నేడు దిల్లీకి ఏపీ సీఎం జగన్‌

ఏపీ సీఎం జగన్‌ మంగళవారం దిల్లీ వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు అమరావతి నుంచి బయల్దేరనున్న ఆయన సాయంత్రం 4.15 గంటలకు దిల్లీ చేరుకోనున్నారు. హస్తిన పర్యటనలో భాగంగా పలువురు కేంద్రమంత్రులతో

Published : 15 Dec 2020 02:19 IST

అమరావతి: ఏపీ సీఎం జగన్‌ మంగళవారం దిల్లీ వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు అమరావతి నుంచి బయల్దేరనున్న ఆయన సాయంత్రం 4.15 గంటలకు దిల్లీ చేరుకోనున్నారు. హస్తిన పర్యటనలో భాగంగా పలువురు కేంద్రమంత్రులతో జగన్‌ సమావేశమయ్యే అవకాశముంది. ముఖ్యంగా కేంద్రహోంమంత్రి అమిత్‌షాతో సీఎం భేటీ కానున్నట్లు తెలుస్తోంది. రాత్రి 9 గంటలకు ఆయన్ను కలవనున్నట్లు సమాచారం. విభజన చట్టంలో పేర్కొన్న హామీల అమలు, పోలవరం నిధులు తదితర అంశాలతో పాటు తాజా రాజకీయ పరిస్థితులపైనా అమిత్‌షాతో సీఎం జగన్‌ చర్చించే అవకాశముంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని