా చెబుతుంటే నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆ బామ్మ ఇచ్చే సందేశాలను వీడియో రూపంలో ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ అనే పేజీ ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది.
‘‘హాయ్..! నాపేరు కమల.. నా వయసు 100 ఏళ్లు. నేను రెండో ప్రపంచ యుద్ధం కళ్లారా చూశా. స్వాతంత్ర్య సమరంలో పోరాడాను, ఆ తరువాత స్వాతంత్ర్య సంబరాల్లోనూ పాల్గొన్నా. ఇప్పుడు ప్రపంచాన్ని వణికించే కరోనా మహమ్మారిని ఎదుర్కొంటున్నాను.. ఇవన్నీ చూసి వచ్చిన నేను..మీరు వందేళ్లు ఆనందంగా ఎలా గడపాలో ఆ సీక్రెట్ చెబుతా వినండి’’
* ఎప్పుడైనా సరే ఓపెన్ మైండ్తో ఉండాలి. ఏ పరిస్థితి ఎదురైనా వెనకడుగు వేయకుండా అంగీకరించాలి.
* జీవితంలో మార్పులు జరుగుతుంటే భయపడకండి. వాటిని సమర్థవంతంగా ఎదుర్కోండి. కాలానికి తగ్గట్టు మారడం అలవరుచుకోండి.
* అప్పుడప్పుడు పిజ్జా తినండి. అందులో ఉండే కొన్ని కేలరీలు శరీరానికి మంచివి కూడా.
* రోజుకి 30 నిమిషాలు నడవండి.. అలాగే ధ్యానం చేయండి. ఈ విషయాల్లో నిర్లక్ష్యం చేయొద్దు.
* చుట్టూ ఉన్న జనాలు ఏవేవో అంటుంటారు. వాళ్లేమనకుంటారు.. వీళ్లేమనుకుంటారో అని.. వాటిని లెక్కచేయకండి.
* జీవితాన్ని మరీ సిరీయస్గా తీసుకోకండి. కచ్చితంగా వందేళ్లు బతుకుతారు.
కాగా ఈవీడియోని 75లక్షల మంది వీక్షించగా.. 3లక్షల పైగా లైకులతో ముందుకు దూసుకెళ్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీ, తెలంగాణకు సాగర్ నీటి విడుదలపై కేఆర్ఎంబీ ఉత్తర్వులు
వేసవిలో తాగునీటి అవసరాల కోసం కృష్ణానది యాజమాన్య బోర్డు నీటి విడుదల ఉత్తర్వులు జారీ చేసింది. -
గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం: వాతావరణ శాఖ
రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
భద్రాచలంలో కనులపండువగా శ్రీరామ మహా పట్టాభిషేకం
శ్రీరామ మహా పట్టాభిషేక మహోత్సవ వేడుకతో గురువారం భద్రగిరి దివ్యక్షేత్రం పులకించింది. వేద మంత్రోచ్ఛరణల మధ్య సింహాసనాన్ని అధిష్ఠించిన రామచంద్రుడు భక్తకోటికి నేనున్నానంటూ కొండంత అభయమిచ్చాడు. -
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
సీఎం జగన్పై రాయి దాడి వ్యవహారంపై విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలైంది. పోలీసుల అదుపులో ఉన్న ఆరుగురి వివరాలు తెలపాలంటూ న్యాయవాది సలీం ఈ పిటిషన్ వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ముంబయి గెలవాలంటే.. హార్దిక్ ఫామ్ అందుకోవడం అత్యవసరం: ఫించ్
-
తెదేపా అభ్యర్థులకు ఈనెల 21న బీఫామ్లు ఇవ్వనున్న చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
బేబీ ఫుడ్లో చక్కెర.. వివరణ ఇచ్చిన నెస్లే ఇండియా
-
మంగళగిరిలో నారా లోకేశ్ నామినేషన్.. తెదేపా శ్రేణుల భారీ ర్యాలీ
-
రామేశ్వరం కెఫే కేసులో నిందితులను పట్టించిన తప్పుడు ఐడీ..!