స్పీకర్ తమ్మినేనికి తృటిలో తప్పిన ప్రమాదం
ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్కు తృటిలో ప్రమాదం తప్పింది.
ఆమదాలవలస: ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేనికి తృటిలో ప్రమాదం తప్పింది. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం వంజంగి గ్రామం వద్ద ఆటోను తప్పించబోయి కారు కాల్వలోకి దూసుకెళ్లింది. శ్రీకాకుళం కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సీతారాం ఆమదాలవలసకు తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. శ్రీకాకుళం వైపు వెళ్తున్న ఆటో ఒక్కసారిగా అడ్డురావడంతో దానిని తప్పించడానికి డ్రైవర్ కారును పక్కకు తీశాడు. దీంతో వాహనం సమీపంలో పంట కాలువలోకి దూసుకెళ్లింది. డ్రైవర్ చాకచక్యంగా వాహనాన్ని అదుపు చేయడంతో ప్రమాదం తప్పింది. అనంతరం తమ్మినేని సీతారాం మరో వాహనంలో ఆమదాలవలసలోని స్వగృహానికి చేరుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా