ఈ చేపలతో జాలర్లకు కాసుల పంట.. కిలో ₹13వేలు!
అత్యంత అరుదైన రకానికి చెందిన తెలియా భోలా చేపలతో దిఘా మత్యకార సొసైటీకి పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరింది. మంగళవారం 10మంది జాలర్లు సముద్రంలో .......
దిఘా: బెంగాల్లోని దిఘా మత్స్యకారులకు కాసుల పంట పండింది. అత్యంత అరుదైన రకానికి చెందిన తెలియా భోలా చేపలతో దిఘా మత్యకార సొసైటీకి పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరింది. మంగళవారం 10 మంది జాలర్లు సముద్రంలో వేటకు వెళ్లగా వారి వలకు ఏకంగా 33 తెలియా భోలా చేపలు చిక్కాయి. దీంతో తమ సంఘం కార్యాలయం వద్ద వేలం వేయగా రికార్డు స్థాయిలో రూ.1.40 కోట్ల ధర పలికాయి.
వివరాల్లోకి వెళ్తే.. బెంగాల్లోని తూర్పుమేదినీపూర్ జిల్లా దిఘా ప్రాంతంలో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. అయితే, అనూహ్యంగా వారి వలకు ఈ అరుదైన రకానికి చెందిన భారీ చేపలు చిక్కాయి. ఒక్కో చేప బరువు 33 నుంచి 35కిలోల వరకు ఉన్నట్టు మత్స్యకారులు చెబుతున్నారు. ఈ చేపల్ని మెడికల్ క్యాప్సూల్స్ కవర్ల తయారీలో వాడటంతో వీటికి భారీ గిరాకీ ఉంటుంది. వీటి కోసం కొనుగోలుదారులు ఎగబడుతుంటారు. తమకు దొరికిన చేపల్ని వేలం వేయగా.. ఓ ఫార్మా కంపెనీ మొత్తం చేపల్ని దాదాపు రూ.1.4కోట్లకు కొనుగోలు చేసినట్టు మత్స్యకారులు వివరించారు. మొత్తం చేపల్ని కిలో రూ.13వేలకు చొప్పున విక్రయించినట్టు తెలిపారు. ఈ రకం చేపలు ఒక పట్టాన జాలర్లకు వలకు చిక్కవని, నడి సముద్రంలో సమూహాలుగా తిరుగుతాయని, కొన్నిసార్లు సమూహాల నుంచి విడిపోయినప్పుడు మాత్రమే ఇలా వలకు చిక్కుతాయని వివరించారు. ఈ చేపకు ఉన్నంత డిమాండ్ వీటి గుడ్లకు ఉండదని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సుమారు 30 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా