Unemployment: నిరుద్యోగ భారతం.. మూడేళ్లలో 9వేల మంది ఆత్మహత్య
నిరుద్యోగం కారణంగా గడిచిన మూడేళ్లలో దేశంలో 9140 మంది బలవంతంగా ప్రాణాలు తీసుకున్నట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది.
కేంద్ర హోంశాఖ వెల్లడి
దిల్లీ: దేశవ్యాప్తంగా పలు సమస్యల కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిసంఖ్య ప్రతిఏటా పెరుగుతూనే ఉంది. వ్యాపారాల్లో నష్టం లేదా రుణభారం కారణంగా దేశంలో గడిచిన మూడేళ్ల కాలంలోనే 16వేల మంది ప్రాణాలు తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అంతేకాకుండా నిరుద్యోగం కారణంగా మూడేళ్లలో 9140 మంది బలవంతంగా ప్రాణాలు తీసుకున్నట్లు పేర్కొంది. వివిధ కారణాల వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్న అంశంపై రాజ్యసభ సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ ఈ వివరాలు వెల్లడించారు.
రుణభారం కారణంగా దేశవ్యాప్తంగా ఒక్క 2020లోనే 5213 మంది ఆత్మహత్యకు పాల్పడగా, 2019లో 5908 మంది, 2018లో 4970 మంది బలవంతంగా ప్రాణాలు తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇక నిరుద్యోగం కారణంగా 2020లో 3548 మంది ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపింది. అంతకుముందు 2019లో 2851 మంది, 2018లో 2741 మంది నిరుద్యోగం కారణంగా బలవంతంగా ప్రాణాలు తీసుకున్నట్లు కేంద్ర హోంశాఖ లిఖితపూర్వక సమాధానంలో పేర్కొంది.
1900 ఎన్జీవోల లైసెన్సు రద్దు..
గడిచిన ఐదేళ్లలో నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా 1900 ఎన్జీవోల ఎఫ్సీఆర్ఏ రిజిస్ట్రేషన్లను రద్దు చేసినట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (FCRA) 2010 ప్రకారం ఎన్జీవోలను బ్లాక్లిస్టులో పెట్టే అవకాశం లేనప్పటికీ.. ఏదైనా స్వచ్ఛంద సంస్థ నియమ, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే తగిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. అయితే, ప్రభుత్వ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని ఏదైనా ఎన్జీవో కేంద్ర హోంశాఖను సంప్రదిస్తే.. వాటిని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?