ఏపీఎస్పీ కమాండెంట్ ఇళ్లలో ఏసీబీ సోదాలు
ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలపై కాకినాడ ఏపీఎస్పీ అసిస్టెంట్ కమాండెంట్ శంకర్ ఇళ్లలో అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ)
తిరుపతి: ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలపై కాకినాడ ఏపీఎస్పీ అసిస్టెంట్ కమాండెంట్ శంకర్ ఇళ్లలో అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారుల సోదాలు చేస్తున్నారు. అక్రమాస్తులు ఉన్నాయనే సమాచారంతో తిరుపతిలోని ఆయన నివాసంతో పాటు బంధువుల ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. అక్రమంగా స్థిర, చరాస్తులు ఆర్జించారనే సమాచారంపై తిరుచానూరు, సోమల, పలమనేరు, బైరెడ్డిపల్లె, రాజంపేట, తాడిపత్రి, హైదరాబాద్లోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. చిత్తూరు జిల్లా సోమల మండలం మినికిలో ఉన్న 50 ఎకరాల పౌల్ట్రీఫామ్పై ఆరా తీస్తున్నారు. ఈ వ్యవహారంలో ఏకకాలంలో 13 చోట్ల సోదాలు జరుగుతున్నాయని ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. అక్రమాస్తుల విలువ సుమారు రూ.4కోట్లు ఉంటుందని భావిస్తున్నట్లు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
-
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
-
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
-
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
-
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా