త్వరలో డీఎస్సీ-2020 నోటిఫికేషన్‌!

డీఎస్సీ-2018లో ఉత్తీర్ణులైన ఎస్జీటీ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దీనిపై కోర్టుల్లో ఉన్న వివాదం పరిష్కారమైందని.. 3,524 పోస్టులకు నియామక ప్రక్రియ మొదలుపెట్టినట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు...

Updated : 22 Sep 2020 21:15 IST

వచ్చే అవకాశముందన్న ఏపీ మంత్రి సురేశ్‌

అమరావతి: డీఎస్సీ-2018లో ఉత్తీర్ణులైన ఎస్జీటీ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దీనిపై కోర్టుల్లో ఉన్న వివాదం పరిష్కారమైందని.. 3,524 పోస్టులకు నియామక ప్రక్రియ మొదలుపెట్టినట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే సుమారు 2,200పైగా అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేశామన్నారు.

ఈనెల 24న ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని చెప్పారు. అనంతరం వారికి నియామక ఉత్తర్వులు అందజేస్తామన్నారు. టెట్‌ సిలబస్‌ను ఆధునీకరించి పరీక్ష నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు. త్వరలో డీఎస్సీ-2020 నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశముందని మంత్రి తెలిపారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని