అగ్రిగోల్డ్‌ కేసు: డబ్బులు చెల్లించొచ్చు

అగ్రిగోల్డ్‌లో రూ.20వేల లోపు డిపాజిట్ చేసిన వారికి డబ్బులు చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు అనుమతిచ్చింది. ఏపీ డిపాజిటర్లకు ఏపీ ప్రభుత్వం సొమ్ము చెల్లిస్తే అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. వార్డు సచివాలయం ద్వారా సీఐడీ సీఐ డిపాజిట్‌దారుల వివరాలు సేకరిస్తారని ఏపీ ప్రభుత్వం...

Published : 09 Nov 2020 14:17 IST

అనుమతిచ్చిన తెలంగాణ హైకోర్టు

హైదరాబాద్‌: అగ్రిగోల్డ్‌లో రూ.20వేల లోపు డిపాజిట్ చేసిన వారికి డబ్బులు చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు అనుమతిచ్చింది. ఏపీ డిపాజిటర్లకు ఏపీ ప్రభుత్వం సొమ్ము చెల్లిస్తే అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. వార్డు సచివాలయం ద్వారా సీఐడీ సీఐ డిపాజిట్‌దారుల వివరాలు సేకరిస్తారని ఏపీ ప్రభుత్వం న్యాయస్థానానికి తెలిపింది. సేకరించిన వివరాలను సీఐడీ డీఎస్పీ, ఆర్డీవో పరిశీలిస్తారని, జిల్లా న్యాసేవాధికార సంస్థ కార్యదర్శి, కలెక్టర్‌, సీఐడీ ఎస్పీ దరఖాస్తులు ధ్రువీకరిస్తారని న్యాయస్థానానికి తెలిపింది. కలెక్టరేట్‌ ద్వారా అర్హులైన డిపాజిటర్ల బ్యాంకు ఖాతాల్లో జమచేస్తామని కోర్టుకు తెలిపింది. వాదనలు విన్న ధర్మాసనం మార్చి 31 నాటికి పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అగ్రిగోల్డ్‌ కేసును ఏపీ ప్రభుత్వానికి బదిలీ చేయాలన్న ప్రభుత్వం పిటిషన్‌పైనా న్యాయస్థానం విచారణ చేపట్టింది. బదిలీ చేసే పాలన అధికారం తెలంగాణ హైకోర్టు సీజేకు ఉంటుందని ధర్మాసనం తెలిపింది. అనంతరం కేసు విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని