ధాన్యం సేకరణలో పెరుగుదల
దేశవ్యాప్తంగా గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఖరీఫ్ సీజనులో కేంద్ర ప్రభుత్వ శాఖ 23 శాతం మేర అధికంగా ధాన్యం సేకరించింది. ఈ విషయాన్ని ఆహారం, ప్రజా పంపిణీ విభాగం కార్యదర్శి
న్యూదిల్లీ : దేశవ్యాప్తంగా గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఖరీఫ్ సీజనులో కేంద్ర ప్రభుత్వ శాఖ 23 శాతం మేర అధికంగా ధాన్యం సేకరించింది. ఈ విషయాన్ని ఆహారం, ప్రజా పంపిణీ విభాగం కార్యదర్శి సుధన్సు పాండే బుధవారం తెలిపారు. ధాన్యం సేకరణ గురించి మీడియాతో మాట్లాడిన ఆయన పలు విషయాలు వెల్లడించారు. 2020 ఖరీఫ్ మార్కెటింగ్ సీజను సెప్టెంబరు 26న ప్రారంభమైనట్లు తెలిపారు. గతేడాది ఇదే సీజనులో 627 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా.. ప్రస్తుతం 738 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగినట్లు వివరించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలను సైతం 28 శాతం మేర ఈ ఏడాది పెంచినట్లు పాండే తెలిపారు. గతేడాది 30,549 కేంద్రాల ద్వారా దేశవ్యాప్తంగా ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. ఈ ఏడాది ఆ కేంద్రాలను 39,130కి పెంచినట్లు కార్యదర్శి పాండే వెల్లడించారు. సేకరించిన ధాన్యానికి గానూ రైతులకు 1.40లక్షల కోట్లు చెల్లించినట్లు ఆయన పేర్కొన్నారు. గతేడాది ఇది 1.15 లక్షల కోట్లుగా ఉన్నట్లు అధికారి వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
-
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
-
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు.. కానీ: అనసూయ