Anantapur: అనంతపురం జిల్లా.. ఒకే గ్రామంలో 31 మందికి అస్వస్థత
అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం బేలోడు గ్రామంలో పలువురు అస్వస్థతకు గురయ్యారు. సోమవారం రాత్రి నుంచి ఇప్పటివరకు 31 మంది వాంతులు, విరేచనాలు తదితర కారణాలతో ఆస్పత్రిలో చేరారు.
రాయదుర్గం: అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం బేలోడు గ్రామంలో పలువురు అస్వస్థతకు గురయ్యారు. సోమవారం రాత్రి నుంచి ఇప్పటివరకు 31 మంది వాంతులు, విరేచనాలు తదితర కారణాలతో ఆస్పత్రిలో చేరారు. వారిలో కరియమ్మ (75) అనే వృద్ధురాలు మృతిచెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని అనంతపురం జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసులు పెరుగుతుండటంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు గ్రామాన్ని సందర్శించిన గ్రామీణ నీటి సరఫరా, వైద్య శాఖ అధికారులు తాగునీటిలో ఎటువంటి సమస్య లేదని తేల్చి చెబుతున్నారు. అయితే గంటగంటకు కేసులు పెరుగుతుండటంతో ఏం చేయాలో తోచక గ్రామస్థులు బిక్కుబిక్కుమంటున్నారు.
గ్రామంలోని బీసీ కాలనీ కింది వీధిలో సుమారు 100 కుటుంబాలు నివాసముంటున్నాయి. ఈ ప్రాంతానికి తాగునీరు సక్రమంగా సరఫరా కాకపోవడంతో కుళాయిల చుట్టూ రెండు మూడు అడుగుల మేర గుంతలు తవ్వుకున్నారు. ఆదివారం రాత్రి, సోమవారం సాయంత్రం కురిసిన వర్షానికి వరద నీరు కుళాయిల్లో ఇంకిపోయింది. సోమవారం యథావిధిగా తాగునీటిని సరఫరా చేశారు. ఈ విషయాన్ని గమనించకుండా ఆ నీటిని తాగడంతోనే గ్రామస్థులకు వాంతులు, విరేచనాలవుతున్నట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
హంతకులకు ఓటు వేయవద్దని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది. -
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)కి ఊరట లభించింది. -
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 100 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203