ఎస్పీ బాలుకి భారతరత్న ఇవ్వండి: సీఎం జగన్
ఇటీవల మృతిచెందిన సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు భారతరత్న పురస్కారం ప్రకటించాలని ఏపీ సీఎం జగన్ కోరారు.
ప్రధాని మోదీకి లేఖ
అమరావతి: ఇటీవల మృతిచెందిన సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు భారతరత్న పురస్కారం ప్రకటించాలని ఏపీ సీఎం జగన్ కోరారు. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. భారత సినీ పరిశ్రమకు ఎస్పీ బాలు విశేష సేవలు అందించారని జగన్ గుర్తు చేశారు. మాతృభాష తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఆయన 40వేలకు పైగా పాటలు పాడారని పేర్కొన్నారు. ఉత్తమ నేపథ్య గాయకుడిగా ఆరు సార్లు జాతీయ అవార్డులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 25 నంది పురస్కారాలు అందుకున్నారన్నారు. ఫిల్మ్ఫేర్ అవార్డులతో పాటు ఇతర రాష్ట్ర ప్రభుత్వాల పురస్కారాలూ ఎస్పీ బాలును వరించాయని సీఎం లేఖలో వివరించారు. కేంద్ర ప్రభుత్వం 2001లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్ పురస్కారాలు ఎస్పీబీకి అందజేసిందని జగన్ గుర్తు చేశారు. సంగీతానికి ఆయన అందించిన విశేష సేవలకు గుర్తుగా భారతరత్న పురస్కారాన్ని ప్రకటించాలని ప్రధానిని జగన్ కోరారు.
ఎస్పీ బాలు సేవలకు గుర్తుగా ఆయన సొంత జిల్లా నెల్లూరులో సంగీత వర్సిటీ ఏర్పాటు చేయాలని తెదేపా అధినేత చంద్రబాబు ఏపీ ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే. ఈరోజు చెన్నైలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీబీ తనయుడు ఎస్పీ చరణ్ మాట్లాడుతూ తన తండ్రి చేసిన సేవలకు భారతరత్న ఇస్తే బావుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు ఎస్పీబీకి భారతరత్న ప్రకటించాలంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సందేశాలు వైరల్ అవుతున్నాయి. ఆయన సేవలను గుర్తించాలని అభిమానులు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వినాసికారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
-
నటుడు మన్సూర్ అలీఖాన్కు అస్వస్థత.. పండ్లరసంలో విషం కలిపారని ఆరోపణ
-
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
-
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’
-
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
-
గులకరాయికి.. రాజకీయ రంగు!