Andhra News: విశాఖలో అమానవీయ ఘటన.. పసికందు మృతదేహంతో 120కి.మీ స్కూటీపైనే
విశాఖ కేజీహెచ్ నుంచి 120 కిలోమీటర్లు స్కూటీపైనే పసికందు మృతదేహంతో తల్లిదండ్రులు ప్రయాణించిన ఘటన స్థానికులను కలచివేసింది.
పాడేరు పట్టణం: విశాఖ కేజీహెచ్లో దారుణం చోటు చేసుకుంది. కేజీహెచ్ నుంచి 120 కిలోమీటర్లు స్కూటీపైనే పసికందు మృతదేహంతో తల్లిదండ్రులు ప్రయాణించిన ఘటన స్థానికులను కలచివేసింది. బుధవారం సాయంత్రం అల్లూరి సీతారామరాజు జిల్లా ముత్యంకిపొట్టు మండలం కుముడ గ్రామానికి చెందిన గర్భిణిని విశాఖ కేజీహెచ్కు తీసుకువచ్చారు. గురువారం తెల్లవారుజామున విశాఖపట్నం కేజీహెచ్లో ఆమె ఆడ శిశువుకు జన్మనిచ్చింది. కొద్దిసేపటికే శ్వాస సంబంధిత సమస్యతో ఇబ్బందిపడి ఊపిరాడక శిశువు మృతి చెందింది.
శిశువు మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు అంబులెన్స్ ఇవ్వడానికి ఆసుపత్రి యాజమాన్యం నిరాకరించింది. అంబులెన్స్ కోసం ఎంత ప్రాధేయపడినా కేజీహెచ్ సిబ్బంది నుంచి స్పందన లేకపోవడంతో గత్యంతరం లేక తల్లిదండ్రులు స్కూటీపైనే పాడేరుకి పయనమయ్యారు. స్కూటీ మీద పాడేరు వరకు తల్లిదండ్రులు మృతదేహాన్ని తీసుకువచ్చారు. జిల్లా అదనపు వైద్యాధికారి లీలా ప్రసాద్ ఈ విషయం తెలుసుకొని పాడేరు నుంచి స్వగ్రామం కుమడకు అంబులెన్స్ ఏర్పాటు చేశారు. సమాచార లోపంతో ఇలా జరిగిందని.. అధికారులను సంప్రదిస్తే అంబులెన్స్ ఏర్పాటు చేసేవాళ్లమని లీలాప్రసాద్ తెలిపారు. తల్లిదండ్రులకు అంబులెన్స్ నమోదు ప్రక్రియ తెలియలేదని వివరణ ఇచ్చారు. కేజీహెచ్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డను కోల్పోయామని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సుమారు 30 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా