
అంతర్వేది అగ్నిప్రమాదంపై స్పందించిన డీజీపీ
అమరావతి: తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చెందిన రథం దగ్ధమైన ఘటనపై డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. సంఘటన జరిగిన వెంటనే పోలీసులు స్పందించారని చెప్పారు. అగ్నిమాపక శాఖ డైరెక్టర్ ఆధ్వర్యంలోని ఓ బృందం ఘటనాస్థలానికి చేరుకుని తక్షణమే ఆ మంటలను అదుపులోకి తీసుకొచ్చిందన్నారు. ఈ మేరకు డీజీపీ ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లా ఎస్పీ, ఏలూరు డీఐజీ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారన్నారు. విజయవాడ నుంచి ఫొరెన్సిక్ డైరెక్టర్ నేతృత్వంలో నిపుణుల బృందం ఘటనాస్థలానికి బయల్దేరిందని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పూర్తిస్థాయి సాక్ష్యాధారాలను సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారని డీజీపీ పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.