MP: కొవిడ్ నిబంధనలు బేఖాతరు.. కోతి అంత్యక్రియలకు 1500 మంది హాజరు
ఉత్తరప్రదేశ్లోని ఓ గ్రామంలో కోతి మృతిచెందగా.. దాని అంత్యక్రియలకు భారీ సంఖ్యలో జనం హాజరవడం చర్చనీయాంశంగా మారింది......
భోపాల్: ఉత్తరప్రదేశ్లోని ఓ గ్రామంలో కోతి మృతిచెందగా.. దాని అంత్యక్రియలకు భారీ సంఖ్యలో జనం హాజరవడం చర్చనీయాంశంగా మారింది. కరోనా నిబంధనలను ఉల్లంగిస్తూ.. ఏకంగా 1500 మంది అంత్యక్రియలకు హాజరవడం గమనార్హం. ఇందుకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
రాజ్గఢ్ జిల్లా దాలుపురా గ్రామంలో ఓ వానరం మృతి చెందగా గత నెల 29వ తేదీన దానికి సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు. హరిసింగ్ అనే ఓ వ్యక్తి ఏకంగా గుండు చేయించుకొని కోతికి దహన సంస్కారాలు నిర్వహించాడు. ఇంతటితో ఆగకుండా గ్రామస్థులందరూ డబ్బు పోగేసుకొని 1500 మందికి సరిపడా భోజనాలు వండి, వడ్డించారు. ఈ కార్యక్రమంలో మహిళలు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కొద్ది రోజుల క్రితమే ప్రభుత్వ పలు నిబంధనలు విధించింది. ఈ నేపథ్యంలోనే ఈ ఘటన జరగడంతో పోలీసులు రంగంలోకి దిగారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించడం కింద కేసులు నమోదు చేసి.. అంత్యక్రియలు నిర్వహించడంలో ప్రధాన పాత్ర పోషించిన ఇద్దరిని అరెస్టు చేశారు. మరికొందరిపై చర్యలకు ఉపక్రమిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా