ఆక్సిజన్ బండి @ 25 వేల టన్నులు
గమ్య స్థానాలకు చేరుస్తూ దేశ ప్రజలకు ఎన్నో ఏళ్లుగా విలువైన సేవలందిస్తోంది భారత రైల్వే. దేశాన్ని కొవిడ్ మహమ్మారి వణికిస్తున్న ప్రస్తుత తరుణంలో రోగులకు అత్యవసరమైన ప్రాణవాయువును సరఫరా చేసే బాధ్యతను సైతం తలకెత్తుకుంది.
దిల్లీ: గమ్య స్థానాలకు చేరుస్తూ దేశ ప్రజలకు ఎన్నో ఏళ్లుగా విలువైన సేవలందిస్తున్న భారతీయ రైల్వే.. కొవిడ్ మహమ్మారి వణికిస్తున్న ప్రస్తుత తరుణంలో రోగులకు అత్యవసరమైన ప్రాణవాయువును సరఫరా చేసే బాధ్యతను సైతం తలకెత్తుకుంది. ఎంతోమందికి ఊపిరి పోసిన రైల్వే.. తాజాగా ఓ అరుదైన మైలురాయిని చేరుకుంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 25,629 టన్నుల ద్రవరూప మెడికల్ ఆక్పిజన్ను సరఫరా చేసిన ఘనతను దక్కించుకుంది. కరోనా కాలంలో 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 39 నగరాలకు 1500 పైగా ట్యాంకర్లలో ఆక్సిజన్ సరఫరా చేసినట్టు రైల్వే శనివారం వెల్లడించింది. ఇప్పటి వరకు 368 ఆక్సిజన్ ఎక్స్ప్రెస్లు పలు రాష్ట్రాలకు ఆక్సిజన్ ట్యాంకర్లను చేరవేయగా.. మరో 482 టన్నుల ప్రాణవాయువును నింపుకొన్న 30 ట్యాంకర్లను గమ్య స్థానాలకు చేరవేసేందుకు ఏడు రైళ్లు పయనమైనట్లు తెలిపింది.
ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ల ద్వారా రైల్వే ఇప్పటివరకు ఉత్తరాఖండ్కు 320, కర్ణాటకకు 3,097, మహారాష్ట్రకు 614, మధ్యప్రదేశ్కు 656, ఆంధ్రప్రదేశ్కు 2,602, రాజస్థాన్కు 98, తమిళనాడుకు 2,787, హరియాణాకు 2,212, తెలంగాణకు 2,474, పంజాబ్కు 225, కేరళకు 513, దిల్లీకి 5,790, ఉత్తర్ప్రదేశ్కు 3,797, ఝార్ఖండ్కు 38, అసోంకు 400 టన్నుల ఆక్సిజన్ను సరఫరా చేసింది. భారతీయ రైల్వే పశ్చిమాన హపా, బరోడా, ముంద్రా; తూర్పున రూర్కెలా, దుర్గాపూర్, టాటానగర్, అంగుల్ వంటి ప్రదేశాల నుంచి ఆక్సిజన్ను తీసుకొని, ఆపై దానిని ఉత్తరాఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, హరియాణా, తెలంగాణ, పంజాబ్, కేరళ, దిల్లీ, ఉత్తర్ప్రదేశ్, అసోం రాష్ట్రాలకు పంపిణీ చేస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే