అట్టహాసంగా నూతన సంవత్సర వేడుకలు

 2020కి ముగింపు పలుకుతూ 2021కి స్వాగతం అంటూ.. దేశవ్యాప్తంగా ప్రజలు నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. నగరాలు, పట్టణాలు, పల్లెల్లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా సాగాయి. ప్రజలు టపాసులు కాల్చుతూ అట్టహాసంగా వేడుకలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు 

Updated : 01 Jan 2021 03:51 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: 2020కి ముగింపు పలుకుతూ 2021కి స్వాగతం అంటూ.. దేశవ్యాప్తంగా ప్రజలు నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. నగరాలు, పట్టణాలు, పల్లెల్లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా సాగాయి. ప్రజలు టపాసులు కాల్చుతూ అట్టహాసంగా వేడుకలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కేకులు కోసి ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ప్రధాన నగరాలు, పట్టణాలు మిరుమిట్లు గొలిపే బాణసంచా వెలుగుల్లో మెరిసిపోతున్నాయి. నూతన సంవత్సర సందర్భంగా దేశ ప్రజలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంతులు కేసీఆర్‌, జగన్‌మోహన్‌రెడ్డి, పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు చెప్పారు. 

ఇదీ చదవండి..

నూతన అవకాశాల సంవత్సరమిది!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని