జీఎస్టీ రుణాలు: మరో ₹6 వేల కోట్లు విడుదల

జీఎస్టీ పరిహారం కింద మరో దఫా రాష్ట్రాలకు కేంద్రం రుణాలు విడుదల చేసింది. 12వ విడతగా రూ.6వేల కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో.

Published : 19 Jan 2021 00:08 IST

దిల్లీ: జీఎస్టీ పరిహారం కింద మరో దఫా రాష్ట్రాలకు కేంద్రం రుణాలు విడుదల చేసింది. 12వ విడతగా రూ.6వేల కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో ఇప్పటి వరకు విడుదల చేసిన రుణ మొత్తం రూ.72వేల కోట్లకు చేరింది. ఇప్పటి వరకు విడుదల చేసిన రుణాల్లో ఏపీకి రూ.1648.89 కోట్లు, తెలంగాణకు రూ.1206.87 కోట్లు దక్కాయి. జీఎస్టీ అమలు కారణంగా ఏర్పడిన రూ.1.10 లక్షల కోట్ల లోటును భర్తీ చేసేందుకు స్పెషల్‌ బారోయింగ్‌ విండోను కేంద్రం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీని ద్వారా అక్టోబర్‌ నుంచి విడతల వారీగా రాష్ట్రాలకు కేంద్రం రుణాలను విడుదల చేస్తోంది. ఇప్పటి వరకు 65 శాతం రుణ పంపిణీ పూర్తయినట్లు తెలిపింది.

ఇవీ చదవండి..
రేపు కాళేశ్వరం పర్యటనకు సీఎం కేసీఆర్‌
రేపు దిల్లీ వెళ్లనున్న ఏపీ సీఎం జగన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని