ప్రభుత్వం నుంచి నిధులు రావట్లేదు: నిమ్మగడ్డ
రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేశ్కుమార్ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల సంఘం నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు రాక ఇబ్బందులు పడుతున్నట్లు ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. ఎస్ఈసీ వ్యవహారంలో ప్రభుత్వ వైఖరిని గమనిస్తున్నామని
ఏపీ హైకోర్టును ఆశ్రయించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్
అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేశ్కుమార్ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల సంఘం నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు రాక ఇబ్బందులు పడుతున్నట్లు ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. ఎస్ఈసీ వ్యవహారంలో ప్రభుత్వ వైఖరిని గమనిస్తున్నామని ఈ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఏదైనా అవసరం ఉంటే ఎస్ఈసీ తమను సంప్రదించాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది సూచించగా.. తాము గమనిస్తే తప్పేంటని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వ వైఖరితో ఎస్ఈసీ హైకోర్టును ఆశ్రయించాల్సి రావడం బాధాకరమని ఈ సందర్భంగా న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం చెబుతున్న ఇబ్బందులపై సవివరమైన అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఎస్ఈసీ తరఫున సీతారామమూర్తి, అశ్వినీకుమార్ వాదనలు వినిపించారు. మరోవైపు ఈ వ్యవహారంలో నిమ్మగడ్డ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రూ.39లక్షల నిధులు విడుదల చేయడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
-
కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?