ఏపీ సీఎస్‌కు నిమ్మగడ్డ మరో లేఖ

ఏపీ సీఎస్‌ నీలం సాహ్నికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ మరో లేఖ రాశారు. ఇటీవల హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆయన తన లేఖలో ప్రస్తావించారు.  రాజ్యాంగబద్ధ సంస్థలకు

Updated : 24 Nov 2020 10:40 IST

అమరావతి: ఏపీ సీఎస్‌ నీలం సాహ్నికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ మరో లేఖ రాశారు. ఇటీవల హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆయన తన లేఖలో ప్రస్తావించారు. రాజ్యాంగబద్ధ సంస్థలకు ప్రభుత్వం సహకరించాలని.. ఎన్నికల నిర్వహణ, కమిషన్‌ విధి నిర్వహణలో ప్రభుత్వ సహకారం తప్పనిసరిగా ఉండాలని హైకోర్టు పేర్కొంది. ప్రభుత్వ సహకారంపై తమకు మళ్లీ నివేదిక సమర్పించాలని ఎస్‌ఈసీని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ నేపథ్యంలో సీఎస్‌కు నిమ్మగడ్డ ఇదే విషయంపై లేఖ రాసి హైకోర్టు ఆదేశాల ప్రతిని దానికి జత చేశారు. దీనిపై ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు