ఏపీ ఎస్‌ఈసీతో సీఎస్‌ నీలం సాహ్ని భేటీ

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌తో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) నీలం సాహ్ని సమావేశయ్యారు.

Updated : 28 Oct 2020 16:26 IST

విజయవాడ: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌తో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) నీలం సాహ్ని సమావేశయ్యారు. స్థానిక ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం తెలపాలని ఎస్‌ఈసీ కోరిన నేపథ్యంలో సీఎస్‌ ఆయనతో భేటీ అయ్యారు. ఒకవేళ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తే రాష్ట్ర ప్రభుత్వ సన్నద్ధత తదితర అంశాలపై చర్చ జరిగే అవకాశముంది. మంగళవారం రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖల అధికారులతో ఎస్‌ఈసీ సమావేశమై రాష్ట్రంలో కొవిడ్‌ పరిస్థితులపై చర్చించారు.

ఈ ఉదయం వివిధ రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించిన ఎస్‌ఈసీ.. స్థానిక ఎన్నికలపై వారి అభిప్రాయం తెలుసుకున్నారు. సంప్రదింపుల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం గొప్పగా భావిస్తోందని రాజకీయ పార్టీలతో సమావేశం అనంతరం ఎస్‌ఈసీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తమ అభిప్రాయం చెప్పాలని కోరారు.

ఇదీ చదవండి..

ఏపీలో స్థానిక ఎన్నికలపై అభిప్రాయ సేకరణ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని