ఈనెల 18న ఏపీ కేబినెట్ భేటీ
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈనెల 18న రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్లో ఉదయం 11గంటలకు
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈనెల 18న రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్లో ఉదయం 11గంటలకు కేబినెట్ భేటీ జరగనుంది. ఈ భేటీలో కీలక అంశాలపై చర్చించి ఆమోదముద్ర వేయనున్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు, ఈనెల 25న 30లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ ఏర్పాట్లు, గృహ నిర్మాణం సహా ఇసుక సరఫరా సమస్యలు, తదితర అంశాలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకోనున్నారు. వివిధ విభాగాల్లో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించి ఆమోద ముద్ర వేయనున్నారు. మంత్రివర్గ సమావేశంలో ఎజెండాలోని అంశాలపై ఈనెల 16వ తేదీ మధ్యాహ్నం 3గంటలలోపు తగిన ప్రతిపాదనలు పంపాలని అన్ని విభాగాల అధిపతులకు సీఎస్ నీలం సాహ్ని ఆదేశాలు జారీ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
బుల్లెట్ రైలు.. మరో కీలక అప్డేట్ ఇచ్చిన అశ్వినీ వైష్ణవ్
-
దిల్లీకి మళ్లీ నిరాశే.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్